lokesh 0040622016

తెలుగుదేశం పార్టీలో రాజకీయ మార్పులు జరగనున్నాయా?త్యాగాలు చేసేందుకు నాయకులూ సిద్దమవుతున్నారా?కొట్టాను కోట్లు కర్చు పెట్టి గెలిచి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వీరు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?ఏమిటా నిర్ణయం?తెలుసుకోవాలని ఉందా?అయితే తెలుసుకోండి.

గత కొద్ది కాలంగా తెలుగుదేశంలో విపరీతంగా వినిపిస్తున్న ఒక వార్తని నిజం చేసేందుకు తమ జీవితాలనే పణంగా పెట్టారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్.ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు.గత కొద్ది కాలంగా లోకేష్ ని రాజ్యసభ కి పంపి కేంద్ర మంత్రి చేస్తారని, కాదు కాదు రాష్ట్ర మంత్రి వర్గం లోకే తీసుకుంటారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే లోకేష్ లాంటి విద్యావంతుడు, దూరద్రుస్తికలవాడు రాజకీయాల్లోకి రావడం మంచిది, రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు అవుతుంది అని భావించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దానికి అవసరమైతే అయన పదవిని త్యాగం చేయడానికి సిద్దమయ్యారు. దీనికి తగ్గట్టుగానే అయన అడుగులు సైతం వేసారు.నియోజకవర్గంలో తానె కాదు ఏ తెలుగుదేశం అభ్యర్ది వచ్చిన నియోజికవర్గ అభివృద్ధి జరుగుతుంది దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తానూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటా అని నియోజకవర్గంలోని ప్రజలు అందరికి హామీ ఇచ్చిన బోడె ప్రసాద్ "నారా లోకేష్" ని మంత్రి వర్గం లో తీసుకోవాలి!! ఈ నినాదం తో శాశనసభ నుండి లోకేష్ ని రంగంలోకి దిగేందుకు వీలుగా బోడె ప్రసాద్ గారు రాజీనామా చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు. నేడు చంద్రబాబు గారిని కలిసి నారా లోకేష్ ను వారి నియోజకవర్గాల నుండి భారీ మెజారిటీతో గెలిపించెoదుకు సిద్ధం అని ఒప్పించేoదుకు కలవబోతున్నారు. అలాగే బోడె ప్రసాద్ దారిలోనే శాశన మండలి నుంచి ఐతే బుద్ధా వెంకన్న గారూ కుడా రాజీనామా చేసేందుకు సిద్దమని ప్రకటించారు. మరి అధింటే వీరి నిర్ణయాన్ని స్వాగతిస్తారా? లేక అనవసర ఆలోచనలు విరమించుకోమని మండలిస్తారా? అనేది చూడాలి.

Advertisements

లోకేష్ త్యాగంకి పోటీ పడుతున్న బోడె,బుద్దా... Last Updated: 06 April 2016