స్వర్గీయ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎన్టీఆర్ ట్రస్తు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. విజయవాడలో సిద్దార్థ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియంలోకి ప్రజలను అనుమతిస్తారు.

ఇందులో ఎన్టీఆర్ కు సంబంధించి వివిధ చిత్రాలను ఆకర్షణీయంగా ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ సాంస్కృతిక కార్య క్రమాలు, ఎన్టీఆర్ పాటలు, ప్రముఖుల జ్ఞాపకాలు, సాహిత్య గోష్టి తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisements