పాలనా బాధ్యతల్లో క్షణం తీరిక లేకుండా ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్రికెట్ బ్యాట్, బాల్ పట్టుకుని తమలోని ఆటకు పదును పెట్టారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, ఆంద్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన మూలపాడులోని క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్న లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాక్టీసు మ్యాచ్లు జరుగుతున్నాయి.

చీఫ్ సెక్రటరీ ఎలెవన్, డీజీపీ ఎలెవన్ జట్ల మధ్య ఈ నెల 26న మూలపాడులోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరిగే 15 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. 50 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ మ్యాచులు ఆడనున్నారు. ఐఏఎస్ టీంను అజయ్ కల్లం, ఐపీఎస్ టీంను డిజిపి సాంబశివరావు కెప్టన్లుగా వ్యవహరిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read