విజయవాడ కు చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ 'మాంటిస్సోరీ మహిళా కళాశాల' కరస్పాండెంట్ డాక్టర్ వి.కోటేశ్వరమ్మ గారికి, 2017 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది.

మాంటిస్సోరినే ఇంటిపేరుగా మార్చుకున్న కోటేశ్వరమ్మ ఎన్నో విద్యాసంస్థలు స్థాపించి, మహిళా విద్య కోసం ఎంతో కృషిచేశారు. ఆమెను అందరూ ఆదర్శ మహిళ కోటేశ్వరమ్మ అని పిలుచుకుంటారు. ప్రతికూల వాతావరణంలో పాఠశాలను ప్రారంభించి, ఎందరో మహిళలకు దర్శంగా నిలిచారు.

ఎన్నో కష్టాలు పడి విద్యా సంస్థలను నెలకొల్పి, ఆడపిల్లల చదువుకోసం అవిరళ కృషి చేసిన కోటేశ్వరమ్మ గారిని కేంద్రం గుర్తిచటం, విజయవాడ కే కాదు, మన రాష్ట్రానికే గర్వ కారణం.

2015 లో కోటేశ్వరమ్మ గారి విశిష్ట సేవలకు, గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించారు.

2013లో మిస్ అమెరికా నీనా దావులూరి, కోటేశ్వరమ్మ గారి మనవరాలు (కూతురి కూతురు).

Advertisements