అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. కృష్ణాయపాలెంలోని రైతుల శిబిరాలలో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసన చేస్తున్నారు. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు ప్రభుత్వం బస్సులు పంపింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని చెప్పినా వినకుండా బస్సులు లాక్కున్నారు. స్కూల్, కాలేజీల బస్సుల్లో జనాన్ని తరలించారు. అమరావతిలోని రైతుల నేతలను ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. హౌస్ అరెస్ట్‌ పై రైతులు తీవ్రంగా నిరసన చేస్తున్నారు.  రైతుల ఆందోళనతో అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read