వైసీపీని అధికారంలోకి తేవ‌డం కోసం, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎంని చేయ‌డం కోసం తాను శ్రీవారి స‌న్నిధిలో ప్ర‌ధాన అర్చ‌కుడిని అనే సంగ‌తీ మ‌రిచిపోయి వైసీపీ పేటీఎం బ్యాచులా దిగ‌జారి ప్ర‌వ‌ర్తించిన ర‌మ‌ణ దీక్షితులుకి జ‌గ‌న్ పాల‌న‌లో త‌త్త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. వైరాగ్యం ఆవహించిన‌ట్టుగా ట్వీట్లు వేస్తున్నాడు. గ‌ద్దెపై కూర్చోబెట్ట‌టానికి క్రైస్త‌వ మిష‌న‌రీలు న‌డిపేవాళ్ల‌తో క‌లిసి కుట్ర‌లు న‌డిపిన ర‌మ‌ణ‌దీక్షితులు ఇప్పుడు దేవుడి కోసం మొస‌లి క‌న్నీరు కారుస్తున్నాడు. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబుపై లేని పింక్ డైమండ్ ఆరోప‌ణ‌లకీ ఆల‌య అర్చ‌కుడై ఉండీ బ‌రితెగించాడు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆల‌యాల‌పై దా-డు-లు జ‌రిగినా స్పందించ‌ని ర‌మ‌ణ‌దీక్షితులు, త‌నవ‌ర‌కూ వ‌చ్చిందేమో ఇబ్బంది..ఇప్పుడు నోరిప్పుతున్నారు. అంత‌ర్వేది ర‌థం కాల్చివేస్తే మౌనం, రామ‌తీర్థంలో రాముడి త‌ల ఎత్తుకుపోతే నిశ్శ‌బ్దం, పిఠాపురంలో దేవ‌త‌ల విగ్ర‌హాలు ధ్వంస‌మైతే నో కామెంట్, దుర్గ‌మ్మ వెండి సింహాలు మాయ‌మైతే నోరిప్పితే ఒట్టు. మ‌రిప్పుడు ర‌మ‌ణ‌దీక్షితులుకి ఆగ‌మాల‌ని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, దేవాల‌యాలలో ప‌రిస్థితులు భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌లిగిస్తున్నాయ‌ని, వీఐపీ సేవ‌లో ప్ర‌భుత్వం త‌రిస్తోంద‌ని ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. ట్వీట్ చేసి రెండు మూడు గంట‌ల త‌రువాత ఆ ట్వీట్ ని ర‌మ‌ణ‌దీక్షితులు డిలీట్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read