ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ రామకృష్ణ హౌజింగ్‌ మంగళగిరిలోని ఖాజా గ్రామంలో రామకృష్ణ టెక్నో టవర్జ్‌ పేరిట అధునాతన వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది... 11 లక్షల చ.అ.ల్లో 25 అంతస్తుల్లోని ఈ భవన సముదాయంలో 500 చ.అ. నుంచి 20 వేల చ.అ. స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, లేకపోతే రెంట్ కు తీసుకోవచ్చు. 973 కార్లు పెట్టుకునే విధంగా 5 హై లెవల్స్‌ పార్కింగ్, 18 ఎలివేటర్స్, ఫిట్‌నెస్, లైఫ్‌ స్టయిల్‌ సెంటర్స్, ఫుడ్‌ కోర్ట్స్, రెస్టారెంట్లు, షాపింగ్‌ కేంద్రాలతో పాటూ ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఫర్నీచర్, లైటింగ్, ఔట్‌డోర్‌ వ్యూ, హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వంటి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు..

tech 21032018 2

అయితే, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టటానికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన DTP Policy... దీని ప్రకారం, మొదటి మూడు సంవత్సరాలకు ప్రభుత్వమే, ఈ ఐటి కంపనీలకు అద్దె చెల్లిస్తుంది... ఐటి కంపెనీలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుంది... దానికి అనుగుణంగా, ఈ వెంచర్ మొదలు పెట్టారు... ప్లగ్ అండ్ ప్లే, వాక్ తో వర్క్, రెంటల్ గ్యారెంటీతో, ఇక్కడ ఐటి కంపెనీలు మొదలు పెట్టుకోవచ్చు...

tech 21032018 3

రామకృష్ణ టెక్నో టవర్జ్‌, అధినేత రామకృష్ణ చెప్పిన ప్రకారం, హైదరాబాద్ కు హై టేక్ సిటీ ఎలా ఉందో, మన అమరావతిలో అలాంటి టవర్ నిర్మాణం కోసం, ఇది చేపట్టామని, ప్రభుత్వం కూడా ఐటి ని ఇక్కడ ప్రోత్సహిస్తుంది కాబట్టి, ఇక్కడ ఈ టవర్స్ నిర్మాణం చేపడుతునట్టు చెప్పారు... అక్టోబర్ 2017లో పనులు మొదలు పెట్టామని, పనులు వేగంగా జరుగుతున్నాయని, నవంబర్ 2018 నాటికి ప్రభుత్వానికి అప్పచేప్తామని చెప్పారు... ప్రభుత్వం ప్లగ్ అండ్ ప్లే కోసం, ప్రభుత్వం డిజైన్ ఫైనల్ చేస్తున్నారని, దాదాపు 100 కంపనీలు ఈ టవర్ లో వస్తాయని, 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఇప్పటికే 80 శాతం కంపెనీలు ఇప్పటికే బుక్ చేసుకున్నట్టు చెప్పారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read