ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల నిమిత్తం అర్ధరాత్రి నుంచి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భద్రత నిపుణుల ప్రత్యేక కమిటి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజీ గేట్లు మరమత్తులు చేయులాని నిర్ణయించారు. దీంతో ఈనెల 17వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బ్యారేజ్ వైపు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు, విజయవాడ వైపు నుంచి వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు. దీంతో సచివాలయానికి యానికి వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నయ మార్గాలు పోలీసులు సూచించారు.

హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి, సితారా సెంటర్, చిట్టినగర్, విజి చౌక్, పంజా సెంటర్ లో బ్రిడ్డి, ప్రకాశం విగ్రహం, పోలీసు కంట్రోల్ రూము, రాఘవయ్య పార్కు సెంటర్, NH-65, కనకదుర్గ వారధి, తాడేపల్లి పాత టోల్గేటు, ఎన్ టి ఆర్ కట్ట, రైల్వే అండర్ పాస్, స్ర్కూ బ్రిడ్డి, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహలు, పెనుమాక, కృష్ణయ్యపాలెం, మందడం గ్రామం, మల్టిపురం జంక్షన్, వెలగపూడి మీదుగా వెళ్ళాలి.

లేదా, చిట్టినగర్, విజి చౌక్, బ్రాహ్మణ వీధి, బొడ్డు బొమ్మ, వినాయక టెంపుల్, సీతమ్మ వారి పాదాలు, NH-65, కనకదుర్గ వారధి, తాడేపల్లి పాత టోల్గేటు, ఎన్ టి ఆర్ కట్ట, రైల్వే అండర్ పాస్, స్ర్కూ బ్రిడ్డి, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహలు, పెనుమాక, కృష్ణయ్యపాలెం, మందడం గ్రామం, మల్టిపురం జంక్షన్, వెలగపూడి మీదుగా వెళాలి.

అదే విధంగా కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు, పి ఎస్ ఆర్ విగ్రహం, బొడ్డు బొమ్మ, వినాయక టెంపుల్, సీతమ్మవారి పాదాలు, ఎన్ హెచ్-65, వారధి, తాడేపల్లి, ఎన్టీఆర్ కట్ట తదితర మార్గాల ద్వారా సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది.

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్, బెంజ్ సర్కిల్, స్ర్కూబ్రిడ్డి, వారధి మీదుగా, వారధి నుంచి వెలగపూడి వెళ్లేందుకు ఉండవల్లి సెంటర్, డాన్ బాస్కో స్కూల్ జంక్షన్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, వెలగపూడి వెళ్లాల్సి ఉంటుంది.

నగర ప్రజలు, ట్రాఫిక్ మళ్లింపులు గుర్తించి సహకరించాలని పోలీసులు కోరారు.

Advertisements