kcr 31032016

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాళ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలంగాణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌ మధ్యలో ఆయన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, ఎక్కడికెళ్లిన రూపాయి నాణేలను తీసుకెళ్లేవారట. ఒకవేళ కేసీఆర్ మరిచిపోతే తనకు 35 ఏళ్ళు గా డ్రైవర్ గా సేవ చేస్తున్న బాలయ్య 10, 12నాణేలు దాకా తీసుకెళ్లేవారట.

అయన పర్యటనలో గోదావరి, కృష్ణా నదులు దాటాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నది ప్రాంతంలో నాణేలు వేసి గోదారమ్మ, కృష్ణమ్మను ప్రార్ధించే వారు అంట. ఈ ఆచారం పెద్దలు నేర్పినటువంటి పాఠం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కృష్ణా, గోదావరినదుల్లో తాను వేసిన నాణేలు తెలంగాణలో ఏ వ్యక్తి వేసి ఉండకపోవచ్చని కేసీఆర్ తెలిపారు.

{youtube}8oN81nxgA0Y|500|250|1{/youtube}

Advertisements

కేసీఆర్ ఏ పర్యటనకెళ్లినా రూపాయి బిళ్ల తీసుకువెళ్లటం మర్చిపోరు అంట..ఎందుకో తెలుసా.! Last Updated: 31 March 2016