విజయవాడ నగరంలో ఆదివారం జరగనున్న మారథాన్ పరుగును పురస్కరించుకుని ఈ పరుగులో పాల్గొనే ఔత్సాహికులకు, క్రీడాకారులకు ఈ మారధాన్ పరుగు నిర్వహించే మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, నగర ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

బందరు రోడ్డుపై వెటర్నరీ జంక్షన్ నుండి డిసిపి బంగ్లా, రాఘవయ్య పార్క్, ఆర్టిసి వై జంక్షన్, పోలీస్ కంట్రోల్ రూం, ప్లైఓవర్, కార్పస్ వంతెన, సీతమ్మవారి పాదాలు, ప్రకాశం బ్యారేజీ వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు ఎటువంటి ట్రాఫిక్ అనుమతించరు.

బెంజిసర్కిల్ నుండి వన్ టౌన్ వైపు
బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ జంక్షన్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, శిఖామణి సెంటర్, రెడ్ సర్కిల్, సివిల్ కోర్టులు, రాజగోపాలాచారి వీధి, చల్లపల్లి బంగా, రైల్వేస్టేషన్, ప్రకాశం బొమ్మ, గద్దబొమ్మ కాళేశ్వరరావు మార్కెట్

వన్ టౌన్ నుంచి బెంజిసర్కిల్ వైపు
లోబ్రిడ్డి, ప్రకాశం బొమ్మ, పాత ప్రభుత్వ హాస్పటల్, ఏలూరు లాకులు, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్డు, చుట్టగుంట, నైస్ బార్ జంక్షన్, మధు గార్డెన్స్, సిద్దార్ధ కళాశాల జంక్షన్, మదర్ థెరిస్సా జంక్షన్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ జంక్షన్

బస్టాండ్ నుండి బెంజిసర్కిల్ వైపు
బెంజిసర్కిల్, స్ర్కూబ్రిడ్డి, నేషనల్ హైవే, కృష్ణలంక పోలీస్ స్టేషన్, బస్లాండ్ మరియు అదే విధంగా వెనుకకు వెళ్లవలెను.

బస్టాండ్ నుండి కృష్ణలంక వైపు
బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ జంక్షన్ నుండి పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు చేరుకోవాలి

నందిగామ వైపు
నందిగావు మరియు జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్టిసి బస్ సర్వీసులన్నీ ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు, ఆర్టిసి బస్టాండ్ నుండి కాక తుమ్మలపల్లి కళాక్షేత్రం, కాళేశ్వరరావు మార్కెట్ నుండి నడుస్తాయి.

Advertisements