గన్నవరం విమానాశ్రయం నూతన శోభ సంతరించుకుంది. నేడు కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవంతో పాటు రన్ వే నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రుల చరిత్రతో పాటు అమరావతి వైభవం, విజయవాడ సాంస్కృతిక వైభవం, శిల్ప కళ, చరిత్ర ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్న ఐదు వందల సంవత్సరాల నాటి అమరావతి శిల్పాల నమూనాలను విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. చైనా, లండన, ఆమెరికాతో పాటు మన దేశంలోనే వివిధ రాషా్ట్రల్లో ఉన్న అమరావతి శిల్పాల నమూనాలు ఇందులో ఉన్నాయి. ఈ నమూనాలను పర్యాటక శాఖ ఈడీ మల్లికార్జున ఆధ్వర్యంలో దేశవిదేశాల్లో 80 చోట్ల ప్రదర్శించారు. ఇప్పుడు వీటిని గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. అమరావతి వైభవం తెలియజేసేందుకు జిల్లా కలెక్టర్ బాబు.ఎ దగ్గరుండి ఈడీ మల్లికార్జున్ తో వీటిని ఏర్పాటు చేయించారు.
Advertisements