భవానీ ఐలాండ్ లో అంతర్జాతీయ స్థాయిలో లేజర్ షో - మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటుకు టెండర్లను టూరిజం డిపార్టుమెంట్ ఖరారు చేసింది. రూ.16 కోట్లతో కూడిన మెగా ప్రాజెక్టును "ప్రీమియం వరల్డ్ సంస్థ" కాంట్రాకు దక్కించుకుంది.

ఈ సంస్థతో త్వరలో టూరిజం డిపార్టుమెంట్ ఎంఓయూ కుదుర్చుకుంటుంది. ఈలోపు ప్రాజెక్టుకు సంబంధించి ద్వీపంలో నిర్వహించాల్సిన విధానానికి ఆర్ఎఫ్ పీని విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు నెలల కిందట రూ.16 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిధులను సంబంధిత శాఖకు బదిలీ చేసింది. పనులు ప్రారంభిస్తే రెండు, మూడు నెలల్లోనే కాంట్రాకు సంస్థ పూర్తి చేయాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read