అమరావతి... మొన్నటి వరకు 5 కోట్ల ఆంధ్రుల గర్వం... భవిష్యత్తు మీద ఆశ... కాని ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడు అమరావతి ఒక ప్రాధాన్యతా అంశం కాదు... అమరావతి పై ప్రతిపక్షంలో ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వైఖరి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగింది. అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ వెళ్ళిపోయింది, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వెళ్ళిపోయింది, అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుని ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఆగిపోయారు, స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధి చేస్తాం అన్న సింగపూర్ ప్రభుత్వం ఆగిపోయింది.. ఇలా అమారావతిలో అన్నీ రివెర్స్ లో జరుగుతున్నాయి. చివరకు అమరావతి నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రధాని మోడీని కలిసి, ప్రస్తుతానికి అమరావతికి డబ్బులు అవసరం లేదు, తరువాత చూద్దాం అని చెప్పారు అంటే ఆయన వైఖరి ఇక్కడే అర్ధమైపోతుంది.

amaravati 09092019 2

అయితే ప్రపంచ బ్యాంక్, అమరావతికి రుణం ఇవ్వకుండా తప్పుకున్న సమయంలో, జగన్ ప్రభుత్వం, శాసనసభ సాక్షిగా చెప్పిన విషయాలు, చేసిన ఆరోపణలు తప్పు అని ఈ రోజు తేలిపోయింది. ప్రపంచ బ్యాంక్ తప్పుకున్న సమయంలో, అంతా చంద్రబాబు వైఖరి వల్లే, చంద్రబాబు అవినీతి చూసే ప్రపంచ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది అంటూ, జగన్ ప్రభుత్వం చెప్పింది. అయితే, ఇప్పుడు హన్స్ ఇండియా అనే జాతీయ పత్రిక చేసిన ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. అమరావతికి లోన్ ఇవ్వటంలో, ప్రపంచ బ్యాంక్ ఎందుకు వెనక్కు వెళ్లిందో తెలుసుకోవటానికి, హన్స్ ఇండియా, ఆర్టీఐ ద్వారా విషయాలు సేకరించింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, జూన్ 25, కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి సమీర్ కుమార్ ఖారే అనే అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ ఉన్న అధికారి, రాష్ట్రానికి లేఖ రాస్తూ, అమరావతి రుణం పై, మీ వైఖరి చెప్పండి అంటూ లేఖ రాసారు.

amaravati 09092019 3

అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలానటి స్పందన రాలేదు. మళ్ళీ జూలై 1న, బండా ప్రేయషి అనే డైరెక్టర్ ర్యాంక్ ఉన్న అధికారి, కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి రాష్ట్రానికి మరో లేఖ రాసారు.జూలై 23 న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి పర్యవేక్షణ చేసి లోన్ ఇస్తారు, మీరు ఏ సంగతి వెంటనే చెప్తే, మేము వారికి తెలియ చేస్తాం, మీ వైఖరి కోసం జూలై 15 వరకు సమయం ఇస్తున్నాం, ఈ లోపు మీరు అమరావతి రుణం పై ఒక స్పష్టత ఇవ్వండి, లేకపోతె, అమరావతి పై మీకు ఇంట్రెస్ట్ లేదని, మేము అర్ధం చేసుకుని, ఇదే విషయం ప్రపంచ బ్యాంక్ కు చెప్తాం అంటూ లేఖ రాసారు. అయితే జూలై 15 కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో, కేంద్రానికి విషయం అర్ధమైంది. జగన్ ప్రభుత్వానికి, అమరావతి అంటే ఇంట్రెస్ట్ లేదని తెలుసుకుని, ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంక్ కు చెప్పారు. దీంతో ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెంటనే ప్రకటించింది. కేంద్రం ఎన్ని సార్లు అడిగినా, జగన్ ప్రభుత్వం స్పందించక పోవటంతో, కేంద్రం కూడా ప్రపంచ బ్యాంక్ కు చెప్పేసింది. దీంతో దాదపుగా 7 వేల రూపాయలు రుణం, మన రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్ళిపోయింది.

రాజకీయాల్లో, ప్రత్యర్ధుల పై కక్షలు తీర్చుకోవటం, ఇప్పుడు సర్వ సాధారణం అయిపొయింది. వ్యవస్థల మీద ఇప్పటికే ప్రజలకు నమ్మకం పోయింది. ఇది వరకు రాజకీయం అంటే, విధానాల పై నడిచేది. నువ్వు చేసింది తప్పు అని, లేకపోతే కరెక్ట్ అని, ప్రజల ముందు చర్చకు పెట్టే వారు. ప్రజలు అన్నీ గమనించి నిర్ణయం తీసుకునే వారు. కాని రాను రాను రాజకీయం అంటే, వ్యక్తిగత కక్ష కంటే ఘోరం అయిపొయింది. ప్రత్యర్ధి పార్టీలోని వ్యక్తుల పై, అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలను వాది, తమ వైపు తిప్పుకోవటం, లేకపోతె కక్ష తీర్చుకోవటం చాలా సాధారణ విషయం అయిపొయింది. ప్రజలు కూడా దీనికి ట్యూన్ అయిపోయారు. రాజకీయ నాయకులు సవాళ్లు చేసుకుంటూ ఉంటారు కాని, ఎన్నికలు అయిపోగానే ఎవరు పని వాళ్ళు చూసుకుంటారు. సమస్య తీవ్రతను బట్టి, కేసులు వరకూ వెళ్తూ ఉంటాయి. కాని ఇలాంటి సందర్భాలు మొన్నటి వరకు చాలా తాక్కువ.

chintamaneni 08092019 2

చంద్రబాబు అధికారంలో ఉండగా, రాజకీయ విమర్శలు చేస్తూ ఉండేవారు కాని, ప్రతి చిన్న దానికి కేసులు పెట్టి, నాయకులను ఇబ్బంది పెట్టటం చాలా తక్కువ. ఉదాహరణకు బెట్టింగ్ కేసులో, ఇప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై, అప్పట్లో సీరియస్ కేసు నడిచింది. అప్పట్లో వచ్చిన వార్తలను బట్టి, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవుతరాని అందరూ అనుకున్నారు. కాని, రొటీన్ విచారణ చేసి, వదిలేసారు. కాని ఇప్పటి ప్రభుత్వం, చంద్రబాబులా చూసి చూడనట్టు వదలటం లేదు. ఏ చిన్న ఆధారం దొరికినా, పెద్ద నాయకుడు నుంచి, కింద స్థాయి కార్యకర్త వరకు, ఇబ్బందులు పెడుతున్నారు. కోడెల, యరపతనేని, కూన రవి కుమార్, చింతమనేని, సోమిరెడ్డి, ఇలా వరుస పెట్టి నేతలను టార్గెట్ చేస్తున్నారు. మరో పక్క సోషల్ మీడియాలో చిన్న వ్యతిరేక పోస్టింగ్ వేసినా, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తుంది వైసిపీ.

chintamaneni 08092019 3

అయితే ఇప్పుడు చింతమనేని విషయంలో, ఆ చిన్న ఆధారం లేకుండా కూడా అరెస్ట్ చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి సంచలన విషయం నిన్న గుంటూరు పార్టీ ఆఫీస్ సాక్షిగా చెప్పారు. చింతమనేని ప్రభాకర్‌ తమను అసలు దుర్భాషలాడలేదని, చింతమనేని పై కేసు పెట్టిన వ్యక్తలు చెప్పారు. ఇసుక తోలుకుంటున్న తమను కులం పేరుతో చింతమనేని దూషించారని చెప్తూ, పోలీసులు తమను బెదిరించి ఆయన పై కేసు పెట్టించారని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసఫ్‌ రామకృష్ణ, సందీప్‌ కుమార్‌ తెలిపారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం వారు న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబుతో కలిసి మీడియా ముందు మాట్లాడారు. చింతమనేని పై బలవంతంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, చింతమనేని మైనింగ్‌ జరుగుతున్న ప్రదేశానికే రాలేదని, అలాంటిది తమను ఎలా దూషిస్తారు, కొడతారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు కేసులో ఇరికించారని తెలిపారు. తాము ఎడ్లబండిపై ఇసుక తోలుకుంటామని రామకృష్ణ, సందీప్‌కుమార్‌ చెప్పారు. ప్రభాకర్‌ తమపై దాడి చేయలేదని తెలిపారు. తమవెంట వస్తానన్న జోసఫ్‌ను పోలీసులు అడ్డుకున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల్లో ఓటమి తరువాత, మొదటి సారి, జిల్లాల పర్యటనకు వెళ్లారు. ముందుగా, తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఎన్నికల ఓటమి పై సమీక్షలు శ్రేణుల్లో ధైర్యం నింపారు. చాలా రోజుల తరువాత, తమ అధినేత, తమతో ఎక్కువ సేపు గడపటంతో కార్యకర్తలు కూడా సంతోష పడ్డారు. ఓటమికి గల కారణాలు, పార్టీలోని ఇబ్బందులు, ఇలా అనేక విషయాల పై చర్చించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల నేతలతో రెండు రోజులు పాటు చంద్రబాబు అన్ని విషయాలు చర్చించారు. నేతలు , కార్యకర్తలు కూడా చంద్రబాబు ముందు అన్ని విషయాలు కుండబద్దలు కొట్టారు. పార్టీ తప్పులతో పాటు, ఏంచేస్తే తిరిగి పార్టీకి పునరుత్తేజం కలుగుతుందో ఏకరువు పెట్టారు.

cbn 07092019 2

ఈ సమీక్షలో కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు, తోటత్రిమూర్తులు లాంటి నేతలు కూడా డుమ్మా కొట్టారు. దీంతో అలాంటి నేతలను ఇంకా బుజ్జగించటం అనవసరం అని, ఈయన స్థానంలో కొత్త నేత ఎంపికకు చంద్రబాబు ఓకే చెప్పారు. జిల్లాలో జరుగుతోన్న పరిణామాల పై సీనియర్‌ నేతలతో వన్ టు వన్ రహస్య సమావేశమై చంద్రబాబు చర్చించారు. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు పార్టీ నాయకులు, క్యాడర్‌లో ఉత్తేజం నింపారు. ప్రభుత్వం కావాలని అక్రమ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదే సమయంలో గడచిన అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉండి, కార్యకర్తల దూరంగా, వారి అభిప్రాయాలు వినిపించే అవకాసం లేదని అభిప్రాయానికి ఆయన కూడా అంగీకరించారు.

cbn 07092019 3

ఈ రెండు రోజులు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అటు కార్యకర్తలు, ఇటు నాయకులు కూడా ఇన్నాళ్లకు తమ అధినేతతో సమయం దొరికింది అని, అభిప్రాయాలను పంచుకున్నామని, మనసు విప్పి అన్ని కష్టాలు అధినేతతో పంచుకున్నామని, చంద్రబాబు స్పందించిన తీరుతో సంతోషంగా ఉన్నామని అన్నారు. తమకు అధికారం లేకున్నా పార్టీని దర్జాగా నడిపిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో సమీక్ష చేసిన చంద్రబాబు వెళ్తూవెళ్తూ మనసులో మాట బయటపెట్టారు. రెండు రోజుల్లో కార్యకర్తలతో భేటీ తర్వాత తానేం కోల్పోయానో అర్థమైందని బహిరంగంగా పేర్కొన్నారు. తూర్పుగోదావరి నుంచి సంతోషంగా వెళ్తున్నట్టు వెల్లడించారు. సీఎంగా తీరిక లేకపోవడంతో జిల్లాలో పార్టీకి, క్యాడర్‌కు చెయ్యాల్సిన పనులు చేయలేదని తనకు అర్థం అయ్యిందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అధినేతలో వచ్చిన మార్పు చూసి కార్యకర్తలు సంతోష పడ్డారు.

బీజేపీ స్టైల్ అఫ్ ఫంక్షనింగ్ చాలా వేరుగా ఉంటుంది. మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, వెనకాల నుంచి చేసేది చేస్తూనే ఉంటారు. చివరకు వాళ్ళు ఏమి చేసారో, పూర్తిగా దిగితే కాని అర్ధం కాదు. ఇదే ఫార్ములా చంద్రబాబు పై ఉపయోగించారు. దాదపుగా మూడేళ్ళ పాటు చంద్రబాబుతో మంచిగా ఉన్నట్టు చేస్తూ, జగన్ తో కలిసి రాజకీయ గేమ్ ఆడారు. చంద్రబాబు తప్పు తెలుసుకునే సారికి చాలా సమయం అయిపొయింది. అప్పుడు మిత్రుడు అయిన చంద్రబాబు, గట్టిగా అడగటం మొదలు పెట్టగానే శత్రువు అయిపోయాడు. ఇక అందరితో కలిసి, చంద్రబాబుని దించే వరకు బీజేపీ నిద్రపోలేదు. ఇప్పుడు జగన్ ది అదే పరిస్థితి. మంచిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు కాని, బీజేపీ వల్ల, రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విభజన హామీ కూడా నెరవేరలేదు. మెడలు వంచుతా అన్న జగన్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు.

shah 07092019 2

మరో పక్క పోలవరం టెండర్లు విషయంలో కాని, విద్యుత్ ఒప్పందాల రద్దు విషయంలో కాని, ఇలా ఏ విషయంలో కూడా జగన్ కు సహకరించటం లేదు. పైకి మాత్రం, హలో విజయ్ గారు, అంటూ ప్రధాని మోడీ కూడా, సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి బీజేపీ గేమ్ ఆడుతుందో, లేక జగన్, విజయసాయి రాష్ట్రం విషయంలో కాంప్రోమైజ్ అవుతున్నారో కాని, కేంద్రం మాత్రం జగన్ కు షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంది. మొన్నటి మొన్న ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించాలి, తెలంగాణా నుంచి డిప్యూటేషన్ పై పంపించండి అంటే, కేంద్రం తిరస్కరించింది. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా జగన్ ప్రభుత్వానికి సహకారం ఇవ్వటం లేదు. అటు కేసీఆర్ తెలంగాణా నుంచి పంపించటానికి ఒప్పుకున్నా కేంద్రం మాత్రం, నిబంధనలు చూపించి నో అంది.

shah 07092019 3

ఇప్పుడు తెలంగాణకే చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌కు కూడా కేంద్రం అంగీకరించే అవకాశం కనిపించటం లేదు. స్టీఫెన్ రవీంద్ర విషయంలో ఉన్న ‘సూపర్‌ టైమ్‌’ స్కేల్‌ నిబంధనే ఇక్కడ కూడా కారణమని చెబుతున్నారు. సూపర్‌ టైమ్‌స్కేల్‌ అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యుటేషన్‌ పై పంపించాలి అంటే ఎంతో అసాధారణ పరిస్థితి ఉండాలి. శ్రీలక్ష్మి, స్టీఫెన్‌ రవీంద్రల విషయంలో అలాంటి అసాధారణ పరిస్థితు లు లేవని కేంద్రం భావిస్తుంది. అయితే వీరిని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటానికి, స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. శ్రీలక్ష్మిని ఢిల్లీ తీసుకు వెళ్లి మరీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి లాబీయింగ్ చేసారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా చెయ్యని ప్రయత్నం లేదు. ఇన్ని చేసినా, కూడా కేంద్రం కనీసం సహకరించటం లేదు. స్టీఫెన్ కు ఇప్పటికే నో చెప్పారు. రేపో మాపో శ్రీలక్ష్మి విషయంలో కూడా నో చెప్పనున్నారు.

Advertisements

Latest Articles

Most Read