ఈ సంక్రాంతికి విజయవాడ నగర వాసులను కనువిందు చెయ్యనున్న ఎయిర్ షో కోసం, ఎయిర్ క్రాఫ్ట్స్ గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన పైలట్స్, ఇవాళ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రిహర్సల్స్ చేసారు.
జనవరి 12న సాయంత్రం 4 గంటలకు పున్నమి, భవానీ ఘాట్లో నాలుగు విమానాలతో ప్రదర్శన ప్రారంభం అవుతుంది. 13, 14 తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి 11.45 గంటల వరకూ, సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 గంటల వరకూ ప్రదర్శనలు కనువిందు చేస్తాయి.
దీనికి 500లకు పైగా వివిధ స్థాయి డెలిగేట్స్ హాజరుకానున్నారన్నారు. కేంద్ర పౌర విమానశాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఈ సమ్మిట్ ప్రారంభిస్తారు, ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.
Advertisements