రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఆర్ధికంగా, సామాజికంగా, విపరీత మార్పులు వస్తున్నాయి. బ్రతుకు మీద ఆశ పోతుంది. వీటి అన్నిటికీ కారణం ఇసుక కొరత. గత అయుదు నెలలుగా, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఇసుక కొరతతో, భవన నిర్మాణ కార్మికులు అల్లాడి పోతున్నారు. దాదపుగా 40 లక్షల మందికి, ఈ ఇసుక కొరత డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం ఎక్కడా స్పందించటం లేదు. మే 30న గద్దేనికిన జగన్, సెప్టెంబర్ 5 నాటికి, ఇసుక వస్తుందని, అప్పటి దాక ఇసుక బంద్ చేస్తున్నామని అన్నారు. అయితే, అప్పటి వరకు ఉన్న పాలసీని కొనసాగించాలాని కోరినా, జగన్ ఒప్పుకోలేదు. అయితే సెప్టెంబర్ 5 పోయి, నవంబర్ వస్తున్నా ఇంకా ఇసుక ఫ్రీ అవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న సమాధానం, వరదల వల్ల ఇసుక రావటం లేదని. అయితే వరదలు గట్టిగా, 3-4 జిల్లాల్లోనే ఉన్నాయి.

selfie 28102019 2

ఏది ఏమైనా ప్రభుత్వం సరిగ్గా స్పందించక పోవటంతో, భవన నిర్మాణ కార్మికుల జీవితాలు తారుమారు అయ్యాయి. ఈ అయుదు నెలలు, ఎలాగోలా, అప్పు చేసి, అది చేసి, ఇది చేసి నెట్టుకొచ్చామని, ఇక అప్పులు కూడా ఇచ్చేవారు లేరని, పస్తులు ఉంటూ, పెళ్ళాం బిడ్డలని బ్రతికించుకోలేక, తీవ్ర మనోవేదనకు గురై, బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు, మన రాష్ట్రంలో నలుగురు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే, కళ్ళ వెంట నీళ్లు రాని వారు ఉండరు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ప్లంబర్ పోలెపల్లి వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు, సేల్ఫీ వీడియో తీసి, తన కష్టాలు అన్నీ వివరించాడు.

selfie 28102019 3

పనులు లేక, కుటుంబాన్ని పోషించలేక, ఆర్దిక ఇబ్బందులలో మునిగిపోయి, చేతకాని వాడిలా చనిపోతున్నాను అంటూ, సేల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే బలవన్మరణానికి పాల్పడిన తరువాత ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సమస్య పై ముందు నుంచి పోరాటం చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించారు. ఆ కార్మికుడి సేల్ఫీ వీడియో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని నిలదీశారు. "అయిదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేక మనోవేదనతో కార్మికులు బలవన్మరణాలు చేసుకోవడం మనసును కలచివేస్తోంది. సెల్ఫీ వీడియోలతో బలవన్మరణమే తమకిక శరణ్యంగా పేర్కొనడం చూసైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి.పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా, జగన్ పై అభిమానం ఉంది అని చెబుతూనే, జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, జగన్ పాలన ఎలా ఉంది అని అడగగా, బాగుంది అని చెప్పకుండా, ఇంకా అయుదు నెలలేగా అయ్యింది అంటూ, జగన్ పాలన పై అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ఇదే సందర్భంలో, జగన్ కేసుల పై చేసిన వ్యాఖ్యలు చూస్తూ, జగన్ త్వరలోనే మళ్ళీ జైలుకు వెళ్తారు అనే విధంగా మాట్లాడారు. జగన్ కేసుల పై ఏమి జరుగుతుందొ, మీ అభిప్రాయం చెప్పండి అని ప్రశ్నించగా, జగన్ కు కష్ట కాలం ఉందని ఉండవల్లి అన్నారు. శశికళ విషయంలో ఏమి జరిగిందో, తెలుసు కదా, ఎలా ఆమె జైలుకు వెళ్లిందో చూసాం కదా అని అన్నారు.

undavalli 28102019 12

ఆమె వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా, సుప్రీం కోర్ట్ కేసును ముందు పెట్టి, అప్పటికప్పుడు ఆమెను జైల్లో పెట్టారని, ఇది మోడీ, అమిత్ షా చెయ్యగలిగేది అని అన్నారు. మోడీ, అమిత్ షా తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని, వారు ఈ దేశం కోసమే మేము పుట్టాం అని అనుకుంటూ ఉంటారని అన్నారు. జగన్ కేసుల విషయంలో, మొన్న మినహాయింపు కోరుతూ, జగన్ వేసిన పిటీషన్ పై, సిబిఐ వేసిన అఫిడవిట్ చూస్తూనే, ఏమి జరుగుతుందో అర్ధం అవుతుందని అన్నారు. ఆ అఫిడవిట్ లో, సిబిఐ వాడిన భాష చూస్తూనే, విషయం తెలిసిపోతుందని, జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అనే చెప్పిన మాట, చాలా పవర్ఫుల్ అని, ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయని అన్నారు. ఆ అఫిడవిట్ చదివితే, సిబిఐ, అమిత్ షా కంట్రోల్ లో ఉన్న సంస్థని తెలిసిపోయిందని అన్నారు.

undavalli 28102019 3

ఇక అదే విధంగా, తెలుగుదేశం పార్టీ పై చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. 151 సీట్లు జగన్ కు వచ్చినా, వైసీపీ పార్టీ అనేది లేదనే నేను అనుకుంటా అని అన్నారు. ఆ గెలుపు కేవలం జగన్, వైఎస్ఆర్ ఇమేజ్ వల్ల వచ్చిందని, పార్టీ వల్ల కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి, బలమైన క్యాడర్ ఉందని, పార్టీ పరంగా, టిడిపి ఎప్పటికీ బలంగానే ఉంటుందని, 23 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు వచ్చిన విషయం మర్చిపో కూడదు అని అన్నారు. 2004లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, కాని అనూహ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపో కూడదు అని అన్నారు. నాకు తెలిసి, వైసీపీ ఇంకా గ్రామస్థాయిలో బలపడలేదని ఉండవల్లి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయని, అన్నారు. జగన్ గెలవడం తనకు వ్యక్తిగతంగా ఆనందమే అని, కాని అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ, స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఉండవల్లి జగన్ పై అభిమానంతో, డైరెక్ట్ గా చెప్పటం లేదని, గ్రౌండ్ లెవెల్ లో జగన్ కు వ్యతిరేకత ఎంతలా ఉందొ, ఉండవల్లి మాటలను బట్టి అర్ధం అవుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్, టిడిపి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, చంద్రబాబుకి వాట్స్అప్ ద్వారా లేఖ పంపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లేఖలో, వైసిపీ వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోతున్నా అని, రాజకీయాలకి కూడా దూరంగా ఉంటానని వంశీ ఆ లేఖలో చెప్పారు. అయితే, వంశీ రాసిన ఆ లేఖ పై చంద్రబాబు స్పందించారు. తిరిగి వంశీకి, చంద్రబాబు వాట్స్అప్ ద్వారా రిప్లై ఇచ్చారు. వాట్స్అప్ ద్వారా మీరు పంపించ లేఖ నాకు అందింది. అలాగే మీరు నాకు పర్సనల్ గా కలిసి చెప్పిన విషయాలు కూడా విన్నాను. మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు వేధింపులు తగ్గవు. వీటిని ధీటుగా ఎదుర్కోవాలి. ప్రజలకు జరుగుతున్న విషయాలు చెప్పి పోరాడాలి. ఈ పోరాటంలో ‘నా వ్యక్తిగతంగా.. పార్టీ తరపున మేము మీకు అండగా నిలబడతా’మని భరోసా ఇచ్చారు. ఈ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొంటామని చంద్రబాబు చెప్పారు.‌ ఇది చంద్రబాబు రాసిన లేఖ...

cbn 27102019 2

"To V. Vamsi Mohan, MLA, Gannavaram Constituency, Gannavaram, Dear Vamsi, Sub.:Harassment by YSRCP leaders and certain Govt. Officials - Resignation as MLA - Fight back in the interest of Public - Reg., I have received your letter sent through whatsapp and read the content. You have also personally brought to my notice about the entire issue. You have effieciently served as Telugu Desam Party (TDP) leader and as legislative member of Gannavaram Constituency. You have mentioned in your letter that local Constituency YSRCP incharge coupled with some Government officials are harassing you and the party cadre. The said case in question is cooked up with maligned intentions. It is the entitlement of the eligible poor people to get regularisation of their house site. Accordingly, our Government has acted in favour of the poor, weak and vulnerable sections. Such cases will be fought by the party to its logical conclusion. In this regard, let me reaffirm that you quitting politics will not stop the harassment and vindictive political actions unleashed by the YSRCP and their stooges in the Government. I think resigning or quitting politics is not correct solution.

cbn 27102019 3

It is our responsibility to fight against such unconstitutional and undemocratic methods of the present Government by bringing awareness among the public. Therefore, in the interest of the future generation, safeguarding and upholding the democratic values, we have to fight the injustice of the present Government. Let me assure you, both on my personal behalf and on behalf of the Party, that we stand by you whole heartedly and unconditionally in this fight against high handedness of the present Government. We shall give representations to all the constitutional authorities in this regard and seek justice. We shall fight utilizing all democratic means available as per the Constitution. Always remember that whenever injustice is meted out, we have to fight instead of giving up. Also party leaders across the state are being harassed by the present government through various means. We shall fight this harassment unitedly and in the same manner fight injustice against you and cadre. With warm regards.(N. Chandrababu Naidu)

 

వంశీ రాజీనామా విషయం ఇంకా సాగుతూనే ఉంది. నిన్న వంశీ వాట్స్అప్ లో, చంద్రబాబుకి రాజీనామా చేస్తున్న విషయాన్ని పంపించారు. అయితే, చంద్రబాబు దానికి రియాక్ట్ అవ్వరులే అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు వంశీ రాసిన వాట్స్అప్ కి, మళ్ళీ తిరిగి మెసేజ్ చేసి, ఇలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని, కలిసి పోరాడదాం రండి అంటూ, బాల్ ని మళ్ళీ వంశీ కోర్ట్ లోకి నెట్టారు. దీని పై స్పందించిన వంశీ, ఇది వరకు దేవినేని నెహ్రు తో ఉన్న గొడవలు కాని, తరువాత ఐపీఎస్ సీతారామాంజనేయులుతో ఉన్న గొడవలు కాని ప్రస్తావిస్తూ, వాటిని ఎదుర్కున్నానని, ఇప్పుడు పరిస్థితి వేరని, కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్నా అంటూ, మళ్ళీ చంద్రబాబుకి రిప్లై ఇచ్చారు. అయితే, దానికి కూడా చంద్రబాబు మళ్ళీ స్పందిస్తూ, తిరిగి వంశీకి మరో వాట్స్అప్ మెసేజ చేసారు. చంద్రబాబు మళ్ళీ ఈసారి కూడా, వంశీ కోర్ట్ లోనే బాల్ వేసి, వంశీని రియాక్ట్ అయ్యేలా చేసారు.

vammsi 28102019 2

మీరు చేసిన పోరాటాలు గుర్తు ఉన్నాయి. అప్పుడు పార్టీ కూడా మీకు అండగా నిలబడింది. ఇప్పుడు కూడా మీకు నిలబడుతుంది. మీకు మేము మద్దతుగా ఉంటాం. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చించండి. వారిని మీ వద్దకు పంపుతున్నాం. ప్రభుత్వ దుందుడుకు వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం. అంటూ చంద్రబాబు మళ్ళీ వంశీకి వాట్స్అప్ మెసేజ్ చేసారు. అయితే, ఇప్పుడు వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి నెలకొంది. వంశీ, ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే, వంశీ గన్నవరంలో అందుబాటులో లేరని, వంశీ హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తుంది.

vammsi 28102019 3

ఇది చంద్రబాబు రాసిన రెండో రిప్లై... "Dear Vamsi, Received your second whatsapp message and noted all the contents. You have recollected your historical affinity with the party. It is true. You have earlier fought fiercely against injustice with extension of support from the party and myself. In the same manner party and myself are solidly behind you in this current fight against injustice of present YSRCP Government. In this regard I am entrusting Sri Kesineni Nani, MP and Sri Konakalla Narayana Rao, Ex-MP to coordinate with you and chalk out an action plan for a united against the high handedness of the present Government. I am assure you to sort out all other problems. With warm regards... N. Chandrababu Naidu"

Advertisements

Latest Articles

Most Read