ॐ ..శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం విజయవాడలో అమ్మవారి అలంకారం- *శ్రీ స్వర్ణకవచాలంకృతదుర్గాదేవీ* ॐ

మాతర్మే మధుకైటభఘ్ని మహిష 
ప్రాణాపహారోద్యమే
హేలానిర్మిత ధూమ్రలోచనవథే,
హేమాంచ మండార్ధిని!
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే| నిత్యే| 
నిశుంభావహే
శుంభధ్వంసిని సంహరాశు దురితం 
దుర్గే- నమస్తేంబికే!!

పూర్వం మాధవవర్మ మహారాజు విజయవాటికాపురిని ధర్మం తప్పక పాలించు సమయాన, రాజ కుమారుని రథ చక్రాలకింద ఓ బాలుడు మరణించగా తన కుమారుడని ఉపేక్షించక మరణశిక్ష విధించిన రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు పురమందు కొన్ని ఘడియలు కనకవర్షం కురిపించింది. అప్పటినుండి అమ్మ కనకదుర్గ గా కొలవబడుతూ దసరా మహోత్సవంలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ గా అలంకరించడం జరుగుతున్నది..అమ్మ దర్శనం.. స్మరణం..పఠనం వల్ల సకల దారిద్ర్యములు నశించును

dasara day 1 2017 2

Advertisements