trittec in ap 17012017

చైనాలో దోమ తెరల తయారీలో పేరొందిన Trittec సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఆధునిక దోమ తెరలు, విండో ఫ్రేమ్స్ రూపకల్పనలో పేరొందిన ట్రిట్టెక్ ధారాళంగా గాలి ప్రసారిస్తూ, క్రిస్టల్ క్లియర్ వ్యూతో కూడిన మెష్‌లు, అత్యంత పలచటి నెట్ల తయారీలో మేటిగా వుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఈ సంస్థ ఆసక్తి కనబరిచింది.

తమ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 5 వేల చదరపు మీటర్ల స్థలం కేటాయిస్తే 500 మందికి పైగా ఉపాధి కల్పిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ నెలకొల్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే యోచన వుందని వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read