శాతవాహన సామ్రాజ్య సింహద్వారం "కోటిలింగాల" సాక్షిగా శతచిత్ర యోధుని "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్ విడుదల. శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన జగిత్యాల జిల్లా కోటిలింగాలలో దర్శకుడు క్రిష్‌తో కలిసి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారికి దేశాన్ని, చరిత్రను అందజేసిన మహానుభావుడు శాతకర్ణి అని పేర్కొన్నారు. తారకరాముని వారసునిగా శాతకర్ణి చరిత్ర ప్రజలకు తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదే "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్

Read more: "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్ విడుదల

బాలయ్య 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్ర యాత్రను ప్రత్యేక వాహనంలో నిర్వహిస్తున్నారు బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్. ఈ నేపధ్యంలో శనివారం భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర వాహనం విజయవాడ చేరుకుంది. ఇంద్ర‌కీలాద్రి పై ఉన్న కనకదుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్ర‌కీలాద్రికి, జగన్ రాకతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

వంద పుణ్యక్షేత్రాలకు గౌత‌మీ పుత్ర శాతక‌ర్ణీ డిజైన్ల‌తో, తొమ్మిది వాహనాలను పంపి అక్కడి ఆలయాల నుంచి సేకరించిన కుంకుమతో డిసెంబరు 16న తిరుపతి వెంకన్న సమక్షంలో జరిగే ఆడియో ఫంక్షన్‌లో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు అభిమానులు తెలిపారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ తన 100 వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని సువిశాల సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి. పూర్వం వ్యక్తుల పేర్లకు ముందు తండ్రుల పేర్లే ఉండేవి. అది చాలా హీనం అని భావించాడు శాతకర్ణి. అలాంటి కరుడుగట్టిన పితృస్వామ్య రోజుల్లో కూడా తన తల్లి పేరైన గౌతమిని తన పేరుకు ముందు పెట్టుకుని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని పిలిపించుకున్నాడు. అందుకే తన పేరు గౌతమిపుత్ర శాతకర్ణిగా మారింది.

ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్-డే క్రికెట్ మ్యాచ్ లో ధోని, కోహ్లి, రహనే, వాళ్ళ తల్లి పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని కనిపించారు.. దీనికి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి సంబంధం లేదు కాని, అసల విషయం ఏమిట్ అంటే, స్టార్ నెట్వర్క్ మరియు BCCI సహకారంతో “Maa Ka Naam” అనే campaginలో భాగంగా, ఇలా తల్లి పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని కనిపించారు.

ధోని, తన తల్లి పేరు దేవకీ, కోహ్లి తన తల్లి పేరు సరోజ్, రహనే తన తల్లి పేరు సుజాతా పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని ఈ campagin కు తమ వంతు సహకారం అందించారు.. ఈ campagin ఇప్పుడు బాగా పాపులర్ అయింది.

అయితే, ఆంధ్ర రాష్ట్రంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రకటించిన దెగ్గర నుంచి, ఈ తల్లి సెంటిమెంట్ ఆల్రెడీ బాగా పాపులర్ అయింది. ఏది ఏమైనా, ఇలా తల్లికి గౌరవం ఇవ్వటం, యువత అంతా దీనికి ఆకర్షితులు అవ్వటం సుభ పరిణామం.

Page 2 of 2

Advertisements

Latest Articles

Most Read