There are no articles in this category. If subcategories display on this page, they may have articles.

Top Stories

టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘స్కిల్ పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడిచేయడమే’ పుస్తకావిష్కరణ కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీనేతలు కింజరపు అచ్చం నాయుడు, నిమ్మల రామానాయుడు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఎం.ఎస్.రాజు, పంతగాని నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి ప్రసంగం.. “నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితాన్ని ప్రజలకోసమే అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడిని 28 రోజులుగా జైల్లోనే ఉంచారు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పటినుంచీ నేటివరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, టీడీపీ అధినేత ఏ తప్పు చేయలేదనే నిజాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దుష్ప్రచారం చేస్తూ, లేని అవినీతిని ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తూనే ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేష న్లో అవినీతి జరిగిందని చెప్పారు. అలానే ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లో కూడా అవినీతి జరిగిందని విషప్రచారం చేస్తున్నారు. వాటన్నింటికీ సంబంధించి ఇప్పటికే టీడీపీ ప్రజలకు అనేక వాస్తవాలు తెలియచేసింది. తాజాగా నేడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించిన అన్నివిషయాలు వెల్లడిస్తూ నేడు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. అలానే ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కూడా ప్రజలకు తెలియచేసేందుకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పుస్తకాలు విడుదల చేయబోతున్నాం. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; తెలుగుదేశం పార్టీకి ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన నిధులకు.. జగన్ సర్కార్ చెబుతున్న అవినీతికి సంబంధమేంటి? చంద్రబాబునాయుడు ఏ తప్పూ చేయలేదని మేం తొలినుంచీ చెబుతున్నాం. కానీ పిచ్చి జగన్, పిచ్చి మంత్రులు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.3,300కోట్ల అవినీ తి జరిగిందని నోటికొచ్చినట్టు మాట్లాడారు. తర్వాత రూ.330కోట్ల అవినీతి అని కారు కూతలు కూశారు. నిన్నటికి నిన్న ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి రూ.27కోట్లు టీడీపీ ఖాతాకు వెళ్లాయంటున్నారు. పొన్నవోలు మతి చలించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అని అతని మాటల్ని బట్టే అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అకౌంట్ కు వచ్చిన నిధులకు.. ప్రభుత్వం చెబుతున్న అవినీతికి ఏం సంబంధం? జగన్ రెడ్డి చేసినట్టు అవినీతి చేసి, ఆయన సొంత ఖాతాకో.. ఆయన సంస్థల ఖాతాలకో.. ఆయన భార్య ఖాతాకో నిధులు రాబట్టుకుంటే, అదీ అసలైన అవినీతి. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలున్నాయి. అలానే తెలుగుదేశం, వైసీపీ వంటి అనేక ప్రాంతీయ పార్టీ లున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి చట్టానికి లోబడి పార్టీ ఫండ్ వస్తూంటుంది. అలానే తెలుగుదేశానికి నిధులు వచ్చాయి. ఆ నిధులకు లెక్కలున్నాయి. అలా వచ్చిన నిధు ల్ని అవినీతి సొమ్ము అనే దుస్థితికి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి వచ్చారంటే వీరు ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోండి. సభ్యత్వాల ద్వారా పార్టీకి వచ్చిన సొమ్ముని అవినీతి సొమ్ముగా చూపడం ఈ ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లుతాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రైవేట్ వ్యక్తులు, ప్రజల నుంచి పార్టీ నిర్వహణ కోసం నిధులు సేకరించలేదు. పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారైనా, చంద్రబాబునాయుడైనా కార్యకర్తల నుంచి సభ్యత్వ రుసుము రూపంలో వచ్చి న సొమ్ముతోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. పార్టీ ఏ రకంగా నడుస్తోంది.. సభ్య త్వం ద్వారా వచ్చే సొమ్ము వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తెలియచేస్తున్నాం. అలా వచ్చిన సొమ్ముని అవినీతి సొమ్ముగా చూపి చంద్రబాబు ద్వారా లబ్ధిపొందిన వారే పార్టీకి నిధులిచ్చారని చెప్పడం ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లు తాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనం.” అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు తీరుపై, పోలీసుల మీద హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై పోలీసులపై ధర్మాసనం విమర్శలు గుప్పించింది. ఈ కేసును సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవడంతో పాటు, దర్యాప్తు అధికారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్స్ చేస్తామని హెచ్చరించింది. బండారు సత్యనారాయణ మూర్తి తరపు న్యాయవాది సతీష్ మాట్లాడుతూ, అర్నేష్‌కుమార్ కేసులో బండారుకు 41ఏ నోటీసులు ఇవ్వలేదని ముందుగా చెప్పారని, ఇప్పుడేమో 41ఏ నోటీసులు ఓరిజినల్ కాఫీ ఫైల్ చేశామంటున్నారని అన్నారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. నోటీసులు అందలేదని ఎలా చెబుతారని నిలదీసింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇంత సీరియస్ మ్యాటర్‌లో కౌంటర్ వేస్తామని చెప్పి ఎందుకు వెయ్యలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 41ఏ నోటీసులు తీసుకోకపోతే వెంటనే ఎలా అరెస్ట్ చేస్తారని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు తీసుకోవడంతో పాటు, దర్యాప్తు అధికారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్స్ చేస్తామని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 2నకు వాయిదా వేసింది.

రాష్ట్రంలోని ప్రజల కష్టాలను చూడని గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా వినూత్న నిరసన చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆయన పిలుపు ఇచ్చారు. రేపు రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి ఐదు నిమిషాలు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని లోకేష్ పిలుపునిచ్చారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని ఆయన తెలిపారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా, గత 27 రోజులుగా తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతుంది. గత వారం, మోత మొగిద్దాం అంటూ, రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమం చేసి, రాష్ట్రం మొత్తం మోత మోగించారు. ఈ వారం, లైట్లు ఆర్పి, సెల్ ఫోన్ వెలుగుల్లో నిరసన తెలపాలని లోకేష్ పిలుపు ఇచ్చారు. టీడీపీ శ్రేణులు ఈ నిరసనను విజయవంతం చేయాలని లోకేష్ కోరారు.

వైఎస్ వివేకానందు హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‌సింగ్ ఏకపక్షంగా కేసును విచారించారని, ఇద్దరి స్టేట్‌మెంట్ ఆధారంగానే దర్యాప్తు చేశారని, దర్యాప్తులో అనేక అంశాలు మరిచారని ఆయన ఆరోపించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్‌నే సీబీఐ అధికారులు సాక్ష్యంగా తీసుకున్నారని, కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిపై పునః సమీక్షించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాసిన ఎంపీ అవినాష్‌రెడ్డి, కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిపై పునః సమీక్షించాలని కోరారు. కేసులో సమగ్రమైన విచారణ జరగడం ద్వారా నిజం బయటపడుతుందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. సీబీఐ ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తుందని, కేసులో పునః సమీక్ష చేస్తుందని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆశిస్తున్నారు. సీబీఐ ఈ విషయంపై స్పందించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.

ఏపీ ప్రభుత్వం మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కేటాయించిన గన్‍మెన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గన్‍మెన్లను తొలగించడం సరైనది కాదని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తమకు ఎటువంటి భద్రతా భయాలు లేవని, ప్రభుత్వం తమకు గన్‍మెన్లను తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు గన్‍మెన్లను తొలగించిన నిర్ణయంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ప్రభుత్వం తన విమర్శకులపై భయపడుతుందని, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణపై నిఘా పెట్టడానికి గన్‍మెన్లను తొలగించారని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు గన్‍మెన్లను తొలగించిన నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకుంటాం అని టిడిపి అంటుంది.

ఏపీలో ఎంబీబీఎస్ సీట్ల అమ్మకానికి పెట్టి, పేదల నడ్డి విరిచారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు 42 వేల మంది అర్హత పొందారు, కానీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్లు 6 వేల మాత్రమే. ఇందులో 3 వేల సీట్లు అమ్ముకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చాలా మంది విద్యార్థులు హైదరాబాద్, చెన్నై వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. ఎంబీబీఎస్ సీట్లు కొరతతో పాటు, ఖరీదైన ఫీజులూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఓపెన్ కేటగరీలో 3 వేలకు పైగా సీట్లు అమ్ముకునేలా, అధిక ఫీజు వసూలు చేసుకునేలా కళాశాలలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను అందుకోవడం కష్టతరం అవుతోంది. ఎన్నికల ముందు వైద్య విద్య మరియు ఇంజనీరింగ్ విద్యను ఉచితం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఇంకా ఆ హామీని అమలు చేయలేదు. ఎంబీబీఎస్ సీట్ల కొరత మరియు ఖరీదైన ఫీజులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భవానీ ఐలాండ్ సరి కొత్త అందాలు అందుకోబోతుంది. ఐలాండ్ లో త్వరలో ఏర్పాటు కానున్న డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించింది. సుమారు రూ.16 కోట్ల వ్యయంతో డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ ను సిద్ధం చేస్తోంది. ద్వీపంలో ఇప్పటికే దీనికి సంబంధించిన కంట్రోల్ రూం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ లేజర్ షోను పర్యాటకులు తిలకించేందుకుగాను కంట్రోల్ రూం పక్కనే గ్యాలరీ ఏర్పాటు చేస్తోంది. లేజర్ షోకు సంబంధించిన సామగ్రి కూడా వచ్చేసింది. ప్రస్తుతం పన్నమి ఘాట్లో ఉన్న ఈ సామగ్రికి ఒక రూపం తీసుకువచ్చి భవానీ ద్వీపంలోకి తర లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డ్యాన్సింగ్ కల్ పాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు. ఇది అత్యంత ఖర్చు కూడుకున్న భారీ ప్రాజెక్టు అయినప్పటికీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా చేపటామన్నారు. కోల్కత్తాకు చెందిన ప్రీమియం వరల్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించిందని వివరించారు.

నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటాయంగా నిలుస్తున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిని పొందింది.. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల కంటే వృద్ధి రేటులో దూసుకుపోతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ అతి త్వరలో దక్షిణ, తూర్పు ఆసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా విమానాలు నడపటానికి బీజం పడుతోంది... మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరుగుతోంది... పర్యాటకుల సంఖ్య పెరిగింది... ఆతిథ్య కేంద్రంగా మారిపోయింది.. ఓ కన్వెన్షన్ సెంటర్ మాదిరిగా విమానాశ్రయ లాంజ్లోనే ఉన్నతాధికారుల కాన్ఫరెన్స్ లు జరుపుకునేంతగా మారిపోయింది... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ నేపథ్యంలో ఇటీవల రూ.148 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించిన నూతన ఇంటీరియమ్ టెర్మినల్ బిల్లింగ్ దేశంలోని ఇతర ప్రాంతాల వారు, భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఇక్కడి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు వీలుగా అంతర్గతంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనల మేరకు పర్యాటక శాఖ , ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా టెర్మినల్ బిల్లింగ్ అంతర్గతంగా తీర్చిదిదుతున్నారు. అమరావతి ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా బుద్ధుని విగ్రహాన్ని ఉంచారు. పూర్తి స్థాయిలో బౌద్ధ ఛాయాచిత్రాలను తొలగించి కృష్ణాజిల్లా వైభవాన్ని తెలిపేవిధంగా కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యాలు, కలంకారీ కళలు వంటి సంస్కృతి ఉట్టిపడేలా వాటిని ప్రతిబింబించే కళాఖండాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రుల చరిత్ర... అందులో అమరావతి ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవం తెలిసేలా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అత్యద్భుతమైన కళాఖండాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా, పండుగలు వచ్చినపుడు వాటికి థీమ్‌కు అనుగుణంగా అలంకరణ చేపడుతున్నారు. తాజాగా దీపావళిని పురస్క రించుకుని ఎయిర్‌పో ర్టును విద్యుదీ పాలంకరణతో దేదీప్యమానంగా అలంకరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసి ప్రగతి పధంలోకి నడిపంచేందుకు తీసుకోంటున్న చర్యలలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అన్నారు. సింపుల్ గ్రూప్ ఆఫ్ ఇండియా అధినేత ప్రవాస భారతీయులు పాపారావు ఆధ్వర్యంలో పవిత్రసంగమం వద్ద ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో పర్యాటకుల నదీ విహారయాత్ర నిమిత్తం పడవలపై రిసార్ట్, వాటర్ స్పోర్ట్స్, మెరైన్ ఎక్వేరియం,ఫ్లోటింగ రెస్టారెంట్స్లను ఎం.పి, టూరిజం డైరెక్టర్ శుక్లాతో కలిసి ప్రారంభించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిన పాపారావు జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలని సి.ఎం. చంద్రబాబు పిలుపు మేరకు తిరిగి ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పవిత్ర సంగమం వద్ద రిసార్ట్స్ వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. దీనివలన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీనితో పాటు అత్యంత ఆధునికమైన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోట్ల తయారీ పరిశ్రమని ఎ.కొండూరులో ఏర్పాటు చేయటం వలన ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు. పిల్లలకు సముద్రంలోని జీవరాశుల పై అవగాహన కల్పించేందుకు మెరైన్ ఎక్వేరియం ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, రిసార్ట్స్ అధినేత పాపారావు, ఇతర పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు.

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా తాయారు అయ్యింది... అమరావతి రాజధానిగా చెయ్యటం, అంతకు ముందు తాత్కాలికంగా ప్రభుత్వం మొత్తం విజయవాడ నుంచే పరిపాలన చెయ్యటం, సిటీ పెరగటం, ఇలా అన్ని సమస్యలతో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువ అయింది.. ఒక పక్క విఐపి మూమెంట్ ఉండటం, మరో పక్క కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటం, ట్రాఫిక్ నియంత్రించటంతో కూడా, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు.. ఇటు వైపు గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది.. మరో పక్క, గొల్లపూడి నుంచి, భవానీపురం మీదగా సిటీకి వచ్చే ట్రాఫిక్ కూడా అంతే... ఈ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు బయటకు వెళ్ళాలి అంటేనే హడలి పోతున్నారు...  google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌ రంగంలోకి దిగారు. ప్రధానంగా కనకదుర్గ వారధి దగ్గర నుంచి గన్నవరం విమానశ్రయం వరకు, లారీలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి రావడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది అని, ఇదే ప్రధాన కారణం అని గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కత్తా, చెన్నై నుంచి కోల్‌కత్తా వెళ్లాలన్నా, రావాలన్నా ఇదే మార్గం గుండా వెళ్లాలి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. విజయవాడ నగరంలోకి అనుమతించకుండా 216వ జాతీయ రాహదారి మీదుగా మళ్లించాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా వద్ద ప్రారంభమయ్యే 216వ నెంబర్ జాతీయ రహదారిని రేపల్లె, పెనుమూడి, పామర్రు, కత్తిపూడి మీదుగా ఐదో నెంబర్ జాతీయ రహదారికి మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే విజయవాడ నగరంలోకి భారీ వాహనాలు, లారీలు రాకుండా 216వ జాతీయ రహదారి మీదుగా మళ్లించనున్నారు. నగరంలోకి లారీలను నిషేధించాలన్న ప్రభుత్వ ఆలోచనతో విజయవాడలో వాహనదారుల కష్టాలు చాలా వరకు తీరినట్లే.

విజయవాడ ప్రజలకు మరో కొత్త అనుభూతి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, టూరిజం శాఖల నేతృత్వంలో రెండు బోట్లతో కూడిన బోటింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో, విజయవాడ బందర్ కాలువలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను నిన్న పలువురు ప్రజా ప్రతినిధులు పరరంభించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా, మేయర్, అధికారులు స్పీడ్ బోటులో ట్రయల్ రన్ గా బందరు కాలువలో, బందరు లాకుల వరకు ప్రయాణించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ భవిష్యత్ లో అమెరికన్ హాస్పటల్ నుంచి యనమలకుదురు లాకుల వరకు బోటింగ్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మూడు కాలువల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు.. అమరావతి బోటింగ్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బందరు లాకుల వరకు, పిల్లలకు రూ.50, పెద్దలకు రూ. 100 చొప్చున వసూలు చేసే యోచనలో ఉన్నామని, ప్రజలు అలవాటు పడేవరకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చొప్చున వసూలు చేయమని మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారన్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్ట్ అప్ యూనిట్లను ప్రోత్సహించటానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టిపిఐ) విజయవాడలో నిర్మిస్తున్న సైబర్ టవర్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. రూ.40 కోట్ల వ్యయంతో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ జి ప్లస్ 6 టవర్ నిర్మాణం ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం ఫినిపింగ్ పనులు జరుగుతు న్నాయి.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కృషా, గుంటూరు జిల్లా ఔత్సహిక యువతకు ఈ టవర్ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ సైబర్ టవర్ మొత్తం 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ టవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో హోస్టింగ్, ఇఎస్పి సేవలు, మొదటి ఫ్లోర్ లో డేటా సెంటర్, రెండవ ఫ్లోర్ లో ఇంక్యుబేషన్ సెంటర్ మూడు, నాలుగు, ఐదు ఫోర్లలో పెద్ద ఐటి కంపెనీలు, ఆరవ ఫ్లోర్ ను ట్రైనింగ్ సెంటర్ గా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రెండవ టవర్ నిర్మించేందుకూ ఎస్టిపిఐ ప్రణాళికలు వేస్తోంది. త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సైబర్ టవర్ను ప్రారంభించబోతున్నారు. ఈ టవర్ అందుబాటులోకి వస్తే దాదాపుగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా.

అన్న" ఎన్టిఆర్ " బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పాత్ర కోసం ఎన్టిఆర్ అల్లుడు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను రానా దగ్గుబాటి విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాత్ర కోసం రానా స్లిమ్ గా తయారయ్యారు. రేపు వినాయక చవితి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రానా ఫస్టులుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; రానాని చూస్తుంటే క్లీన్ షేవ్ చేసుకొని - మీసాలు పెంచి బాబును మక్కికి మక్కి దించేసారానే చెప్పాలి. నారా బాబు గా మారిన రానా బాబు అనే ప్రసంసలు అందుకుంటున్నారు.ఈ షూటింగ్ కోసం చంద్రబాబు మేనరిజం.. మాట్లాడే తీరు ఇవన్నీ కాపీ కొట్టేందుకు పాత వీడియోలు కూడా చూస్తున్నాడని అన్నారు. మొత్తానికి రానా మరోసారిఈ పాత్ర సెన్సేషన్ చేస్తారేమో . రీసెంట్ గా రానా నాన్నగారు సురేష్ బాబు మాట్లాడుతూ "పూర్తిగా చంద్రబాబుగా మారిన రానాను" చూసి షాక్ అయ్యాడని చెప్పారు.ఈ ఫోటో చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

తెలుగు సినిమా చరిత్ర లో మరో సంచలనం.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ అని ప్రకటించాడో లేదో, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు వర్మ ఆ పాట ఇదే:

బాలకృష్ణ హీరోగా, దివంగత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌పై కన్ఫర్మేషన్‌ వచ్చేసింది. ఈ మూవీని రాం గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నాడు. ఇలా ప్రకటించాడో లేదో... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ‘ఎన్టీఆర్ శత్రువులెవరో, మిత్రులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీ ఏంటో చెబుతా’ అంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు.... ఈ పాట సాగుతుంది. "ఇదే తెలుగు కీర్తి, ఇదే తెలుగు ఖ్యాతి, పొంగించారు మీరే ఈ తెలుగోడి ఛాతీ... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... అన్యాయాన్ని తుంచి, అధర్మాన్ని వంచి, పాలించారు మీరే సదా ప్రేమ పంచి... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీరే జీవితం, మీరే శాశ్వతం, ఇక ఏనాటికైనా మీదే సంతకం... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీదే రాజసం, మీదే సాహసం, తెలుగోడికిచ్చారు పొంగే పౌరుషం. జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్..." అంటూ సాగే పాట ఇప్పుడు శరవేగంగా పాప్యులర్ అయిపోతోంది. పాటలోని లిరిక్స్ క్యాచీగా ఉండటం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, త్వరలోనే మిగిలిన వివరాలను తెలపనుంది చిత్ర యూనిట్‌.

2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మార్మోగిందని సంతోషం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి. శంకరాభరణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి మనసుకు హత్తుకునే అపురూప, చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు ఎన్నో తెలుగువారికి అందించారు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత కె. విశ్వనాథ్‌దే అని అన్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; 1957లో సినిమారంగంలో ప్రవేశించి నేటికి కూడా వెండితెరతో అనుబంధాన్ని కొనసాగిస్తూ కె. విశ్వనాథ్ భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు అన్నారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టే భావితరాలకు కె. విశ్వనాథ్ స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తారు అని ముఖ్యమంత్రి అన్నారు.

కోట్లాది అభిమానుల ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘అజహర్‌’, ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; అయితే టీజర్‌లో, 1.12 సెకండ్స్ దగ్గర, 2014లో, సచిన్ PVP మాల్ ఓపెనింగ్ కి, విజయవాడ వచ్చినప్పుడు, బందర్ రోడ్డు పై అభిమానుల కోలాహలం, వారికి సచిన్ అభివాదం చెయ్యటం, ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ వీడియోలో 1.12 సెకండ్స్ దగ్గర, మీరు చూడండి

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారంనాడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; సాధారణంగా తెలుగు సినిమా ట్రైలర్‌ మహా అయితే నిమిషం, ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ, ‘బాహుబలి:ది కంక్లూజన్‌’ ట్రైలర్‌ను మాత్రం హాలీవుడ్‌ సినిమాల తరహాలో రెండు నిమిషాల 20 సెకెన్ల పాటు ఉండేలా కట్‌ చేశారు.

ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న విజయవాడలో చారిత్రాత్మిక కలిగిన ఆలయంలో ఒకటి మొగల్రాజపురం ధనకొండ, దుర్గా భవాని ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు... ఇంద్రకీలాద్రి పై అమ్మ కొలువు తీరడానికి ముందు, ఇంకోచోట వెలసిందని భక్తుల నమ్మకం. "దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికొచ్చింది రా " అనే గీతం ప్రకారం కూడా దుర్గా అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన వెలిసింది అంటారు.. ఈ విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండ పై వెలసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మ వారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటారు... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంత మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా మహిమగలదని భక్తుల నమ్మకం.... మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీకచ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. ఇది నిజమేనంటూ ఇప్పటికీ అంతరాలయంలో పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మరావతి విగ్రహ రూపం కనపడదు... అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీ చక్ర రూపం ఉంటుంది... స్థానికుల కధనం ప్రకారం దశాబ్దాలక్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. ఆమ్మ కరుణతో కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందిట. గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆ పై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది. భక్తులు పైనపొంగళ్లు చేసుకొవడానికి షెడ్‌, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈక్షేత్రానికి వెళ్లాలంటే మొగల్రాజపురం బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్ల వచ్చు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉన్న కృష్ణా నదిలో దుబాయ్ లోని హోటల్ క్రూయిజ్ తరహాలో ఒక అందమైన భారీ క్రూయిజ్ హోటల్ అధునాతన వసతులతో ఏర్పాటవుతుంది. సీతానగరం వైపున ఇసుక ర్యంపు దగ్గర ఈ భారీ క్రూయిజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అత్యంత భారీగా రెండు అంతస్తులగా ఈ బోటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దీని పొడవు దాదాపు 126 మీటర్లు ఉంటుంది, వెడల్పు 40 మీటర్ల ఉంటుంది. ఈ భారీ క్రూయిజ్ నిర్మాణానికి రూ.2 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో దాదాపు 360 మంది యాత్రికులు ఒకే సారి ఉండటానికి అవకాశం ఉంది. దీని లోపల భాగంలో అధునాతన వసతులతో రెస్టారంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో యాత్రికులు కోరిన విధంగా భోజనాలు, కోరిన రుచులతో ఆస్వాదించవచ్చు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. పెళ్లిళ్లకు, హనీమూస్ జరుపుకునే జంటలకు వివిధ రకాల పంక్షన్లకు ఈ క్రూయిజ్ అద్దెకు ఇస్తారు. భవాని ద్వీపం, ఇంద్రకీలాద్రి, నడుమ కృష్ణానది నీటి పై ఈ క్రూయిజీసు లంగరు వేసి ఉంచుతారు. భవాని ఐలాండ్, శాండ్ ఐలాండ్, ఫారెస్ట్ ఐలాండ్స్, వంటి ఎన్నో సహజ సుందరమైన దీవులను కలిగి ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాదారణ బోట్ల మాత్రమే తిరిగేవి. రాష్ట్రంలో టీడీపి ఆధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఆధునిక క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటకానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎతున పెట్టబడులు వస్తున్నాయి. రాజధాని పరిధిలో ఎన్నో బడా టూరిజం ప్రాజెక్టులను తెచ్చేందుకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ముందుకు వచ్చింది. తొలిదశలో భాగంగా సగానికి పైగా పనులు పూర్తి చేసింది. మిగిలిన పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, స్కై ఛాపర్స్ సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్ట్లు మొదలుపెట్టాయి.

ఇది నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో ఉన్న ఓ అద్భుత లోకం.... అక్కడ అడుగుపెడితే అదో కొత్త బంగారు లోకం... విజయావాడ అంటే కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి, రెండు పార్కులు మాత్రమే తెలిసిన నగరవాసులకి, ఈ ప్రదేశానికి వెళ్తే, ఇన్నేళ్ళు ఇక్కడకు ఎందుకు వెళ్ళ లేదా అనిపిస్తుంది... పచ్చని చెట్ల మొక్కల మధ్య నుంచి సీతాకోకచిలుకలు వచ్చి స్వాగతం పలుకుతాయి... ఒక్కటీ రెండూ కాదండి వేలల్లో.. అడుగులు ముందుకు పడుతుంటే మనతో పాటే కదులుతాయి... మనతో మమేకం అయిపోతాయి, మనల్ని ముద్దాడుతాయి.. మొన్నటి వరకు ఎక్కడెక్కడికో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన విజయవాడ వాసులు ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు. సొంత ప్రాంతంలో సరి కొత్త అనుభూతులను పొందుతున్నారు. ప్రకృతి కొత్త అందాలతో మురిసిపోతోంది విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న మూలపాడు. సీతాకోక సంపద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను కమ్మేసుకుంది. ఒకపక్క సెలయేళ్ల నీటి గలగలలు... అటూ ఇటూ కొండలు... మధ్యలో ప్రకృతి పచ్చని కోక కట్టినటుగా కనిపించే అరణ్యం.. మరో పక్క చల్లని గాలులకు, ఇంద్రధనస్సును తలిపిస్తూ, రంగురంగుల సీతాకోక చిలుకలు నాట్యం... వాః అద్భతం కదూ... కాంక్రీట్ జంగల్ గా మారిన విజయవాడ వాసులకి, ఇక్కడ అందమైన సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; మూలపాడు, దొనబండ ప్రాంతాల్లో వేలు, లక్షల సంఖ్యలో రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కలు విప్పతాయి. దాదాపు 30 రకాల సీతాకోకచిలుకలు, జూన్, జూలై, ఆగష్టు నెలల్లో అడవి మొత్తాన్ని ఆక్రమించి కొత్త అందాలు తీసుకొస్తాయి. సీతాకోక చిలుకలను దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించాలి. వాటిని పటుకోవడానికి ప్రయత్నించడం, పరుగులు తీసూ వాటి స్వేచ్చకు భంగం కలిగించకూడదని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అక్కడకు ఎలా వెళ్ళాలి ?విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై (విజయవాడకు 20 కిలోమీటర్ల దూరం) మూలపాడు గ్రామం ఉంది. ఆక్కడి నుంచి కుడి వైపకు 3 కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ ఆటవీ ప్రాంతం మొదలవుతుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల దూరంలో సమాంతరమైన ఆటవీ ప్రాంతంలో అభయాంజనేయస్వామి ఆలయం, దొంగమర్ల బావి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే రంగు రంగుల సీతాకోకచిలుకలు సందడి చేస్తాయి. ప్రభుత్వం ఇలాంటి అందమైన పర్యాటక కేంద్రాన్ని మరింతగా ప్రాచుర్యం కలిగించి, మంచి పర్యటక కేంద్రంగా, సీతాకోకచిలుకల మనుగడకు ఇబ్బంది లేకుండా మరింత అభివృద్ధి చెయ్యాలి...

సముద్రంలో రయ్మంటూ దూసుకుపోవాలనుందా? కెరటాల పై కేరింతలు కొడుతూ షికారు చేయాలనుందా? అయితే వైజాగ్ పదండి. త్వరలోనే ఆ కోరిక తీరుతుంది. దేశంలోనే తొలిసారిగా మన విశాఖ బీచ్ లో అలాంటి వారి సరదాలు తీర్చేందుకు హోవర్ క్రాఫ్ట్ వస్తోంది. ఇన్నాళూ, ఇంగ్లండ్ అమెరికా వంటి దేశాల్లోనే ఉన్న ఈ హోవర్ క్రాఫ్ట్ ఇప్పడు మనకూ రాబోతోంది. అక్షర ఎంటర్ప్రెజెస్ సంస్థ దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టబోతోంది. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.8 కోట్ల ఇందుకు నేవీ, కోస్ట్ గార్డ్ , విశాఖపోర్టు, జీవీఎంసీ, వుడా, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు, ఎన్ఐఓ వంటి అన్ని అనుమతులను తెచ్చుకుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇందుకోసం బ్రిటన్ నుంచి ఒక్కొక్కటి రూ.1.80 కోట్ల వెచ్చించి రెండు హోవర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసింది. తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉండే ఈ క్రాఫ్ట్ లో పైలట్ (డైవర్), ఒక సహాయకుడితో పాటు మరో ఏడుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఆర్కే బీచ్ సమీపంలో ఒక పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నుంచి పార్క్ హోటల్ వరకు, తొట్లకొండ పాయింట్ నుంచి ఆ పరిసరాల్లోనూ 20 నుంచి 25 నిమిషాల పాటు సముద్ర ఒడ్డు నుంచి 500 మీటర్ల దూరం వరకు వీటిని తిప్పనున్నారు. ఈ హోవర్ క్రాఫ్ట్ లో షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.300 టికెటుగా నిర్ణయించాలని యోచిస్తున్నారు. భద్రత కోసం ఒడ్డున సేఫ్టే బోట్లను కూడా సిద్దంగా ఉంచుతారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ హోవర్ క్రాఫ్ట్ లు నడపడానికి అవసరమైన అన్ని అనుమతులు తెచ్చుకున్నారు.

ఏ నగరాన్నయినా రోడ్ల మీద తిరుగుతూ చూడటం కన్నా విహంగ వీక్షణంలో చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది... అలాంటి అనుభూతి స్వయంగా పొందకపోయినా, ఈ వీడియో చూడండి, బెజవాడ ఎంత అందంగా ఉందో... హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ, నగర అందాలు కెమెరాలో రికార్డు చేశారు...హెలికాప్టర్ నుంచి ఈ సీన్ చూస్తుంటే, ఆస్వాదించే మనసుండాలేగాని బెజవాడలో ప్రతి ప్రాంతం సోయగాల బృందావనమే... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఆకాశం నుంచి బెజవాడ ఎంత అందంగా ఉందో చూడండి... కృష్ణా తీరం, పచ్చని కొండలు, నగరంలో నుంచి ప్రవహించే కాలువలు, కృష్ణా నదిలో ద్వీపాలు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, లయలా కాలేజి, సిద్ధర్దా కాలేజీ, స్టేడియం, ఇలా విజయవాడ నగర విహంగ వీక్షణం అద్భుతం...

విశాఖ నగరంలో రుషికొండ సాగర తీరంలో రూ.300 కోట్ల వ్యయంతో ఓషనేరియం ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ఈ ప్రాజెక్టుకు రుషికొండ వెనక భాగంలో సాగరతీరానికి ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. గత జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆనందా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ క్రమంలో సాంకేతిక సర్వే నిర్వహించడానికి మే మొదటి వారంలో జర్మనీ, చైనా దేశాలకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఓషనేరియం ఏర్పాటుకు నిర్దేశించిన ప్రాంతాన్ని సందర్శించనుంది. ఏమిటి ఈ ఓషనేరియంసింపుల్ గా చెప్పాలి అంటే, సముద్రంలో ఉండే ఆక్వేరియం లాంటిది... మనం మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్తుంటే, అద్దంలో సముద్రపు జీవరాశులుని చూస్తూ, ఎంజాయ్ చెయ్యవచ్చు... ఈ ప్రాజెక్ట్ పర్యటకంగా విశాఖకు ఎంతో మేలు చేయ్యనుంది.

తెదేపా జాతీయ కార్యాలయ కార్యదర్శి, పి. అశోక్‌బాబు, ఈ రోజు స్వరూపానంద స్వామి సెక్యూరిటీ పై, ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. "అవినీతిపరులకు, నేరస్తులకు ఆశ్రయం ఇస్తున్న విశాఖ శారదాపీఠం స్వామి దొంగ స్వామి కాదా? విజయవాడ దుర్గమ్మ దేవాలయంలో అక్రమాలకు పాల్పడ్డ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను, అధికారులను కాపాడడానికి శారదాపీఠం నేత రంగంలోకి దిగడం వాస్తవం కాదా? వైసీపీ నేతల అవినీతి సొమ్మును శారదాపీఠంలో డంప్‌ చేసినందుకే శారదాపీఠం నేతకు జెడ్‌+ సెక్యూరిటీ కల్పించలేదా? ఏ స్వామికీ లేని జెడ్‌+ సెక్యూరిటీ శారదాపీఠం నేతకు కల్పించాల్సిన అవసరం ఏమిటి? స్వామీజీల గురించి మాట్లాడే అర్హత వైకాపా మంత్రులకు లేదు. రాష్ట్రంలో 168 దేవాలయాలపై దాడులకు పాల్పడినప్పుడు ఒక్క మంత్రయినా స్పందించారా? దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? మీ యొక్క వైఫల్యాలు, నేర రాజకీయాలు కప్పిపుచ్చుకునేందుకు అబద్ధపు ప్రచారాలకు పాల్పడుతున్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; "దేవాలయాల్లో భద్రతా చర్యలపై ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగానీ, దేవాదాయ శాఖామంత్రి గానీ సమీక్ష చేశారా? దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చడంపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేకపోవడం సిగ్గుచేటు. తిరుమల పవిత్రతను కాపాడింది, ఏడుకొండలకు తెలుగుగంగ నీటిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడేనన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తిరుమలలో బూట్లు వేసుకుని ప్రవేశించి తిరుమలను అపవిత్రం చేసింది ఏడుకొండలను రెండు కొండలుగా మార్చే ప్రయత్నం చేసింది జగన్‌రెడ్డి & కో కాదా? ఎస్వీబీసీ, టీటీడీ ప్రచురణల్లో అన్యమత ప్రచారం చేసింది జగన్‌ ప్రభుత్వం కాదా? పింక్‌ డైమండ్‌పై తిరుమల ప్రతిష్టకే భంగం వాటిల్లేలా దుష్ప్రచారం చేశారు."  

నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల పై చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన స్వరూపానంద పై నిప్పులు చెరిగారు.. చంద్రబాబు మాటల్లోనే "డీజీపీ శారదా పీఠం దొంగస్వామి వద్దకు వెళ్తాడు. ఆర్టీసీ ఛైర్మన్ కూడా వెళతాడు. కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న దుర్గ గుడి ఈవోను సస్పెండ్ చేశారు. ఆయన కూడా నేరుగా దొంగస్వామి వద్దకు వెళతాడు. ముఖ్యమంత్రికి సిగ్గుందా, బుద్ధుందా? ఊడిగం చేయడా నికి దొంగస్వామిని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేయాలనుకుంటే.. సరికాదు. నిన్ను, ప్రజలందరినీ మోసం చేస్తూ.. ఎవరు తప్పు చేసినా అక్కడికి వెళ్లి కానుకలు సమర్పిస్తే, ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి వద్దకు వెళ్తే.. ఆ స్వామి వద్దకు సీఎం వెళితే.. ఇంకేముంది ఈ రాష్ట్రంలో? నువ్వు పోయావు, నీ డీజీ పోతాడు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు. ఇదీ చీకటి రాజ్యం, చీకటి పాలన. ఆయన చేసేది క్షుద్రపూజలు. సీఎం కోసం ఆయన మమ్మల్నందరినీ చంపేస్తాడంటా... చంపు. సర్వత్యాగాలు చేసేవారు స్వాములు. భోగాలు అనుభవించే వారు స్వాములు కాదు. అందుకే చాలా మందికి చెడ్డపేరు వస్తోంది. ఎందుకు మీకు పవర్, వ్యామోహం, వేరే మతస్థులను కూడా వెనకేసుకు వస్తున్నారు. మీరు స్వాములా.. రామతీర్థంలో విగ్రహం ధ్వంసం జరిగితే.. ఈ స్వామి మాట్లాడడు. ఈయన హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తాడా? మీరు పైరవీల కోసం పోతున్నారు. ఇది తప్పు." google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; "ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ వార్తలు మాత్రమే చెబుతుంటాడు. మీ బాబాయిని ఎవరు చంపారో ఇంత వరకు సమాధానం చెప్పడు. మాబాబాయిని ఎవరో చంపేశారు సీబీఐ విచారణ కావాలన్నావు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణే అవసరం లేదన్నావు. చివరికి నీ చెల్లెలు కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ కోసం పోరాడింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కోకు కట్టబెట్టడంపై జగన్ రెడ్డి అమాయకంగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి నాకేం తెలియదు అంటున్నాడు. వాళ్లు వచ్చారు. వేరే చోట పెడతామన్నారు. అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రయత్నం చేస్తున్నా అంటున్నాడు. పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం జరిగిందని, విశాఖ స్టీల్ ప్రాంతంలోనే పెడతారని మీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పారు. దానికి మీరేం సమాధానం చెబుతారు.? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నాటకాలాడుతున్నాడు. భయపెట్టాలని ఎదురు దాడి చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థ జగన్ రెడ్డికి సాగిలపడిపోయి తప్పుడు కేసులు పెడుతోంది. కడుపు రగిలిపోతోంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 12 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. నా దగ్గరా నీ కుప్పి గంతులు.? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా.? ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది, సొంతిల్లు కూడా కట్టుకున్నానని జగన్ రెడ్డి ప్రజల్ని నమ్మించాడు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటావా.? వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు, పీఆర్సీ, ఇంటి స్థలాలు, 45 సంత్సరాలకే పెన్షన్ వంటి ఎన్నో మాటలు చెప్పావ్. ఏమయ్యాయి ఆ మాటలు.? మద్యపాన నిషేధం అంటూ హడావుడి చేసి.. రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకొస్తున్నాడు. ఇదేనా మద్యపాన నిషేధం.? ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమాతో ఉన్నాడు. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏమైనా చెబుతానన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నాడు.రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం తెస్తున్నారు." "దొంగకు అధికారం ఇవ్వడం ప్రజల తప్పా.? లేక దొంగైనా ముఖ్యమంత్రి కావొచ్చనే పరిస్థితి కల్పించిన రాజ్యాంగానిది తప్పా అని ఓ వ్యక్తి నన్ను ప్రశ్నిస్తే.. నా దగ్గర సమాధానం లేదు. దొంగకే తాళాలిచ్చినపుడు ఏం జరుగుతుందో.. రాష్ట్రంలో నేడు స్పష్టంగా కనిపిస్తోంది. విలువలు లేవు. పద్దతి లేదు. దౌర్జన్యాలకు పాల్పడుతూ పులివెందుల పంచాయతీలు తీసుకొచ్చారు. రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి విలువను మంటగలిపారు. నేను అధికారం కోసం పోరాడడం లేదు. ప్రజల కోసం. రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. ప్రజలు కూడా ముందుకు రావలి. భయపడితే వీళ్లు ఇంకా పెచ్చుమీరిపోతారని గుర్తెరగాలి. కుప్పంలో కొన్ని పంచాయతీల్లో వీల్లు గెలిస్తే మగాళ్లంట. అంటే నేను అధికారంలో ఉన్నపుడు పులివెందులలో, పుంగనూరులో పోలీసులను పెట్టి ఈ పని చేయలేకపోయానని మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను కూడా మీలా చేసుంటే ఏం చేసేవారు.? మీకు దిక్కెవరు.? నేను ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం పని చేశాను. మీరు మాత్రం పనికిమాలిన రాజకీయాలు చేస్తూ.. నన్ను బెదిరించాలనుకుంటున్నారు. తీవ్రవాదులకు భయపడలేదు.. ప్రజలక శాంతినివ్వడానికి, ముఠా నాయకులకు, రౌడీలకు గూండాలకు భయపడలేదు. మత విద్వేషకులు లేకుండా మత సామరస్యాన్ని కాపాడేందుకు, ప్రజలకు ప్రశాంతత ఇవ్వడానికి. పోలీసులకు స్వేచ్ఛనిచ్చాను. అదే పోలీసులు నేడు మీచేతుల్లో కీలుబొమ్మలుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యబెట్టి కాలం నెట్టుకురావలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడగాల్సింది పోయి.. దుర్మార్గమైన కార్యక్రమాలకు రాత్రింబవళ్లు ప్రజల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. దెబ్బలు తిని పోరాటాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాం. "

జంగాల వెంకటరమణ (టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి) చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం, అంగశెట్టిపల్లి గ్రామం. "ఓట్ల లెక్కింపులో నాకు గెలుపు ధృవీకరించారు. డిక్లరేషన్ అడిగేసరికి ఆర్వో, స్టేజ్-2 ఆఫీసర్ కొంతసేపు ఉండమని చెప్పారు. ఈ లోగా ఏ నాయకులు వచ్చారో తెలియదు, ఎమ్మెల్యే ఫోన్ చేసిన తర్వాత ఫలితం ఆపేసి, 3 గంటల నుంచి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన నాకు డిక్లరేషన్ ఇవ్వకుండా, తర్వాత అతడికి ఫోన్ చేసి నిలబెట్టేసి వాళ్లకిచ్చారు. 12 ఓట్ల మెజారిటీ వాళ్లకు ఇచ్చారు. నాకు 120 ఓట్ల మెజార్టీ ఉంది. రీకౌంటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేసినా నాకు చేయలేదు. దౌర్జన్యం చేస్తూ.. ప్రస్తుత మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా వచ్చి.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, రీకౌంటింగ్ చేసేది లేదని చెప్పారు. మమ్ముల్ని తరిమేసి వారికి డిక్లరేషన్ ఫాం ఇచ్చారు. మాకు అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని ఆఫీసర్లను అడిగాను. కోర్టు నుంచి కూడా మేం నోటీసు పంపిస్తున్నాం. ఇంత అన్యాయమైన పాలన ఎప్పుడూ చూడలేదు. 7 వార్డులు మేం గెలిచినప్పటికీ ఇంతవరకు డిక్లరేషన్ ఫాం కూడా ఇవ్వలేదు. నాకు డిక్లరేషన్ ఇచ్చేముందుగా అతనికి ఇచ్చేసి 12 ఓట్ల మెజార్టీ అని చెప్పారు. మాకు న్యాయం చేయండి." google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; పూర్ణచంద్రరావు, చీఫ్ ఏజెంట్ (గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం). "నాలుగో దశ పోలింగ్ లో మా సర్పంచ్ టీడీపీ తరపున 58 ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మమ్ముల్ని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రానీకుండా 2 గంటల పాటు రాళ్లదాడి చేశారు. పోలీసులు మాకు రక్షణ కల్పించారు. మళ్లీ ఈ రోజు సర్పంచ్ పై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. గతంలోనూ ఒకసారి ఇంటికొచ్చి కొట్టారు. పోలీసులు రావడం 5 ని. ఆలస్యమైతే సర్పంచ్ అభ్యర్థి గల్లంతయ్వేవాడు. మాకు రక్షణ కల్పించాలి." మేదరమెట్ల అనూరాధ, సర్పంచ్ అభ్యర్థి (గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం). "నేను ఉంగుటూరు సర్పంచ్ గా గెలిచారు. గెలిచిన తర్వాత రాత్రి నుంచి మమ్ముల్ని బయటకు రానీకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మా ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. మేదరమెట్ల సోమశేఖర్(మాజీ సర్పంచ్) చంపేస్తామంటూ 70 మంది ఊరిపైకి వచ్చారు. మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు రక్షణ కల్పించి దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి".. స్వతంత్ర బాబు (సర్పంచ్ అభ్యర్థి) చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, టీఒడ్డూరు గ్రామం. "మా గ్రామంలో వడ్డెర కులం ఎక్కువగా ఉంటుంది. 2107 ఓట్లకు గాను 1746 ఓట్లు పోలయ్యాయి. 9 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక వార్డు ఏకగ్రీవం అయింది. 7 వార్డుల్లో టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. సర్పంచ్ కు వచ్చే సరికి గందరగోళం చేశారు. టీడీపీ మద్దతుదారునికి 720 ఓట్లు, వైసీపీ మద్దతుదారునికి 699 ఓట్లు, ఇండిపెండెంట్ కు 224 ఓట్లు, చెల్లనివి 77 ఓట్లు రాగా.. ఒక 25 ఓట్ల కట్ట మిస్సైంది... అది వైసీపీ మద్దతుదారుడిదే, కాబట్టి 4 ఓట్లతో డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. రీకౌంటింగ్ చేయాలని చెప్పినా ఆర్వో తిరస్కరించారు. పైగా నాపై 353 కేసు పెట్టి వేధించారు. మా మద్దతుదారులపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. మా వార్డు మెంబర్లకు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితాలు అనౌన్స్ కూడా చేయలేదు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరపలేదు. మాకు న్యాయం చేయండి." మోహనమ్మ (సర్పంచ్ అభ్యర్థి) (చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, తీర్థం గ్రామం). "మా గ్రామంలో మొత్తం 220 ఓట్లకు గాను 1933 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 682, వైసీపీకి 682 ఓట్లు వచ్చాయి. కృష్ణవేణి అనే ఆమెకు 527 ఓట్లు వచ్చాయి. నోటాకు 14 వచ్చాయి. చెల్లనివి 28 ఓట్లు. దీంతో కౌంటింగ్ చేస్తే చెరిసమానంగా వచ్చాయి. ఆర్వో చీటీలు వేద్దామని చెప్పారు. సరే అన్నాం. రెండు గంటలు వెయిట్ చేసి.. ఎమ్మార్వో, ఎండీవోను పిలిపించారు. మళ్లీ రీకౌంటింగ్ చేసి చెరొక ఓటు చెల్లలేదని చెప్పి పెండింగ్ లో పెట్టారు. దీంతో ఎండీవో మా మాటలు ఏం పట్టించుకోకుండా దౌర్జన్యంగా చెల్లనివి, నోటావి ఉన్న 42 ఓట్లలో 3 ఓట్లు వైసీపీకి కలిపారు. ప్రశ్నిస్తే.. బయట ఉన్న ప్రజలను పోలీసులు తరిమికొట్టారు. మేం లోపలే ఉండిపోయాం. మాకు ఫోన్ లేదు. మాకు విషయం చెప్పకుండా.. మరుసటి రోజు వైసీపీ 3 ఓట్ల తేడాతో గెలిచారని చెప్పారు. మాకు న్యాయం చేయాలి". మేకల విఠల్ రావు (సర్పంచ్ అభ్యర్థి) గుంటూరు జిల్లా అమరావతి మండలం, వైకుంఠపురం గ్రామం. "మా గ్రామ పంచాయతీ రాత్రి 12 వార్డుల్లో 3 వార్డులు టీడీపీ గెలిచింది. వార్డుల వారీగా చూస్తే వైసీపీ 100 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. సర్పంచ్ కు వస్తే టీడీపీ 17 ఓట్ల మెజార్టీ వచ్చింది. మాకు ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకుండా, లోపలికి ఎవరినీ రానీకుండా చేశారు. వైసీపీ వారు లోపల సెల్ ఫోన్లు ఇచ్చారు. భారీ బలగాలను మోహరించి, కరెంట్ తీసి.. అందరినీ కొట్టారు. మేం భయపడకుండా అక్కడే ఉన్నాం. 2 గంటల తర్వాత మాకు ధృవీకరణ ఇచ్చారు. ఇప్పుడు మమ్ముల్ని బెదిరిస్తున్నారు. మాకు ఊరేగింపు కూడా లేకుండా వెళ్లాం. వైసీపీ వేధింపుల నుంచి మమ్ముల్ని కాపాడండి."

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో ఉన్న వింత వింత పరిస్థితిలు ఎక్కడా ఉండవు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఏకంగా జడ్జిలను కూడా టార్గెట్ చేస్తారు. ఇదేమీ దాచాల్సిన విషయం కూడా కాదు. ఎందుకుంటే ఏకంగా జగన్ మోహన్ రెడ్డి, నేను పలానా జడ్జిల పై కంప్లైంట్ ఇచ్చానని, ఏకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే చెప్పించారు. తెలుగువారైన ఒక సుప్రీం కోర్టు జడ్జి, రేపు చీఫ్ జస్టిస్ అయితే, తన కేసులు విషయంలో ఏదో చేసేస్తారని, ఇప్పుడే భయపడి పోయి, ఆ సుప్రీం కోర్టు జడ్జిని టార్గెట్ చేయటానికి, అధికార పార్టీ చేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఒక పక్క ఇప్పటికీ ఆ సుప్రీం కోర్టు జడ్జి పై, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసారు. అయితే మరో రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాట్టు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్నా మధ్య ఒక కేసు హైలైట్ అయ్యింది. సుప్రీం కోర్టు జడ్జికి సంబందించిన వివరాలు తీసుకుని, తన దగ్గరకు రావాలని, అతని సంగతి చూస్తాను అనే విధంగా, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య అలాగే వైసీపీ నేతలు వేధిస్తున్న జడ్జి రామకృష్ణ ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; అయితే ఈ విషయం మళ్ళీ కోర్టుకు చేరుకుంది. జడ్జిల పై కుట్ర పన్నే విధంగా, జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహరించారు అంటూ, జడ్జి రామకృష్ణ హైకోర్టులో కేసు వేసారు. అయితే, దీని పై స్పందించిన హైకోర్టు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీని పై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ఆదేశించింది. అయితే దీని పై జస్టిస్ ఈశ్వరయ్య, సుప్రీం కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలని కోరారు. ఈ కేసుని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తన వాయిస్ ని మార్చారు అంటూ ఈశ్వరయ్య వాదించారు. అయినా తాను ఏమి కుట్రలు పన్నలేదని, బయట ప్రచారంలో ఉన్నవే చెప్పానని అన్నారు. అలాగే జడ్జి రామకృష్ణ తరుపు న్యాయవాది స్పందిస్తూ, మొత్తం ఆడియో మీ ముందు ఉంచాం అని, ఇందులో ఎడిట్ చేయటానికి ఏమి ఉంటుంది, అది తప్పుడు ఆరోపణ అంటూ తోసిపుచ్చారు. ఇరువరి వాదనలు విన్న కోర్టు, ఈ పిటీషన్ పై వాదనలు ముగిసాయని, అఫిడవిట్ లు పరిశీలించి, తుది తీర్పు చెప్తాం అని, కేసు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

విద్యార్ధులు బస్ పాస్ పొందాలంటే, అదో ప్రహసనం. ఓ రోజంతా సమయం వృధా, సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు, అన్నీ ముగించుకుని బస్తాండ్ కు వెల్తే గంటల కొద్ది క్యూ. ఆ రోజంతా స్కూల్/కాలేజీకి సెలవు. ఇలా లెక్కలేనన్ని ఇబ్దందులతో బస్ పాస్ పొందాల్సి ఉంటుంది. విద్యారుల అవస్థలను అర్థం చేసుకున్న ఆర్టీసీ సరికొత్త ఆన్లైన్ బస్ పాస్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బస్ పాస్ దరఖాస్తు చేసుకోవడం, దానిని పొందడం కూడా ఈజీనే. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; www.apsrtcpass.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే, పదో తరగతి వరకూ విద్యార్ధులకి, పడవ తరగతి పై బడిన విద్యార్ధులకి వేరు వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసిన తరువాత, కొత్త పాస్ కోసం రిజిస్టర్ చెయ్యలా ? లేదా పాస్ రెన్యువల్ చేసుకుంటారా అని అడుగుతుంది. విద్యార్థి పూర్తి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, సెల్ ఫోన్ నెంబర్, ఈ-మెల్ అడ్రస్, విద్యార్థి ఫోటో, జిల్లా, మండలం, గ్రామం, ఇంటి నంబరు, ఊరిపేరు తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరచాలి. పూర్తి వివరాలకు, ఈ వెబ్సైట్ కి వెళ్లి చూడండి www.apsrtcpass.in

ఏడాదికి ఎకరాకు 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ప్రకృతి వ్యవసాయంలోనే ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలకు కాలం చెల్లిందని, ఆ పద్ధతుల వలన రైతులకు నష్టం కలుగుతుందని వినియోగదారులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రైతుల భూములలో భూసారం తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయి అప్పులు పెరిగి వ్యవసాయం మానేసి గ్రామాల నుండి పట్టణాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా యువతకు సేద్యం అంటే తెలియని పరిస్థితి వచ్చిందని, ఉన్న ఆస్తులను తెగనమ్ముకుని పట్టణాలకు వలస వెళుతున్నారని అన్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు లాభాల పంట పండించేందుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని సుభాష్ పాలేకర్ అన్నారు. ద్రాక్ష, స్టాబెర్రీ, యాపిల్, దాల్చిన చెక్క, మిరియాలు వంటి పంటలను ఆంధ్రప్రదేశ్ భూముల్లో కూడా పండించవచ్చని ఆయన అన్నారు. ఎకరాకు 6 లక్షలు నుండి 12 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఒక్క ప్రకృతి వ్యవసాయానికే ఉందని అన్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందిస్తే ఎంతో లాభం గడించవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పాలసీలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉందంటూ ఈ విషయం ఇప్పటివరకు కాకినాడ, తిరుపతి పట్టణాలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. మరికొంత మంది రైతులకు వచ్చే జనవరిలో హైదరాబాదులో శిక్షణ కార్యక్రమాలు కల్పించి అవగాహన కల్పిస్తామన్నారు. త మిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఎకరాకు 80 క్వింటాళ్లు పండించిన ఘనత అక్కడి రైతులదన్నారు. వారు రసాయనిక ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు వినియోగించలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 123 కోట్లు ఉందని, భవిష్యత్తులో 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లు పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఎటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఆలోచించాలన్నారు. అయితే ఇప్పటికి దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అదిక ఉత్పత్తులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధిపతులు అంటున్నారని ఆయన అన్నారు.

ఉచిత వైద్య సహాయమును రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షలకు పెంపు వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు రూ. 6 లక్షల వరకు చికిత్స మూత్రపిండ మార్పిడి చికిత్స ఆపరేషన్ కు రూ. 3.5 లక్షలు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్సకు వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్యం రాష్ట్రంలోని 421 ఆసుపత్రుల్లో చికిత్స 944 చికిత్సలతోపాటు అదనంగా వంద చికిత్సలు మొత్తము 1044 చికిత్సలకు ఉచితంగా వైద్య చికిత్స ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ‘అందరికీ ఆరోగ్యం’ పేరుతో రూపొందించిన ఈ పథకానికి పేద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కాయకష్టం చేసుకుంటే కానీ పూటగడవని నిరుపేదలకు ఈ పథకం వరంలా మారింది. అనుకోకుండా జబ్బుల బారిన పడి.. వైద్య పరీక్షలకు, ఆపరేషన్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేని పేదలంతా ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్నే ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న జబ్బుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యం అందుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక.. 2014 జూన్ 2 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రారంభించారు. రాష్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కోటీ 30 లక్షలకు పైగా కుటుంబాలను ఈ పథకంలో చేర్చారు. 29 విభాగాలకు చెందిన 1044 వ్యాధులకు సంబంధించి రెండున్నర లక్షల రూపాయల విలువైన వైద్య పరీక్షలు, ఆపరేషన్లను ఈ పథకంలో నిర్వహిస్తారు. ఈ పథకం కింద కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ వైద్యం చేయించుకునే అవకాశం ఉండటం పేద ప్రజలకు సౌకర్యంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ హాస్పిటళ్లనే కాకుండా.. 338 ప్రైవేటు హాస్పిటళ్లను ఈ పథకంలో చేర్చి.. పేదలకు వైద్యం అందేలా చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగ్గా వైద్యం చేయరన్న భయంతో ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి.. ఉన్నదంతా అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని బాధపడే పేదలు కూడా.. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వైపు చూస్తున్నారు. దీంతో క్రమేపీ ఈ పథకం కింద వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, నాణ్యమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయించారు. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను కూడా ఆధునీకరించేలా చర్యలు తీసుకున్నారు. ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు, వైద్య సేవల విస్తృతి, మందుల కోసం నిధుల పెంపు, హాస్పిటళ్లలో పారిశుధ్యం మెరుగుకు చర్యలతో.. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలదన్నేలా తయారయ్యాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ముఖ్యంగా నిరుపేదలకు ఈ పథకం సంజీవినీగా మారుతోంది. ఎలాంటి ఖర్చు లేకుండా... అన్ని విధాలుగా ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు కార్డులతో వైద్యం అందిస్తోంది. జూన్ 2, 2014 నుంచి ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నారు. ఇంతకు మునుపు ఉన్న 944 చికిత్సలకు అదనముగా 100 చికిత్సలను చేర్చి, మొత్తము 1044 చికిత్సలకు అనుమతి పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితముగా వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి ప్రభుత్వం వారు ఇంతకు మునుపు ఇస్తున్న ఉచిత వైద్య సహాయాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు చేయు కాక్లియార్ ఇంప్లాంటేషన్ కు రూ. 6 లక్షల వరకు మరియు మూత్ర పిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ. 3.5 లక్షల వరకు ఈ పథకం కింద లబ్దిపొందవచ్చు. గుండె , ఊపిరి తిత్తులు మరియు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్స కూడా ఈ పథకంలో చేర్చారు. దీని ద్వారా నిరుపేదలకు ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం వారికి వైద్య సహకారాన్ని అందిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ఇప్పటివరకు అవుట్ పేషంట్ల సంఖ్య 13,06,773... అలాగే ఇప్పటివరకు ఇన్ పేషంట్ల సంఖ్య 14,28,813... ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకున్నవారు 8,64,517. వారి చికిత్స కోసం అయిన మొత్తం రూ. 2528.079 కోట్లు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 12,78,583. ఆపరేషన్ల కోసం ఖర్చయిన మొత్తం రూ. 3728.997 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపుల కోసం వచ్చిన క్లెయిమ్ లు 11,87,309 గా ఉన్నాయి. క్లెయిమ్ ల కోసం చెల్లించిన మొత్తం రూ. 3138.245 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి 133 వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకే కేటాయించడమైనది. 133 వైద్య సేవలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన 911 (1044-133=911) వైద్య సేవల సంఖ్య 3,05,357 గా ఉంది, ఈ వైద్య సేవలకు వెచ్చించిన ఖర్చు రూ. 801.524 కోట్లకు చేరుకొంది. ఇక 133 వైద్య సేవలకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకున్నవారి సంఖ్య 48,560గా ఉన్నాయి, ఈ సేవల కోసం వెచ్చించిన మొత్తం రూ. 137.306 కోట్ల మేర చెల్లించారు. 133 వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 103 గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిరుపేదల తమ జీవన సౌధాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. లక్షల రూపాయలు వైద్యం కింద చెల్లించడం తమ వల్లే అయ్యేది కాదని... రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ విధంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో తమ జీవితాలకు భరోసా వచ్చిందని వారు భావిస్తున్నారు. చికత్స తీసుకున్న ప్రతి పేషెంట్ వివరాలు, అయన ఖర్చు, సమయం, హాస్పిటల్ పేరు ఇలా అన్నీ కోర్ డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి... ప్రతి పైసాకి పూర్తి జవాబుదారీతనం ఉంటుంది.. http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/HealthFamilyWelfare/NTRVaidhyasevaMainReport.aspx

సమాజంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పధంలో నడిపిస్తూ, అందరికీ సరైన గౌరవం ఇస్తూ, అన్ని రకాల పధకాలతో, ఆర్ధికంగా, సామజీకంగా ఆడుకుంటున్న చంద్రబాబు, ముస్లిం సోదరులను కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు... చంద్రన్న రంజాన్ తోఫా:పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా చేసుకోవాలన్న ఆకాంక్షతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రన్న రంజాన్ తోఫాను 11.3 లక్షల కుటుంబాలకు అందించింది. చంద్రన్న రంజాన్ తోఫా కోసం ప్రభుత్వం రూ. 65.36 కోట్ల విడుదల చేసింది. క్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యితో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌ను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇమామ్లకు, మౌజన్లకు పారితోషికం:రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 2017-18 బడ్జెట్లో రూ. 840.25 కోట్ల కేటాయించింది. పేదరికంలో మగ్గుతున్న 5000 మసీదులలోని ఇమామ్లకు, మౌజన్లను పారితోషికం కింద గత ఏడాది రూ.24 కోట్ల కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్లో రూ.32 కోట్లు కేటాయించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దుల్షన్ పథకం:ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముస్లిం, మైనార్టీ కుటుంబాల యువతులకు దుల్షన్‌ పథకం ద్వారా రూ.50వేలు అమ్మాయి పేరిట బ్యాంకు ఖాతాలో వేస్తారు. దుల్షన్ పథకం కింద గత ఏడాది రూ.49.11 కోట్ల కేటాయిస్తే, 9,822 మంది లబ్దిపొందితే, ఈ ఏడాది రూ. 60 కోట్ల కేటాయింరు, దీంతో 12,000 మంది ముస్లిం వధువులు లబ్దిపొందుతారు. రోష్ని పథకం:మైనార్టీ వితంతువులు, భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు, అంగవైకల్య మహిళలకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 75 శాతం సబ్సిడీతో రూ.25 వేలు ఆర్థిక సాయం ఆదరణ పథకం:చిరు వ్యాపారులకు యూనిట్‌కు రూ.25వేలు సబ్సిడీ, ఆదరణ పథకం ద్వారా రూ.10వేలు నుంచి రూ.25 వేలు వరకూ ఆర్థిక సాయం. నిరుద్యోగ యువతకు సబ్సిడి ద్వారా రుణ సాయం: మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్:అలాగే 2016-17లో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 203.45 కోట్ల, మెయింటెనెన్స్ ఫీజు కింద రూ. 44.69 కోట్ల ఇస్తే, 1,08,322 మంది విద్యార్థులు లబ్ది పొందారు. 2017-18లో ఫీజు రీయింబర్స్మెంట్ కు రూ. రూ.225.00 కోట్ల, మెయింటెన్స్ ఫీజు కింద రూ. 60 కోట్ల కేటాయించారు. దుకాన్‌-మకాన్‌ పథకం:మైనార్టీల సంక్షేమానికి రూ.379 కోట్లు కేటాయుంచిన ప్రభుత్వం, ‘దుకాన్‌-మకాన్‌’ పథకం కింద యూనిట్‌ విలువలో 50 శాతం గరిష్ఠంగా రూ.లక్ష దాకా సబ్సిడీ ఇస్తుంది. మసీదుల కోసం:2016-17లో 57 మసీదులకు 6.99 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. మైనారిటీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం:ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని 300 మంది ముస్లిం విద్యార్థులకు వర్తింపజేస్తే, మైనారిటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవటానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 10 లక్షల సహాయం అందచేసారు. హజ్ హౌస్:కడప లో హజ్ హౌస్ నిర్మాణానికి 12 కోట్ల, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి రూ 11 కోట్ల కేటాయించారు. ఉర్దూ భాషాభివృద్ధికి:ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయింపు మక్కా యాత్రకు:ముస్లిం సోదరులకు పవిత్ర మక్కా యాత్రకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2,810మంది హజ్‌ యాత్రకు. ముస్లింలకు శాసనమండలి చైర్మన్‌ పదవి:శాసనమండలి ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూఖ్‌ మండలి చైర్మన్ గా:ముస్లిం సమాజ అభివృద్ధి ముస్లింల పట్ల విశ్వాసాన్ని చూపుతూ, ఎం ఎల్ సి గా ఫరూక్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మెన్ నోమాన్ గారికి పదవులు ఇచ్చి, మండలి చైర్మన్ పదవి కూడా ముస్లింలకు ఇచ్చి, ముస్లిం సోదరుల నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ మరోమారు చంద్రబాబు తాను ముస్లిం పక్షపాతిని అని నిరూపించుకున్నారు. ఇలా అన్ని రకాలుగా, రాష్ట్రంలోని ముస్లిం సోదరులను, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుని, అండగా ఉంటుంది...

రాష్ట్రంలో బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోంది. బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా, ఉన్నత స్థాయికి ఎదిగేలా పధకాలు ప్రవేశపెట్టారు. అంతే కాదు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో, మంత్రివర్గంలో అత్యధికంగా 8 మంది బీసీలకు చోటు కల్పించారు చంద్రబాబు. తమ పార్టీకి వెన్నుముక బీసీలు మాత్రమే అని చెప్పే చంద్రబాబు, అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు కావాల్సి నిధులను సైతం అందిస్తోంది. బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు అందిస్తున్న పథకాల వివరాలు ఇవి... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; బీసీ సబ్ ప్లాన్:దేశ చరిత్రలో తొలిసారిగా బిసిల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఇందుకు రూ. 10,000 కోట్లు కేటయించింది. గత ఏడాది కంటే ఇది 13.22% ఎక్కువ. బీసీ ఫెడరేషన్ లోన్స్:కుల వృత్తులవారికి, చేతివృత్తులవారికి బి.సి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఐదుగురు సభ్యులున్న బృందానికి రూ.10 లక్షల వంతున యూనిట్ స్థాపనకు ఇవ్వనున్నారు. చంద్రన్న పెళ్లి కానుక:బీసీల కోసం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించిన చంద్రబాబు, దీని ద్వారా బీసీ జంటలకు రూ.30 వేలు పెళ్లి ఖర్చుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆదరణ పధకం:బిసిల్లో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ కులవృత్తిని ప్రోత్సహించేందుకు ‘ఆదరణ’ పధకం. కులవృత్తుల చేతివృత్తి పనివారి ఆదాయాన్ని పెంచేలా పని ముట్లను కొనుగోలు చేసుకొనుటకు ఆదరణ పధకం క్రింద ఆర్థిక సహాయం. బీసీ విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంట్:10 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌లు చెల్లించారు. 2017-18లో 8,80,000 మంది బిసి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటిదాకా (28.8.17 వరకు) 6,77,976 మంది విద్యార్ధులు నమోదు చేయించుకున్నారు. బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ రూ.274.50 కోట్లు కేటాయించగా, రూ.137.25 కోట్లను రెండు విడతలుగా విడుదల చేశారు. మొత్తం 4,84,714 మంది బిసి విద్యార్ధులు లబ్ది పొందారు. పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద 3,77,510 మంది విద్యార్ధులు లబ్ది పొందారు. ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ ‌మెంట్ కింద రూ.1042 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, రూ.521 కోట్లు విడుదల చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం:2016-17 బిసి ఉప ప్రణాళికలో 500 మంది బీసీ విద్యార్ధులకు ‘ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం’ అమలు. ఇందుకోసం రూ.69.11 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం క్రింద బీసీ విద్యార్ధులు విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రతి విద్యార్థికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వం స్కిల్‌ డవలప్‌ మెంట్‌ :విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం పై శిక్షణ ఉండాలని స్కిల్‌ డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీ భవన్‌:ప్రతీ జిల్లాలో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో బీసీ భవన్‌ ఏర్పాటు బీసీ గురుకుల పాఠశాలలు:వెనుకబడిన గురుకుల పాఠశాలల్లో 16,000 మంది బిసి విద్యార్ధులకు విద్య బీసీ సంక్షేమ పథకాలు:బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్.బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ఈబీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసంబీసీ వెల్ఫేర్ హాస్టళ్ళుబిసి స్టడీ సర్కిళ్లు, బాలబాలికల హాస్టళ్ళు.బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళుబీసీ గురుకుల పాఠశాలలుమహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విద్యానిధిహాస్టళ్లు, స్కూలు భవనాల నిర్మాణంవెనుకబడిన తరగతులకు సామాజిక భవనాల నిర్మాణంఏపీ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణాలుబీసీ అభ్యుదయ యోజనబిసి ఫెడరేషన్స్దోభీ ఘాట్ల నిర్మాణం

రాష్ట్రంలో చాలా మంది శిశువులు బరువు తక్కువగా ఉండటం... వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారు. శిశు మరణాలను నివారించేందుకు, వారిని వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ’’ఎన్టీఆర్ బేబి కిట్స్‌’’ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వం ఇచ్చేది రూ.772 విలువ చేసే వస్తువులు అయినా అంతకంటే ఎక్కువ విలువచేసే ఫలితాలు కనిపిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల శాతం మూడింతలయింది. ఇదంతా బేబి కిట్స్‌ వల్లనే కాకపోయినా... డెలవరీలు పెరగడానికి మాత్రం ఇదీ ఒక కారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. తల్లీబిడ్డలకు ఏకకాలంలో రక్షణ దొరుకుతుండటంతో.. బేబి కిట్స్‌ని అందించే ప్రభుత్వాస్పత్రులకు ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. పథకం అమల్లోకి వచ్చిన తరువాత డెలివరీల శాతం మూడింతలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి అంతగా సమకూరని శిశుదశని దాటేస్తే.. బిడ్డ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ కీలక దశలో బేబికిట్స్‌ని అందించడం మంచి ఫలితాలను ఇస్తున్నదని, చిన్నారుల మరణాల శాతం తగ్గడానికి దోహదపడిందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెలివరీల కోసం ప్రజలు చేసే ఖర్చు 50 శాతం నుంచి 17 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. మరో ఏడాదికి ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూటికి 90శాతం మంది పేదలు చికిత్స చేయించుకొనే మిషనరీ ఆసుపత్రుల్లో సైతం బేబి కిట్స్‌ని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఏమేం ఉంటాయి.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; బేబి కిట్స్‌లో బెడ్‌ కమ్‌ క్యారీ కిట్‌, టవల్‌, హ్యాండ్‌ వాష్‌, దోమ తెర వంటి నాలుగు వస్తువులుంటాయి. వీటిలో బెడ్‌ కమ్‌ క్యారీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉంచితే, తల్లి గర్భంలో శిశువుకు ఎలాంటి రక్షణ లభిస్తుందో, ఆ స్థాయి కవచంలా పనిచేస్తుంది. బయట వాతావరణం వల్ల శిశువులకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడటంతోపాటు, ముద్దు చేయడానికి ముందుకొచ్చే వారి నోరు, చేతుల్లోని ఇన్ఫెక్షన్‌ నుంచి చిన్నారులను రక్షిస్తుంది. కాటన్‌తో తయారు చేయడం వల్ల చిన్నారుల శరీరానికి హాయిని అందిస్తుంది. చిన్నారులకు స్నానం అనంతరం వాడటానికి టవల్‌ని కిట్‌లో ఉంచారు. పాలిచ్చే సమయంలో తప్ప.. తల్లులు బిడ్డల దగ్గర సాధారణంగా ఉండరు. ఏదో పని చక్కబెడుతూనే ఉంటారు. అటువంటివారి కోసం హ్యాండ్‌ వాష్‌ని ఉంచారు. పాలిచ్చే ముందు హ్యాండ్‌ వాష్‌తో చేతులు శుభ్రం చేసుకొంటే, ఎలాంటి సమస్యలూ దరికి చేరవు.   గత ఏడాది సెప్టెంబరు నుంచి జూలై చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 2 లక్షల 25 వేల మంది డెలివరీ అయితే 2,05,200 మంది మహిళలకు బేబి కిట్లు అందించారు. ఈ పధకానికి బసవతారకం కిట్‌ అదనం. ఈ కిట్‌ విలువ రూ. 1000 పైన ఉంటుంది. ఇందులో బాలింతలకు అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌, తలకు చుట్టుకొనే స్కార్ఫ్‌, బిడ్డకు పాలిచ్చేందుకు అనుకూలంగా ఉండే రెండు యాప్రాన్లు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రె్‌సలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న వారికి రూ.1000 ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పధకం ఏంతో పారదర్శకంగా జరుగుతుంది... ఎవరికి కిట్ ఇచ్చారు, ఏ జిల్లలో, ఏ హాస్పిటల్ లో ఇచ్చారు, తల్లి, తండ్రి,బిడ్డ పేరుతో సహా, ఫోటో తీసి వెబ్సైటులో పెడతారు... ఏ రోజు , ఎవరు తీసుకున్నారు అనే వివరాలు అన్నీ తెలుస్తాయి... ఇక్కడ చూడవచ్చు http://hmfw.ap.gov.in/DH/NBK_DisWise_Reports.aspx

బాబు అంటే భరోసా... బాబు అంటే నమ్మకం... బాబు అంటే బాధ్యత... ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్నదనే లక్ష్యంతో, బాలికా విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లాపరిషత, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ‘బడికొస్తా’ పథకంతో సైకిళ్లు పంపిణీ చేస్తుంది. ఈ పథకానికి రూ.75 కోట్ల వ్యయమవుతోందని 1,81,556 సైకిళ్లు అందజేయనున్నారు. డ్రాపవుట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; నిజానికి, తొమ్మిదో తరగతిలోనే డ్రాపవుట్లు ఎక్కువ. కీలక అడుగు పడే సమయం ఇది. ఈ ఒక్క క్లాసు దాటేస్తే.. చదువులో ముందుకు వెళ్లిపోతారు. సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో ‘అడుగు ముందుకా- వెనక్కా’ అనేది తేలిపోయేది ఆ సమయంలోనే. ఈ విషయంలో ఆడపిల్లల పక్షా న నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ, మరోవైపు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్ర యాణం చేసేలా.. ఈ తరగతి బాలికల కోసం వినూత్న పథకం ప్రవేశపెట్టింది. 2017 ఆగష్టు నెల వరకు జిల్లాల వారిగా, సైకుళ్ళు తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళంలో 12,916 మందికి గాను, 7,228 మంది, విజయనగరంలో 9,874 మందికి గాను, 5,054, విశాఖలో 12,962 మందికి గాను, 12,159, తూర్పుగోదావరిలో 22,652 మందికి గాను, 21,300, పశ్చిమగోదావరిలో 16,841 మందికి గాను, 16,266, కృష్ణాలో 13,970 మందికి గాను, 13,569, గుంటూరులో 15,533 మందికి గాను, 15,507, ప్రకాశంలో 10,582 మందికి గాను, 6,100, నెల్లూరులో 9,674 మందికి గాను, 8,580, చిత్తూరులో 16,722 మందికి గాను, 16,722 (100 శాతం), కడపలో 9,257 మందికి గాను, 9,257(100 శాతం), కర్నూలులో 14,922 మందికి గాను, 14,111, అనంతపురంలో 15,581 మందికి గాను, 15,225 మంది బాలికులకు సైకుళ్ళ పంపిణీ జరిగింది. సైకిళ్ళు అందుకున్న ఆ పిల్లల ఆనందం వారి మాటల్లోనే వినండి...

పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్ర లోని దాదాపు 12 లక్షల మందికి పైగా ఉన్న దివ్యాంగుల సర్వతొముఖాభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి పథకాలను అమలుచేస్తోంది. సమాజంలో వెనుకబాటుతనం అనుభవిస్తున్న దివ్యాంగులు ఇతరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో భాగంగా కాళ్లు పూర్తిగా లేని, నడుం కింది భాగం నుంచి పూర్తిగా పనిచేయని వారికి తోడ్పాటును అందించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా మూడు చక్రాల బైక్, బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను అందించే భృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు తమ కనీస అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉచిత వాహనాల పంపిణీ చేపట్టింది. దీనికోసం రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా దివ్యాంగుల కోసం అనే వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా అక్టోబరు 15వ తేదీ లోగా ఉచిత వాహనాలను పొందేందుకు అర్హులైన దివ్యాంగులు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా వాహనాల పంపిణీ పథకం అమలులో ఉన్నప్పటికీ కఠినమైన నిబంధనలతో పాటు కేవలం 50 శాతం సబ్సిడీ పై పీజీ విద్యార్హత కలిగిన వారికే వాహనాలను పంపిణీ చేయడం జరిగేది. ఈ విధంగా 2015-16 సంవత్సరంలో మోటరైజ్డ త్రీ వీల్స్ వెహికల్స్ 50 మందికి, 2016-17 సంవ త్సరంలో 47 మందికి అంద చెయ్యటం జరింగింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఎలా అప్లై చేసుకువాలి ? పదవ తరగతి పాసైతే చాలు.గతంలో పీజీ చదుకున్నదివ్యాంగులకే మూడు చక్రాల బైక్ ను అందిస్తున్న ప్రభుత్వం మరింత మందికి లబ్దిని చేకూర్చే దిశగా తాజాగా విద్యార్హత నిబంధనలను సడలించింది. దీనితో రూ.75 వేల విలువ గలిగిన మూడు చక్రాల బైక్, లక్షరూపాయల విలువ గలిగిన బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారు సవరించిన నిబంధనల ప్రకారం 10వ తరగతి పాసైతే చాలు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి కాళ్లలో 80 శాతం అంగవైకల్యం ఉందనే వైద్య ధృవీకరణ పత్రంతో పాటు పదవ తరగతి మార్కుల జాబితా, అంతకు మించి విద్యార్హతలు ఉంటే వాటి వివరాలు, ఆధార్, రేషన్ కార్డులు, కుల ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు, డైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నవారు ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక వెబ్ సైట్ (http://www.apdascac.ap.gov.in/) ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు అర్హులు ? మూడు చక్రాల బైక్లను పొందాలనుకునే వారికి చేతులు ధృడంగా ఉండటంతో పాటు నడుము క్రింది భాగంలో 80 శాతం వైకల్యం ఉండాలి. కానీ వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారికి నడుము పై భాగంలో కూడా వైకల్యం ఉండాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తరువాత వచ్చిన ధరఖాస్తులను కులంకషంగా పరిశీలించి, అర్హులైన దివ్యాంగులను ఎంపికచేసి, వారిలో 2,450 మందికి మూడు చక్రాల బైక్లు, 175 మందికి వీల్ చైర్ వాహనాలను అందజేయనున్నారు. మొత్తం 2625 వాహనాల పంపిణీ కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.20.18 కోట్లు నిధులను కేటాయించింది... అలాగే అంధులకు కూడా ప్రత్యేక ల్యాప్‌ట్యా్‌పలు, కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. కీబోర్డుపై చేతితో టైప్‌ చేసే అక్షరాల శబ్దం వినిపించేలా వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీటిని అందిస్తారు. అలాగే, మూగ, చెవిటివారికి సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. వీడియో కాలింగ్‌ ద్వారా సంజ్ఞలతో మాట్లాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. సమాజంలో మేమేమి తాక్కువ కాదు అని వీరు అనుకోకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ, చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశం...