రేపటి నుంచి గన్నవరం-కాశీ మధ్య బోయింగ్‌ సర్వీస్ మొదలుకానుంది. 189 మంది ప్రయాణికులు పట్టే భారీ బోయింగ్‌ 737- 800, విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు, ఎయిర్‌బస్‌ - 320 లాంటి పెద్ద విమానలనే చుసిన గన్నవరం ఎయిర్‌పోర్టు, ఇప్పుడు బోయింగ్‌ 737- 800 లాంటి భారీ విమానాన్ని చూడనుంది. గన్నవరం విమానాశ్రయం చరిత్రలోనే ఇంత పెద్ద భారీ విమానం నడవటం ఇదే మొదటిసారి. గన్నవరం నుంచి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశీకి నేరుగా ప్రత్యేక విమానం అందుబాటులోకి తీసుకురానుంది స్పైస్ జెట్.

ఈ ఫ్లైట్ సర్వీస్ రేపటి నుంచి (ఫిబ్రవరి 19) నుంచి, మధ్యాహ్నం 2.40కి గన్నవరం నుంచి బయలుదేరి, సాయంత్రం 6.50కి వారణాశి చేరుకుంటుంది. తిరిగి మర్నాడు ఉదయం 10 గంటలకు వారణాశిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

కేవలం 4 గంటల 15 నిమిషాల్లో కాశీకి చేరుకునేలా భారీ విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటివరకూ వారణాసికి విమానంలో వెళ్లాలంటే ఇక్కడి నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులో ఢిల్లీకి చేరుకుని ఆక్కడి నుంచి మరోటి మారాల్చి వస్తోంది. రైలు, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు 30 గంటల పైనే పడుతోంది. నేరుగా విమాన సర్వీసు అందుబాటులోనికి రావడం వల్ల నాలుగు గంటల్లోనే కాశీకి చేరుకునేందుకు వీలుంటుంది.

Advertisements