‘రిటర్న్ గిఫ్ట్’ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కంగారొద్దని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం కవిత ఏబీఎన్‌తో మాట్లారు. కాగా ‘రిటర్న్ గిఫ్ట్’ వ్యవహారంపై కవిత మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. గిఫ్ట్ విషయంలో కంగారుపడొద్దని ఇవ్వాల్సిన టైంలో సీఎం కేసీఆర్ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారన్నారు. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమన్నారు. కేసీఆర్‌ని చంద్రబాబు చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారని.. ఆయన విమర్శలకు కేసీఆర్ త్వరలోనే స్పందిస్తారని కవిత స్పష్టం చేశారు. మాకు ఎవరితోనూ యుద్ధం లేదని తెలంగాణను దెబ్బతీసే వారితోనే మా యుద్ధమని ఎంపీ కవిత చెప్పుకొచ్చారు.

108 26112018 1

అయితే చంద్రబాబు ప్రతి సభలో కేసీఆర్ ఆంధ్రా వారి పై చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. ‘‘తప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్న వారంతా నాకు రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తారంట! వారు ఇస్తే తిరిగి మనంకూడా ఇవ్వాలికదా... అందుకే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఒకే మాట, ఒకే తాటిపైకొచ్చి తెలుగుదేశాన్ని గెలిపించి... దానిని వారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘విభజన తర్వాత సీమాంధ్రకు దక్కాల్సిన దాదాపు రూ.లక్ష కోట్లు కొట్టేసిన కేసీఆర్‌... మన రాష్ట్రానికి రూ.500 కోట్లు ఇవ్వాలనుకున్నారట! మోదీయే మట్టీ నీళ్లు ఇస్తే నేనేమిచ్చేదని ఎగతాళిగా మాట్లాడతుంటే మీకు రోషం, కోపం రావడంలేదా తమ్ముళ్లూ! సీమాంధ్రులను రాక్షసులన్న కేసీఆర్‌కు బుద్ధి చెబుతారా... లేదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో... ‘చెబుతాం’ అని జనం ముక్తకంఠంతో సమాధానం చెప్పారు.

108 26112018 1

ఈ ఎన్నికలు భావితరాల భవిష్యత్‌కు సంబంధించినవని బాబు తెలిపారు. ‘‘లక్షలమంది చెల్లెమ్మలు, తమ్ముళ్లు ఏకం కావాలి. ఓటుతో గెలిపించాలి. మన గెలుపుతో తెలంగాణ, ఢిల్లీకే కాకుండా ప్రపంచానికే సందేశం ఇద్దాం. తెలంగాణ నుంచి రావలసిన రూ.లక్ష కోట్లు ఎందుకురావో, కేంద్రం నుంచి మనకు హక్కుగా దక్కాల్సివి ఎందుకు దక్కవో నేను మళ్లీ సీఎం అయ్యాక చూస్తాను’’ అని గట్టిగా చెప్పారు. 2014లో కాంగ్రెస్‌ ఒక్కస్థానం గెలవకుండా గుణపాఠం చెప్పామని... ఇప్పుడు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read