విశాఖపట్నం, అది మన నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని... మహా నగరం విశాఖ హుద్‌హుద్‌ తుపాన్‌ దెబ్బకు కుదేలైపోయింది. ఎదుగుతున్న సుందర నగర భవిత ఇక ఇప్పుడు అంధకారమే అనుకున్నారు అందరూ... ఈ రెండు ఏళ్ళలో వైజాగ్, పడింది, లేచింది, నిలబడింది, ప్రకృతి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు పరిగెడుతుంది...ఇది ఆంధ్రావాడి దమ్ము అంటే...

తుఫానుకి అతలాకుతలం అయిన విశాఖ, సంవత్సరం తిరగకుండానే, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 5వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు ఏకంగా, రెండో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చేందుకు, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం సిద్ధమవుతుంది.

విశాఖకు సుందర నగరంగానే కాదు, ఉపాధి కేంద్రంగా మంచి పేరు ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా వాసులతో పాటు, ఇటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు కూడా విశాఖలో ఉపాధి అవకాశాలను చూసుకుంటారు. అలాగే, పొరుగున ఉన్న ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కూడా విశాఖకు పొట్ట చేత పట్టుకుని వస్తూంటారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్ధలతో పాటు, వందలాదిగా ప్రైవేటు రంగంలోనూ ఉన్నాయి.

మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎప్పటికీ, శాంతి భద్రతలతో, పూర్తి ప్రశాంతంగా ఉండాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి... ఈ క్రింద వీడియో చూడండి, ఎక్కడ నుంచి, ఎక్కడకి వచ్చామో... వైజాగ్ సిటీ ఇలాగే కలకలలాడుతూ ఉండాలి....

Advertisements

Advertisements

Latest Articles

Most Read