భవానీ ఐలాండ్ లో అంతర్జాతీయ స్థాయిలో లేజర్ షో - మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటుకు టెండర్లను టూరిజం డిపార్టుమెంట్ ఖరారు చేసింది. రూ.16 కోట్లతో కూడిన మెగా ప్రాజెక్టును "ప్రీమియం వరల్డ్ సంస్థ" కాంట్రాకు దక్కించుకుంది.

ఈ సంస్థతో త్వరలో టూరిజం డిపార్టుమెంట్ ఎంఓయూ కుదుర్చుకుంటుంది. ఈలోపు ప్రాజెక్టుకు సంబంధించి ద్వీపంలో నిర్వహించాల్సిన విధానానికి ఆర్ఎఫ్ పీని విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు నెలల కిందట రూ.16 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిధులను సంబంధిత శాఖకు బదిలీ చేసింది. పనులు ప్రారంభిస్తే రెండు, మూడు నెలల్లోనే కాంట్రాకు సంస్థ పూర్తి చేయాల్సి ఉంది.

Advertisements