వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, నిందితుడు మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. రెండు రోజుల్లోనే, ఆ వార్త కనుమరుగు అయిపోతుంది అనుకోండి అది వేరే విషయం. అయితే హైప్రొఫైల్ కేసుల్లో ఈ సీరియల్ మరణాలు కొత్త కాదు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు అందరూ చనిపోయారు. మొన్న వైఎస్ వివేక నిందితుండు ఆత్మహత్య చేసుకోగానే, అందరికీ పరిటాల రవి కేసు గుర్తుకు వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న నిందితుడు రాసిన లేఖల్లో, చేతి రాత తేడా ఉందనే వార్తలు వచ్చాయి. అయితే, రెండు రోజుల్లో అందరూ ఆ వార్త మర్చిపోయారు. ఇప్పుడు ఇలాంటి వార్త మరొకటి సంచలనం సృష్టిస్తుంది. అయితే, ఈ వార్త మాత్రం ఇప్పుడు సంచలనం ఎందుకు అయ్యింది అంటే, ఇది జగన్ మోహన్ రెడ్డికి చెందిన కేసు కాబట్టి.

kodikatti 06092019 2

జగన్ మోహన్ రెడ్డి పాదయత్రలో ఉండగా, జగన్ పై కోడి కత్తితో కలిసి దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయ్యింది. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న కోడి కత్తి శీను, సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనను రాజమండ్రి సెంట్రల్ జైలులో చంపేందుకు పెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీను, తనపై జైలర్, జైలు వార్డెన్ దాడి చేశారనీ, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, వెంటనే ఈ విషయాన్ని శ్రీనివాస్ కేసు వాదిస్తున్న లాయర్ అబ్దుల్ సలీం దృష్టికి తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న లాయర్ సలీం మాట్లాడుతూ, శ్రీనివాస ని జైలులోనే చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

kodikatti 06092019 3

శ్రీనివాస్ భద్రత పై కోర్ట్ లో పిటీషన్ వేస్తామని లాయర్ సలీం తెలిపారు. జైలులో శ్రీనివాస్ పై దాడి చేసారని, గాయాలయ్యాయని, ఈ దాడి, పై జైలు అధికారుల పై సెక్షన్ 307 కింద కేసులు పెడతామని అన్నారు. శ్రీనివాస్ కు రాజమండ్రి జైల్లో భద్రత లేదనీ, విశాఖ జైలుకు బదిలీ చేయాలని కోర్టును కోరతామని లాయర్ సలీమ్ తెలిపారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కేసు, రాజమండ్రి జైలులో ఉన్న శ్రీనివాస్ చేసిన ఈ ఆరోపణలతో మరింత కలకలం రేగింది. హై ప్రొఫైల్ కేసుల్లో జరుగుతున్న విషయాలు గమనిస్తున్న ప్రజలు, ఈ ఆరోపణల పై కూడా ఏదో జరగబోతుంది అనే ఆలోచనకు వచ్చారు. ఎవరి పైన అయినా దాడి చెయ్యటం, చంపటం నేరం. మొన్న కోడి కత్తి శీను, జగన్ ను గుచ్చటం అయినా, ఈ రోజు శీను ఆరోపిస్తున్నట్టు తన పై జరిగిన దాడి అయినా, ఏదైనా సరే తప్పే అవుతుంది.

స్పీకర్ స్థానం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ, ఎన్నో మాటలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, ఆయన బయట మాత్రం, తన మాటలకు విరుద్ధం వ్యవహరిస్తున్నారు. నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయితే, వారి పై అనర్హత వేటు వెయ్యలేదు అంటూ వెంకయ్య నాయుడు వైఖరినే తప్పుబట్టిన తమ్మినేని, ఆయన విషయం వచ్చే సరికి మాత్రం, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్నటి మొన్న గ్రామ వాలంటీర్లతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఒక స్పీకర్ స్థానంలో ఉంటూ, ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఉండటం పై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థ పార్టీ వ్యవస్థలాగా మాట్లాడటం కూడా విమర్శలకు తావుచ్చింది.

tammineni 06092019 2

అయితే ఇప్పుడు మరోసారి తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. ఈసారి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు టార్గెట్ గా రాజకీయ విమర్శలు చేసారు. సహజంగా స్పీకర్ స్థానంలో ఉంటూ, ప్రతిపక్ష నాయకుడి పై రాజకీయ విమర్శలు చెయ్యరు. గతంలో కోడెల ఇలా చేసరాని, అందుకే మేము వ్యవస్థను మార్చేస్తున్నాం అని చెప్తున్న జగన్ గారు, ఈ వైఖరి పై ఏమి చెప్తారో మరి. ఈ రోజు శ్రీకాకుళంలో, పలాసలో జగన్ మోహన్ రెడ్డి సభలో తమ్మినేని పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద రోజుల పాలనలో జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా చేసారని, రాజకీయాల్లో ఇలాంటి ముఖ్యమంత్రి భారత రాజకీయ చరిత్రలో ఒక్క జగన్ మాత్రమేనని కితాబిచ్చారు.

tammineni 06092019 3

జగన్ మోహన్ రెడ్డి రాకతో పలాస ప్రాంతం పునీతమైందని వ్యాఖ్యానించారు. పలాస ప్రజలు వెనుకబడిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, జగన్ తనను ఏకంగా శాసన సభాపతిగా చేశారని హర్షం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పై పొగడ్తలు అయిన తరువాత, చంద్రబాబుని టార్గెట్ చేసారు. చంద్రబాబు-కరువు కవల పిల్లలు అంటూ, స్పీకర్ గా ఉంటూ, ప్రతిపక్ష నాయకుడికి పై రాజకీయ విమర్శలు చేసారు. జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఒక పక్క సీమలో, ఉత్తరంద్రలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, స్పీకర్ గారు మాత్రం, చంద్రబాబుని విమర్శిస్తున్నారు. అలాగే జూన్, జూలై నెలలో వర్షాలు లేక, ఖరీఫ్ లేట్ అయిన సంగతి తెలిసిందే. ఆగష్టు నెలలో కూడా, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు పడి, మనకు వరదలు వచ్చాయి. మరి జగన్ మోహన్ రెడ్డి గారు, ఎవరితో కవలు పిల్లలో ? ఏది ఏమైనా, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారు, రాజకీయ విమర్శలు చెయ్యకుండా ఉంటే, ఆ స్థానానికి గౌరవం వస్తుంది.

వైసిపీ అధ్యక్షుడి జగన్ మోహన్ రెడ్డి పై, అనేక కేసులు ఉన్న సంగతి తెలిసిందే. తన తండ్రి అధికారంలో ఉండగా, ఆదాయానికి మించిన ఆస్థులు వెనకేసారని, సిబిఐ అభియోగాలు మోపింది. తీవ్ర ఆర్ధక నేరాలు ఉండటంతో, ఈడీ కూడా కేసులు పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి పై మొత్తం 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. 2012 మే నెలలో జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, అప్పటి నుంచి విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసుల విచారణలో భాగంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్ కు రావాల్సి ఉంటుంది. అయితే జగన్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా శుక్రవారం కోర్ట్ కు వెళ్ళలేదు. ప్రతిసారి న్యాయమూర్తికి ముఖ్యమంత్రిగా విధులు ఉన్నాయని చెప్తూ, మినహయింపు పొందుతున్నారు.

jagancourt 06092019 1

అయితే ప్రతి సారి ఇది కుదరదు కాబట్టి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్ట్ లో, ఒక పిటీషన్ దాఖలు చేసారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావాలంటే కుదరదు, తన తరుపున, న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి హాజరుఅవుతారు, అనుమతి ఇవ్వండి అంటూ కోర్ట్ లో పిటీషన్ వేసారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 ని కోట్ చేస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో గురువారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అని, తనకు చాలా ప్రభుత్వ బాధ్యతలు ఉన్నాయని, అలాగే ప్రతి వారం అమరావతి నుంచి హైదరాబాద్ రావాలి అంటే, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదని, అందుకే తరుచు హైదరాబాద్ వచ్చి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి గండి కొట్టలేనని, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, మినహాయింపు ఇవ్వాలని కోరారు.

jagancourt 06092019 1

తన వ్యక్తిగత హాజరు ఎప్పుడు అవసరం అని కోర్ట్ అనుకుంటే, అప్పుడు వచ్చి హాజరు అవుతానని జగన్ కోర్ట్ కు చెప్పారు. ప్రతి వాయిదాకు నిందితుల హాజరు అవసరం లేదని, గతంలో, బసవరాజ్‌ ఆర్‌.పాటిల్‌, భాస్కర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటీషన్ పై ఈరోజు విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. అయితే ఈ వినతిని జగన్ గతంలో కూడా కోరారు. తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని, దాఖలు చేసుకున్న పిటిషన్‌ను 2014లో ఇదే కోర్టు తిరస్కరించగా హైకోర్టు సమర్థించింది. ఇక మరో పక్క, ఈ రోజు శుక్రవారం కావటంతో, జగన్‌ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణ జరిగింది. ఈ కేసులో విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రమే హాజరయ్యారు. ఇవాళ ఈ కేసులో 11చార్జిషీట్ల విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా 100 రోజులు అయ్యింది. ఈ వంద రోజుల్లో ఎన్నో సమస్యలు ప్రజలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఇసుకని వదలకపోవటంతో, రాష్ట్రం పడుకుంది. ఇక కేసిఆర్ అన్ని తిట్లు ఆంధ్రులని తిట్టినా, ఆయనతో చట్టా పట్టాల్ వేసుకుని తిరగటం, గోదావరి నీళ్ళు ఇస్తాను అనటం కూడా, ఆంధ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తాను అని చెప్పి, ఇప్పుడు ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నారు. ఇక మరో పక్క రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన అమరావతి, పోలవరం రెండూ ఆగిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టత్మకంగా చెప్పిన నవరత్నాలు ఇంకా మొదలు కాలేదు. మరో పక్క రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. ఇన్ని కష్టాల మధ్య జగన్ మోహన్ రెడ్డి ఈ రోజుతో వంద రోజులు పూర్తీ చేసుకున్నారు. జగన్ కి కలిసి వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే, అది పై నుంచి వరదలు వచ్చి, నీళ్ళు రావటం. అది కూడా సరైన వాటర్ మ్యానేజ్ మెంట్ చెయ్యలేక, సీమను ఎండబెట్టారు.

jcdiwakarreddy 06092019 2

అయితే జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన పై, తనదైన శైలిలో స్పందించారు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈ వంద రోజుల్లో జగన్ పడుతున్నాడు, లేగుస్తున్నాడు, కాని జగన్ ను చెయ్యి పట్టి నడిపించే వాడు చాలా అవసరం అని జేసీ అన్నారు. గత ప్రభుత్వం అంటూ అక్కడే ఆగిపోయారని, ప్రతి విషయాన్ని మైక్రోస్కోపులో చూస్తూ, పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దాలని కాని, దాన్ని నేలకేసి కొట్ట కూడదు అని అన్నారు. ఈ మూడు నెలల్లో పెట్టుబడులు లేవు, ఒక్క ఉద్యోగం వచ్చింది లేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఒక్క ఉద్యోగం రాకపోయినా, ఆర్టీసీని తెచ్చి అనవసరంగా ప్రభుత్వం నెత్తిన పెడుతున్నారని జగన్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపటం, ప్రభుత్వానికి అదనపు భారం తప్ప, దాని వల్ల ఏ ఉపయోగం ఉండదని అన్నారు.

jcdiwakarreddy 06092019 3

ప్రభుత్వం ఎప్పుడూ వ్యాపారం చెయ్యకూడదు అని, ఆర్టీసీ చేసిడి వ్యాపారం అని, అలాంటిది ప్రభుత్వం ఆర్టీసీని తీసుకోవటం ఆశ్చర్యం వేసింది అని అన్నారు. రాజధాని అమరావతి పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అమరావతి ఎక్కడికీ వెళ్ళదని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. ఇవన్నీ చెప్తూనే, మా వాడు చాలా తెలివైన వాడు అంటూ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, జగన్ మావాడే అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ పార్టీలో ఎప్పుడూ చేరుతున్నారని అని అడగగా, నన్ను ఎవరూ ఆ పార్టీలోకి రానివ్వరని, కాని జగన్ మోహన్ రెడ్డి కోరితే మాత్రం, కొన్ని సలహాలు ఇస్తానని చెప్పుకొచ్చారు. మొత్తం మీద, జగన్ వంద రోజుల పాలన పై జేసీ కామెంట్స్ తో మళ్ళీ హీట్ రేగింది. మరి వైసిపీ దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read