మైక్సోసాఫ్ట్ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ‘ఫ్యూచర్ డీకోడెడ్’ సదస్సులోసమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నది ఆయన వివరించారు. ఐవోటీతో అద్భుతాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్‌లో నిరూపించామని ఆయన తెలిపారు. హుద్‌హుద్‌ వంటి భారీ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. సాంకేతికతతో అన్ని రంగాలకూ భద్రత కల్పిస్తున్నామన్నారు. కలలు కనండి.. వాటిని సాధించడానికి పనిచేయండి (‘డేర్‌ టు డ్రీమ్‌.. స్రైవ్‌ టు ఎచీవ్‌’) అనే నినాదంతో ఏపీ ముందుకు సాగుతుందని చంద్రబాబు తెలిపారు.

ఉపాధి, ఇంటర్నెట్ నాలెడ్డి, గృహ, నీరు, పశు దాణ భద్రత వంటివి కల్పిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలు, రోడ్లు, పరిశ్రమలు తదితర అంశాలపై దృష్టి సారించామన్నారు. డిజిటలైజేషన్ కు సంబంధించి ముఖ్యమంత్రుల కమిటీకి తాను చైర్మన్ గా వ్యవహరిస్తున్నానని, ఇప్పటికే మధ్యంతర నివేదిక అందచేశామని, త్వరలో పూర్తి స్థాయి నివేదిక అందచేస్తామన్నారు. విశాఖను తొలి డిజిటల్ నగరంగా ఆవిష్కరించేందుకు నాంది పలుకుతున్నామన్నారు. సాంకేతికను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.

రియల్ టైమ్ గవర్నెన్సులో క్రైజాలా యాప్ కీలకపాత్ర వహిస్తోందని, రాష్ట్రంలో 62 వేల మంది పోలీస్ అధికారులు దీన్ని ఉపయోగించి క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని తెలుసుకుంటున్నారని వివరించారు. 14.4 మిలియన్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, మరో సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహణలో కీలకమైన క్లౌడ్-ఫస్ట్ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. రాష్ట్రంలో నైపుణ్యాల ఉపాధి కల్పన పై సత్య నాదెళ్లతో సిఎం చర్చించారు. రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్సులో మైక్రోసాఫ్ట్ తో కలిసి ప్రయోగం చేయబోతున్నామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read