ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా, విజయవాడ కృష్ణా నదీ తీరాన జరిగే దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం, ఈ రోజు రద్దు అయ్యింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం కోసం, ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో, ఆలయ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండటంతో, దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆగమ శాస్త్రం ప్రకారం, వర్షం పడుతున్నప్పుడు, ఉత్సవమూర్తులను బయటకు తీయకూడదని అర్చుకులు చెప్పటంతో, ఈ మేరకు ఉత్సవం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇన్నేళ్ళ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, 20 ఏళ్ల క్రితం ఎప్పుడో ఇలా జరిగిందని, మళ్ళీ ఇప్పుడు ఇలా దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం జరగకుండా పోయిందని చెప్తున్నారు. హంసవాహనం పై ప్రతి ఏడాది ఉత్సవ మూర్తులు జల విహారం చేస్తారు. అయితే వరద వస్తుందని నిన్నే జల విహారం రద్దు చేసారు. కేవలం కృష్ణా నది ఒడ్డున హంస వాహనంలో, స్వామి వారి కైంకర్యాలు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ రోజు వర్షం పడుతూ ఉండటం, చివరకు అది కూడా రద్దు అయిపోవటంతో, భక్తులు నిరస చెందారు. 20 ఏళ్ళ తరువాత, ఇలా జరగటం పై, ప్రజలు నిరాసగా వెనుతిరిగారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read