అనుకున్నదే జరుగుతుంది.. ఆపరేషన్ గరుడ ఊపందుకుంది... ఒక పక్క పవన్ కళ్యాణ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంటే, మరో పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలు బరి తెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు... ఈ రోజు, చంద్రబాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలన రేకెత్తిస్తున్నాయి... ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని వ్యాఖ్యానించారు.... 2004లో అలిపిరి దాడి గుర్తుందా... 2019లో అదే రిపీట్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.. అంటే, అలిపిరి తరహాలో చంద్రబాబు పై దాడి చేస్తాం అంటూ, చెప్పకనే చెప్తున్నారు... దేశంలో మోదీకి చంద్రబాబు మొదటి శత్రువని చెప్తూ, వచ్చే ఏడాదిలో బాబుకు చుక్కులు చూపిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు... అంతే కాదు, పవన్ తల్లిని కూడా తిట్టించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయించారని అంటూ, పవన్ కు వత్తాసు పలికారు సోము వీర్రాజు..

cbn 21042018

ఇవన్నీ చూస్తూ ఉంటే, ఏదో అతి భారీ కుట్ర జరుగుతుంది... అలిపిరి తరహా రుచి చూస్తావ్ అని డైరెక్ట్ గా మీడియాతో అంటున్నాడు అంటే, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా.... దాడులు చేసి చంద్రబాబుని భౌతికంగా దాడి చేస్తామనా ? ఏమి చెప్తున్నావ్ వీర్రాజు... ఏంటి మీ కుట్ర ? ఇప్పటికే చంద్రబాబు పదే పదే చెప్తున్నారు... తమిళనాడు తరహా రాజకీయం చేస్తున్నారన... ఇప్పటికీ జయలలిత మరణం పై అనుమానాలు ఉన్నాయి... ఈ నేపధ్యంలో, సోము వీర్రాజు మాటలు సంచలనం కలిగిస్తున్నాయి... వచ్చే ఏడాది అంతా, చంద్రబాబుకి చుక్కలు చూపిస్తాం అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు వీర్రాజు...

cbn 21042018

ప్రజలు పిచ్చోళ్ళు కాదు.... ఇప్పటికే మీ నాటకాలు అర్ధమయ్యాయి... మీరు ఎన్ని కుల గొడవలు లేపుతారో, ఎంత మారణహోమం చేస్తారో, తెలియనది కాదు... మీ గుజరాత్ లో ఎంత మారణహోమం చేసారో, దాని వెనుక ఉంది ఎవరో అందరికీ తెలుసు వీర్రాజు... మీ ఆటలు ఇక్కడ సాగవ్... కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి ఒకసారి గుర్తు చేసుకోండి... చంద్రబాబు గారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి... వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు... మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తు... ప్రతి ఒక్కరు మీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నాం... ఇలాంటి కుట్రలు తిప్పి కొట్టండి... మీరు ఢిల్లీలో ఉన్న వారి సంగతి చూసుకోండి, ఈ గల్లీ గాళ్ళ సంగతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు... ఈ కుట్రలను తట్టుకుని రాష్ట్రం నిలబడాలి.... ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి... కుల గొడవలు రేపే ఎత్తులు ఇప్పటికే వేసారు... అందుకే ఒకడు, తెగ రెచ్చిపోతున్నాడు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ధర్మ పోరాట దీక్ష అంటూ, మోడీ చేస్తున్న మోసం పై, తన పుట్టిన రోజు నాడే దీక్ష చేస్తున్నా అని ప్రకటించారు... అయితే, చంద్రబాబు దీక్ష అని అనౌన్స్ చేసిన వెంటనే, జాతీయ స్థాయిలో పెద్ద చర్చ మొదలైంది... ముందుగా జాతీయ స్థాయి నేతలను కూడా, ఈ దీక్షకు ఆహ్వానిస్తున్నారని వార్తలు వచ్చాయి... దీంతో, బీజేపీ పెద్దలు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.. అందులో భాగంగా, జగన్ చేత మరో డ్రామా ఆడించి, చంద్రబాబు దీక్షని డైవర్ట్ చేసే ప్లాన్ చేసారు... దీనిలో భాగంగా, కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్, హుటాహుటిన ముఖ్య నాయకులని, కృష్ణా జిల్లాకు రమ్మని కబురు పంపించారు... మరో పక్క ప్రశాంత్ కిషోర్ చేత, సోషల్ మీడియాలో చంద్రబాబుని కించ పరుస్తూ, పోస్ట్లు పెట్టాలని ప్లాన్ చేసారు...

jagan pavan 21042018 1

జగన్ ప్లాన్ లో భాగంగా, సరిగ్గా జాతీయ స్థాయి నాయకులు వచ్చే దీక్షలో పాల్గునే టైంకి, తన ఎమ్మల్యేల చేత కూడా రాజీనామా చేపించే ప్లాన్ వేసాడు.., అయితే, చంద్రబాబు దీక్షలో జాతీయ స్థాయి నేతలు పాల్గుంటే, అది రాజకీయంగా మారుతుందని, రాష్ట్రానికి న్యాయం కోసం దీక్ష చేస్తున్నట్టు అవ్వదని భావించి, చంద్రబాబు చివరి నిమిషంలో, జాతీయ స్థాయి నేతలను ఇప్పుడు రావద్దని, మరో సందర్భంలో మీరు వచ్చి సంఘీభావం ప్రకటించ వచ్చు అని చెప్పారు... దీంతో జగన్ కూడా ప్లాన్ మార్చుకున్నాడు... చంద్రబాబు ఎప్పుడైతే, పెద్ద ఎత్తున నిరసన ప్లాన్ చేస్తారో, అప్పుడే తన ఎమ్మల్యేల చేత రాజీనామా చేపించవచ్చని నిర్ణయించారు... జగన్ ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలు కూడా, ఒప్పుకున్నారు... అందుకే, చంద్రబాబు దీక్ష డైవర్ట్ చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ కు అప్పచెప్పారు...

jagan pavan 21042018 1

పవన్ కళ్యాణ్ సరిగ్గా ఢిల్లీ పెద్దలు చేసినట్టే చేసారు... శ్రీ రెడ్డి వివాదంలో, తన తల్లి ప్రస్తావన రావటంతో, ఇదే అవకాశంగా మలుచుకున్నారు... మూడు రోజుల తరువాత, తన తల్లి తిట్టారు అంటూ బయటకు వచ్చి, శ్రీ రెడ్డి ఉదంతం, చంద్రబాబు చేపిస్తున్నారు అంటూ, ఒక కట్టు కధ అల్లారు... సరిగ్గా చంద్రబాబు దీక్ష రోజునే, అదీ తన తల్లిని తిట్టిన మూడు రోజుల తరువాత వచ్చి హంగామా చేసారు... శ్రీ రెడ్డి ఉదంతాన్ని, చంద్రబాబుకి ముడి పెట్టే ప్రయత్నం చేసి, సెన్సేషన్ చేసే ప్రయత్నం చేసారు.. దీనికి తోడూ కొంత మంది టీవీ వాళ్ళని కూడా ఈ రొచ్చులోకి లాగి, చంద్రబాబు, టీవీ9, ABN, లోకేష్, TV5, మహా టీవీ అందరూ తన మీదకి శ్రీ రెడ్డిని పంపించారు అంటూ, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసారు... మొత్తానికి ప్లాన్ ప్రకారం, చంద్రబాబు దీక్షను జగన్ డైవర్ట్ చెయ్యాల్సి ఉంటే, చివరి నిమిషంలో ఢిల్లీ పెద్దలు, పవన్ ని రంగంలోకి దించి, డ్రామాలు ఆడించే ప్రయత్నం చేసి, చంద్రబాబు దీక్షని డైల్యుట్ చేసే ప్రయత్నం చేసి, విఫలం అయ్యారు...


మొన్నా మధ్య ఎవడో ఎదో అనుకుంటున్నాడు అని, లోకేష్ పై విరుచుకుపడ్డాడు, పవన్ కళ్యాణ్... ఆధారాలు ఉంటే చెప్పండి అంటే, ఎవరో అనుకుంటున్నారు, నా దగ్గర ఆధారాలు లేవు అన్నాడు పవన్... మరి, నీ గురించి చాలా మంది, చాలా అనుకుంటున్నారు పవన్, అవన్నీ, ఒక పెద్ద మీటింగ్ పెట్టి చెప్తే, నీ మొఖం ఎక్కడ పెట్టుకుంటావ్, అని అడుగుతున్నారు ? సంస్కారవంతులు అలా చెయ్యరు... ఒక హద్దు అనేది ఉంటుంది, అక్కడ ఆగిపోతారు... నీకు ఆ హద్దూ తెలీదు, నువ్వేమి చేస్తున్నవో తెలీదు... ఈ రోజు చేస్తున్న మ్యూజిక్ అయితే సరే సరి... అసలు నీకు బుర్ర అనేది ఉందో లేదో కూడా తెలీదు... జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు జపం చేస్తున్నట్టు, నువ్వు లోకేష్ జపం చేస్తున్నట్టు ఉంది...

lokesh 20042018 1

ఎవరో నీ మీద ఆరోపణలు చేస్తే, అది లోకేష్ చేపించాడు అన్నావ్.. 10 కోట్లకి కుట్ర అన్నావ్... చానల్స్ కుట్ర అన్నావ్... పోనీ ఒక్క ప్రూఫ్ అన్నా చూపించావా ? ఒక్కటంటే ఒక్కటి ? సోషల్ మీడియాలో గాలి గళ్ళు, చేసే కామెంట్స్ లాగా, నువ్వు కూడా అలాగే పెట్టావ్... నీ గాలి మాటలకు లోకేష్ ఇచ్చిన రిప్లై చూసావా ? నీలాగా రెచ్చిపోయి ట్వీట్ పెడితే, నువ్వు ఎక్కడ ఉంటావ్ ? అది తనకు ఉన్న సంస్కారం.. ఇదిగో చూడు ఏమి చెప్పాడో, ఇది లోకేష్ ట్వీట్ "పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ." అంటూ ట్వీట్ చేసారు.

lokesh 20042018 1

ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు లోకేష్ , పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టించినట్లు ఉంటే అది ఖచ్చితంగా తప్పే , కాదనను. కానీ,, ఒకవైపు రాంగోపాల్ వర్మ నేనే చేయించా అని చెప్తూ, శ్రీరెడ్డి వైకాపా నా వెనుక ఉంది అని చెప్తుంటే మీరు ఏ ఆధారంతో లోకేష్ మీద ఆరోపణలు చేస్తున్నారు ?? ఒకవేళ ఆధారాలుంటే బయట పెట్టండి. ఈ గాలి మాటలు, గాలి ట్వీట్ లి వేసి, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు కలిగించాలని ? ఇప్పటికి నా మీద చేసిన ఆరోపణలు నిరుపించండి అని, లోకేష్ 10 సార్లు అడిగాడు, మీరు ఒక్క ఆధారం చూపించకుండా, రసీదు ఇస్తారా అని అంటున్నారు... మీ మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తే, ఫార్మ్ హౌస్ దాటి బయటకు రాలేరు.. కొంచెం హుందా రాజకీయం నేర్చుకోండి మాష్టారు..

ఆపరేషన్ గరుడ... చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తక్షణం, ఢిల్లీ పెద్దలు అములుపరిచిన ఆపరేషన్... దీని ప్రాధాన ఉద్దేశం, బ్రిటిష్ వారిలా, మన మనుషుల చేత, మనల్నే దొంగ దెబ్బ తియ్యటం... మా హక్కుగా రావాల్సింది ఎందుకు ఇవ్వరు అంటూ, చంద్రబాబు ఢిల్లీ పై యుద్ధం ప్రకటించారు.. రాష్ట్రంలో ప్రజలు అందరూ, ఆయన వెంట కదిలారు, కొందరు తప్ప... ఆ కొందరే, పైన మనం మాట్లాడుకుంది... ఢిల్లీ పెద్దల ఆపరేషన్ గరుడలో భాగం వీరు... రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలి.. కులాల గొడవలు పెట్టాలి... హింస చెలరేగాలి... రాష్ట్రంలో పెట్టుబడులు ఆగిపోవాలి, వచ్చిన పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోవాలి... ఫలితంగా, రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కావలి.. అందుకోసమే, ఢిల్లీ పెద్దలు, ఇక్కడ ఇద్దరిని నియమించారు... వీరి పని ఏంటి అంటే, చంద్రబాబు ఎప్పుడైతే కేంద్రం పై నిరసన కార్యక్రమం చేపడతారో, అప్పుడు వచ్చి డైవర్ట్ చెయ్యటం...

garuda 21042018 1

వీరి నడవిక చూస్తే, అర్ధమవుతుంది... చంద్రబాబు ఢిల్లీ పై యుద్ధం ప్రకటించిన మరు క్షణమే, ఒకడు వచ్చి, రాష్ట్రం నాశనం అయిపొయింది అంటాడు... పక్క రాష్ట్రం సూపర్ అంటాడు... జాతీయ స్థాయిలో, చంద్రబాబుకు అందరూ మద్దతు తెలుపుతుంటే, జాతీయ మీడియాకు ఎక్కి, చంద్రబాబుని బలహీన పరిచే కార్యక్రమం చేస్తాడు... మరొకడు ఉన్నాడు, కేంద్రం మీద అవిశ్వాసం అంటాడు, అదే మోడీ ఆఫీస్ లో 24 గంటలు ఉంటాడు... వీరిద్దరూ పోటీ పడి మరీ, ఆపరేషన్ గరుడలో బాగా పెర్ఫార్మన్స్ చేస్తున్నారు... అయితే, ఢిల్లీ పెద్దలు ఇచ్చిన మంత్లీ టార్గెట్ చేరుకోవటానికి, గత వారం రోజులుగా, ఒకడుకి మించి ఒకడు పెర్ఫోర్మస్ చేస్తున్నాడు... మొన్న ఒకడు, రాజధాని ప్రాంతంలో, అతి పెద్ద జనసీమీరణ చేసి, ఢిల్లీ పెద్దల కాళ్ళల్లో పడ్డాడు... ఇది చూసిన ఇంకొకోడు, ఎలాగైనా వాడికి మించి పెర్ఫార్మన్స్ ఇవ్వటానికి సిద్ధం అయ్యాడు...

garuda 21042018 1

దీనికి చంద్రబాబు పుట్టిన రోజునాడు, చేస్తున్న ధర్మ పోరాట దీక్షను ఎంచుకున్నాడు... ఈ దీక్ష జాతీయ స్థాయిలో అటెన్షన్ పొందింది... దీనిని డైవర్ట్ చేస్తే, ఢిల్లీ పెద్దలను తమ కార్యరకలాపాల సిడిలు బయటకు రాకుండా మరి కొన్ని రోజులు ఆపవచ్చు అని డిసైడ్ అయ్యాడు.. అందుకే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మొదలు పెట్టాడు... అతడి వ్యక్తిగత విషయాలు పై, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టాడు... కొంత మేరకు దీక్ష డైవర్ట్ చెయ్యటంలో సక్సెస్ అయ్యాడు... జాతీయ స్థాయిలో కాకపోయినా, రాష్ట్ర స్థాయులో చంద్రబాబు దీక్షను డైవర్ట్ చెయ్యటంలో కొంత వరకు సక్సెస్ అవ్వటంతో, ఈ నెల ఆపరేషన్ గరుడ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు, ఈ పోటుగాడికి ఇచ్చారు ఢిల్లీ పెద్దలు... బాగా అలవాటు పడ్డ ప్రాణమో ఏమో కాని, పెర్ఫార్మన్స్ బాగా చేసాడు... ఇంకొకడు పాపం ఈ సారికి వెనుకబడ్డాడు... నెక్స్ట్ మంత్ ఎలా అయినా, అవార్డు నేనే కొట్టెస్తాను అంటూ, ఈ శుక్రవారం నాయకుడు ఛాలెంజ్ చేస్తున్నాడు... ఇదండీ వరుస... రాష్ట్ర నాశనం కోసం, ఢిల్లీ పెద్దలతో కలిసి, ఎవడి పెర్ఫార్మన్స్ వాడు ఇరగ దీస్తున్నాడు..

Advertisements

Latest Articles

Most Read