ఉత్తర్ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్(44)గా ప్రమాణస్వీకారం చేశారు. లఖ్నవూలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్నాథ్సింగ్, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్యాదవ్, ములాయంసింగ్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. బాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు.
Advertisements