april fool 01042016

ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది అంటే, పక్కవాళ్ళని ఆట పట్టించి, "ఏప్రిల్ ఫూల్" అంటాం. అల ఎందుకు అంటామో, దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే, యూరప్ గురించి చెప్పాలి. 1582వ సంవత్సరం దాక యూరప్ లో నూతన సంవత్సర వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేదీ వరకు, పది రోజుల పాటు గ్రాండ్ గా జరుపుకునే వారు. 1582లో అప్పటి ఫ్రాన్స్ రాజు తొమ్మిదో ఛార్లెస్ అప్పటి వరకు ఫాలో అయిన క్యాలెండర్ ను మార్చేసి, గ్రెగేరియన్ క్యాలెండర్ ను ఆమోదించాడు.

ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ప్రజలకి రాజుగారి ఆదేశం చేరలేదు. ఈలోగా మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజు ఆదేశం ప్రకారం చాలా మంది ప్రజలు జనవరి ఫస్ట్ రోజున కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. రాజుగారి ఆదేశం తెలియని వాళ్లు పాత పద్ధతిలో ఏప్రిల్ ఫస్ట్ వరకు ఆగి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

న్యూ ఇయర్ గా జనవరి ఫస్ట్ న వేడుకలు చేసుకున్న వాళ్లు, ఏప్రిల్ ఫస్ట్ ను సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లను ఫూల్స్ అంటూఆటపట్టించారు. పేపర్తో చేప బొమ్మలు తయారుచేసి వాళ్ల వెనక భాగాన కట్టి ఆటపట్టించేవాళ్లు. గేలానికి దొరికే చేపలకింద జమ కట్టేవాళ్లు. ఏప్రిల్ ఫిష్ అంటూ ఆటపట్టించేవాళ్లు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్ ఫూల్స్ డే గా మారిపోయింది. ఇలా ఆటపట్టించే విధానం తరువాత ప్రపంచం అంతా పాకింది. ఇదీ ఏప్రిల్ ఫూల్స్ డే హిస్టరీ.

kcr and Tirumala 31032016

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రత్యేక రైలులో తిరుపతికి రానున్నారు. ఆయనతో పాటు పది జిల్లాల ప్రజలు కుడా వస్తున్నారు. ఎందుకో తెలుసా ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి కెసిఆర్ వస్తున్నారు. అందుకోసం ఓ ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీవారికి రూ.5 కోట్ల కానుక‌లు చెల్లిస్తారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని చెప్పారు.

కేసీఆర్ తిరుమ‌ల వెంక‌న్న‌కు మొక్కులు తీర్చుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గ‌తంలోనే జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం తిరుమల వెంకన్నకు ఏడు కోట్ల ఆభరణాలు కానుకగా ఇవ్వనున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 15 గ్రాములతో ముక్కుపుడక మొక్కు కుడా కెసిఆర్ త్వరలో తీర్చుకోనున్నారు.

ravi sriram 31032016

దివంగత పరిటాల రవీంద్ర అంటే రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉండరు. అనంతపురం జిల్లా ప్రజలకి పరిచయం అక్కర్లేదు. చాలా మందికి రవి ఒక ఫ్యాక్షనిస్ట్ గానే తెలుసు. కాని అయన చేసిన సామజిక కార్యక్రమాలు ఏ రాయలసీమ నేత చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ కరువుతో అల్లాడుతూ, పిల్లల పెళ్లిళ్లు చేయడం తల్లిదండ్రులకు కనాకష్టంగా మారింది. ఆ తరుణంలో పరిటాల రవీంద్ర హయాంలో పేదలకు ఉచిత సామూహిక వివాహాలు చేపించేవారు. ఇప్పుడు అయన పోయనాక కుడా, అయన తనయుడు శ్రీరామ్‌, తల్లి పరిటాల సునీత సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ గొడవల్లో తలమున్కలై ఉన్న సమయంలో కూడా పేదల కోసం ఉచిత సామూహిక వివాహాలను ఆట్టహాసంగా చేయిస్తూనే ఉండేవారు. కాని పరిటాల రవీంద్ర హత్యా తరువాత కొంతకాలం ఈ సంప్రదాయానికి బ్రేక్‌పడింది. మళ్ళి ఇప్పుడు, పరిటాల ట్రస్ట్ ద్వారా ఉచిత సామూహిక వివాహాలను జరిపించడానికి పరిటాల శ్రీరామ్‌ ముందుకొచ్చారు. ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ సామూహిక వివాహాలకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు.

ఒక్కో జంటకు పదివేల రూపాయల ఖర్చుతో చీర, తాళిబొట్టు, ఇతర సామాగ్రిని పరిటాల శ్రీరామ్‌ సమకూర్చుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చినా భోజన ఏర్పాట్లకు లోటురానివ్వరట.

ఎంతైనా ఫ్యాక్షన్ పక్కన పెట్టి, ఇలా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి అనుకోవటంలో ప్రజలు శ్రీరామ్ ని అభినందిస్తున్నారు. అలాగే రాజకీయంగా కూడా శ్రీరామ్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారట

{youtube}bQZBXXIPV1U|500|250|1{/youtube}

kcr 31032016

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాళ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలంగాణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌ మధ్యలో ఆయన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, ఎక్కడికెళ్లిన రూపాయి నాణేలను తీసుకెళ్లేవారట. ఒకవేళ కేసీఆర్ మరిచిపోతే తనకు 35 ఏళ్ళు గా డ్రైవర్ గా సేవ చేస్తున్న బాలయ్య 10, 12నాణేలు దాకా తీసుకెళ్లేవారట.

అయన పర్యటనలో గోదావరి, కృష్ణా నదులు దాటాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నది ప్రాంతంలో నాణేలు వేసి గోదారమ్మ, కృష్ణమ్మను ప్రార్ధించే వారు అంట. ఈ ఆచారం పెద్దలు నేర్పినటువంటి పాఠం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కృష్ణా, గోదావరినదుల్లో తాను వేసిన నాణేలు తెలంగాణలో ఏ వ్యక్తి వేసి ఉండకపోవచ్చని కేసీఆర్ తెలిపారు.

{youtube}8oN81nxgA0Y|500|250|1{/youtube}

revanth telangana 30032016

ప్రస్తుతం తెలంగాణా అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ ఇదే. రేవంత్ కు కెసిఆర్ సీటు కేటాయించారు కదా అనే చర్చ కొనసాగుతోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే. టీడీపీలో ఉన్న మొత్తం 15 మందిలో 12 మంది టీఆర్ఎస్ లో చేరాక, అసెంబ్లీలో కూర్చునే సీట్లల్లో మార్పులుచేర్పులు చేశారు. రేవంత్ రెడ్డికి సీటు నెంబర్ 123 కేటాయించారు స్పీకర్ మధుసూదనాచారి.

అయితే ఏంటి అంటారా ? 123 నెంబర్ సీట్లో గతంలో కేసీఆర్ కూర్చునే వారు. 1999లో టీడీపీకి గుడ్ బై చెప్పిన కేసీఆర్, ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పుడు స్పీకర్ గా ఉన్న ప్రతిభా భారతి ఆయనకు సీటు నెంబర్ 123 కేటాయించారు.

గతంలో కేసీఆర్ కూర్చున్న సీటునే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణా అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఆ సీట్లో కూర్చున్న కేసీఆర్ ఇప్పుడు సిఎం అయ్యారు. ఆ సెంటిమెంట్ తో, భవిష్యత్ లో రేవంత్ రెడ్డి కుడా సిఎం అవుతారేమో అని గుసగుస లాడుతున్నారు. చూద్దాం...