ఏపీలో అధికారంలోకి వచ్చిన నుంచి జగన్ రెడ్డి ఆయన వ్యూహకర్తలు సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఎదురులేకుండా చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం-పరిహారం ఇవ్వడం ప్లాన్ ఏ. తమ అరాచకాలని ప్రశ్నించే మీడియా సంస్థలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం ప్లాన్ బీ. దీనికి లొంగని కిందిస్థాయి మీడియా సంస్థలు, యూట్యూబ్ చానళ్లు, ఎనలిస్టులని ప్యాకేజీ కింద కొనేయడం ప్లాన్ సీ. ఈ మూడు ప్లాన్లు అమలు చేయడంలో వైసీపీ ఎటువంటి మొహమాటాలకి పోవడం లేదు. టిడిపికి ఫేవర్ గా వివిధ చానళ్లలో విశ్లేషణలు చేస్తున్న ఒక ఎనలిస్టుని భారీ ప్యాకేజీకి కొనుగోలు చేసింది వైసీపీ. మరో యూట్యూబ్ చానెల్ పబ్లిక్ బైట్స్ విపరీతంగా తీసుకుని ప్రభుత్వ వ్యతిరేకతని ప్రొజెక్ట్ చేస్తోందని ముందుగా ఆ చానెల్ ప్రతినిధులపై కేసులు పెట్టారు. ఈ తరువాత బెదిరించారు. చివరికి బేరానికి వచ్చారని తెలిసి కోట్లకి ఆ యూట్యూబ్ చానెల్ ని కొనేశారు వైసీపీ పెద్దలు. టివీ5, ఈనాడు, ఏబీఎన్ కొనగలిగే శక్తి ఉన్నా అమ్ముడుపోయే సంస్థలు కాకపోవడంతో సీఐడీని దింపి అటాచ్మెంట్లు..కేసులు గ్యాప్ లేకుండా బిగించేస్తున్నారు.
చివరకు యూట్యూబ్ లో కూడా.. ప్లాన్ ఏ, లేకపోతే ప్లాన్ బి.. ఇదే వైసీపీ పెద్దల వ్యూహం..
Advertisements