విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆటోలో పర్యటిస్తూ దుర్గా ఫైఓవర్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఆయన నందిగామ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. దుర్గగుడి వద్ద కారు దిగి, ఆటో ఎక్కి ఫైఓవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ దుర్గా ఘాట్ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద తదితర ప్రాంతాలలో చేపట్టిన నిర్మాణ పనుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఆ రూట్ లో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను ఎంపి నాని గమనించారు. స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా దుర్గగుడి పై వంతెన పనులను పూర్తి చేసి ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. ఎంపి నాని ఆటోలో ప్రయాణించడాన్ని చూసిన ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Advertisements