ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. పోలీసులు, అధికార పార్టీ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారు అనేదానికి ఇదే సాక్ష్యం. గత వారం కొంత మంది బీపీ పెరిగిన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానాలు, కర్రలు, రాళ్ళు, పలుగులు, సుత్తులు తీసుకుని వచ్చి, తమ బీపీ తగ్గే వరకు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టిడిపి కార్యాలయాల పైన దా-డు-లు చేసిన సంగతి తెలిసిందే. ఇది బీపీ పెరిగి చేసారని జగన్ మోహన్ రెడ్డి అంటుంటే, చూసిన వారికి మాత్రం ఉన్మాదం పెరిగి చేసారని అర్ధం అవుతుంది. అయితే బీపీ పేషెంట్లు అనో ఏమో కానీ, దా-డి-లో పాల్గున్న వైసిపీ కార్పొరేటర్లు, ఇతర పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి, చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వారి పై కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకున్నారు అంటూ టిడిపి ఆరోపిస్తుంది. అదీ కాక వారి పైన మొత్తం బెయిలబుల్ కేసులే పెట్టారు. అయితే టిడిపి నేతల విషయంలో మాత్రం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, 41 ఏ నోటీస్ ఇవ్వకుండా కూడా వారిని అరెస్ట్ చేసేంత వరకు వెళ్తున్నారు. తాజాగా టిడిపి మాజీ ఎమ్మెల్యే, బొండా ఉమాకు షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయన పై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ఈ కేసు ఏమిటో తెలిసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

bonda 27102021 2

తమ పార్టీ ఆఫీస్ పై రౌడీ మూకలు దా-డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా బొండా ఉమా ప్రసంగించారు. అయితే బొండా ఉమా ప్రసంగంలో అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ, వైసిపీ నేత గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేయటంతో, బొండా ఉమా పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. 53a, 294 b, 504 , 505, 506 సెక్షన్ల కింద బొండా ఉమా పై కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు చిటిక వేస్తే, తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయం నేలమట్టం చేస్తాం అంటూ బొండా ఉమా ప్రసంగించటమే కారణం. దీని పైన వైసిపీ నేతలు మూడు రోజుల క్రిందట ఫిర్యాదు చేయగా, బొండా ఉమా పై కేసు నామోదు చేసారు. దీని పై బొండా ఉమా స్పందిస్తూ, ఈ అక్రమ కేసులు ఎదుర్కోవటానికి దేనికైనా సిద్ధమే అని ప్రకటించారు. దా-డి చేసిన వారి పైన ఒక విధంగా వ్యవహరిస్తూ, ప్రసంగాలు చేస్తుంటేనే కేసులు, అరెస్ట్ లు చేస్తున్నారు అంటూ, టిడిపి శ్రేణులు మండి పడుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read