గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యత పై ప్రతిపాధనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టరు బాబు.ఎ. రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ఏర్పాటుపై కంపెనీ ప్రతినిధులు, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా, రెవిన్యూ అధికారులతో బుధవారం ఎయిర్ పోర్టు లాంజిలో జిల్లా కలెక్టరు బాబు.ఎ. ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐటి సూట్ గా తీర్చిదిద్దేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇందులో ఎపిఐఐసికి చెందిన కేసరపల్లిలోని భూములను హెచ్.సి.ల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టరు పరిశీలించారు.

<div style="text-align: center;">

</div>

ఎయిర్ పోర్టు పరిశర ప్రాంతాల్లో నిర్మించే భవనాలకు ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియూ వారి అనుమతి తప్పనిసరిగా కావడంతో దీనిపై ఎయిపోర్టు అధికారులతో కలెక్టరు చర్చించారు.

పరిశీలనలో జిల్లా కలెక్టరు తో పాటు హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టు కంపెనీ ప్రతినిధులు, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్.రంగయ్య, గన్నవరం తాహసిల్టారు మాధురి, ఎపిఐఐసి అధికారులు తదితరురు ఉన్నారు.

Advertisements