గన్నవరం విమానాశ్రయం సుంచి రాజస్తాన్ రాజధాని జైపూర్ కు మార్చి నుంచి విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. బెంగళూరు మీదుగా జైపూర్ కు రోజువారి విమాన సర్వీస్ సడిపేందుకు ఎయిర్ కోస్తా సంస్థ ముందుకొచ్చింది.

ఈ ఏడాది మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభంకాసున్న ఈ విమాన సర్వీసుకు సంబంధించిన ప్రయాణ షెడ్యూల్ ఎయిర్ కోస్టా విడుదల చేసింది. ఈ విమాన సర్వీసు ఉదయం 7 గంటలకు గస్నవరం నుంచి బయల్దేరి 8 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. ఆర్థ గంట విరామం తర్వాత అక్కడి నుండి బయల్దేరి 10.40కు జైపూర్ చేరుకుంటుంది.

తిరిగి సాయంత్రం 6.20కు జైపూర్ నుంచి బయల్దేరి రాత్రి 8.25కు బెంగళూరుకు, అక్కడి నుంచి 8.45కు బయల్దేరి రాత్రి 9.40కు గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుంటుంది.

దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు పొందిన ఎయిర్ కోస్టా మరిన్ని విమాన సర్వీసులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఎయిర్పోర్టులో నూతన టెర్మినల్ ప్రారంభంతో కొత్త విమాన సర్వీస్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Advertisements