జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, ప్రధాని మోడీకి కంప్లైంట్ లు వెళ్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రిందట, విద్యుత్ ఒప్పందాల విషయంలో, జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి అని, ఇలా అయితే, జపాన్ నుంచి ఎవరూ మీ దేశంలో పెట్టుబడులు పెట్టరు అంటూ జపాన్ ప్రభుత్వం నుంచి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే విద్యుత్ ఒప్పందాల విషయంలో, అనేక ప్రముఖ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసాయి. ఇప్పుడు తాజాగా "ది అసోసియేషన్ అఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ", జగన్ మోహన్ రెడ్డి పై, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. వైజాగ్ మెడ్ టెక్ జోన్ విషయంలో జరిగిన విషయం ప్రస్తావిస్తూ, ఇలా అయితే మీరు తీసుకున్న మేక్ ఇన్ ఇండియా స్పూర్తి దెబ్బ తింటుంది అని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీవ్ నాథ్ ఆధ్వర్యంలో మోడీని కలిసి ఫిర్యాదు చేసారు.

medtech 21092019 2

చంద్రబాబు హయంలో, విశాఖను మెడికల్‌ హబ్‌గా తీర్చి దిద్దాలి అనే లక్ష్యంతో, దేశంలోనే మొదటి మెడ్‌టెక్ జోన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేసారు. దీనికి కేంద్ర సహకారం కూడా ఇచ్చింది. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చిన్న సూది నుంచి పెద్ద వైద్య పరికరాలు దాకా ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 80 పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తి మొదలు పెట్టాయి. వైద్య పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, ఈ మెడ్ టెక్ జోన్ ఉపగాయోగ పడనుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, ఇది మెడ్ టెక్ జోన్ కాదు, ఇది ఒక మయసభ అంటూ, దీని పై విచారణకు ఆదేశించారు. అంతే కాదు, ఈ మెడ్ టెక్ జోన్ కు అన్నీ తానై నడిపించిన, మ్యానేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మను, జగన్ ప్రభుత్వం తొలగించింది.

medtech 21092019 3

అయితే, ఈ నిర్ణయంతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే, డాక్టర్ జితేందర్ శర్మకు మరెక్ట్ లో మంచి పేరు ఉంది. డాక్టర్ జితేందర్ శర్మను ఐక్యరాజ్యసమితితో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఇచ్చింది. అయితే కేవలం చంద్రబాబు పెట్టారు, ఈయన సహకరించారు అనే కక్షతో, డాక్టర్ జితేందర్ శర్మని జగన్ ప్రభుత్వం తప్పించింది అని, మెడ్ టెక్ జోన్ ఏర్పాటులో, అయన సేవలు ఎనలేనివి అని, వెంటనే దీని పై ఆక్షన్ తీసుకోకపోతే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రధానికి ఫిర్యాదు చేసారు. నిజానికి మెడ్ టెక్ జోన్ అద్భుతంగా పని చేస్తుందని, నెల క్రిందట గడ్కరీ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం, ఈ మెడ్ టెక్ జోన్ ను మయసభ అంటూ, చంద్రబాబుకి అవినీతిని అంటగట్టె ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో, 50 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా 13 మృతదేహాల దాక ఇంకా వెతకాల్సి ఉంది. అయితే బోటు ఎక్కడో 300 అడుగుల దూరంలో ఉందని, అది బయటకు తియ్యటం కష్టం అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే బోటును గోదావరి నదిలో గుర్తించిన వెంకటశివ మాత్రం ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే మేము బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు ఒకటి , రోప్ ఇస్తే 2 గంటల్లో బోటు తీస్తానని ప్రభుత్వానికి చెప్పానన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనకు ముందుకు రాలేదని, మేము బోటుని గుర్తించాం, బయటకు తీస్తాం, రెండు గంటలు చాలు అని చెప్పినా, ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదని అన్నారు. అయితే, బోటు బయటకు తీయడం అధికారులకు, ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్ధమవుతుందని అన్నారు.

boat 20092019 1

పర్యాటక అధికారులు, బోటు యజమానులు అక్కడ జరుగుతున్నవి కాకుండా, వేరేవి చెప్పి, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోటును గుర్తించడానికి, ఎక్కడో ఉత్తరాఖండ్‌ నుంచి నిపుణులు అవసరం మనకు లేదని కొట్టిపారేశారు. ఆ బృందం తీసుకొచ్చిన కెమెరాలు గోదావరి నదిలో సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్‌పర్ట్‌ అని, ఆయన్ను అధికారులు సంప్రదించటంతో ఆయన వచ్చి బోటుని బయటకు తీసే విషయం పై అంచనాకు వచ్చారని చెప్తున్నారు. అయితే వెంకటశివ ప్రతిపాదనను ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది ? వెంటక శివ ఆరోపణలు నిజామా కాదా అనేది, ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు.

boat 20092019 1

మరో పక్క రెండు రోజుల నుంచి, బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి అవంతి శ్రీనివాస్‌ ని టార్గెట్ చేస్తూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదన్నారు. అలాగే బోటులో 73 మంది కాదని, 93 మంది ఉన్నారని, బోటు బయటకు తీస్తే, ఎక్కువ మంది మృతదేహాలు ఉంటాయనే, ప్రభుత్వం బోటుని బయటకు తియ్యటం లేదని అన్నారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బోటు జాడ సోమవారమే తెలిసిందని హర్ష కుమార్ ఆరోపించారు. అయితే ఇప్పుడు హర్ష కుమార్ మాటలకు బలం చేకూరుస్తూ, వెంకట శివ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని, అది తట్టుకోలేక ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను రాష్ట్రమంతా ఆపేసారని, దీనిని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై ఈ రోజు కోర్టు స్పందించింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్రాయ్‌, మాస్టర్‌ ఛానల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీ డిజిటల్‌ నెటవర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు మరికొంత మందికి నోటీసులు జారీ చేసింది. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను ఎందుకు నిలిపివేసారో చెప్పాలని చెప్తూ, వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కె.వెంకటేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున లాయర్ అంబటి సుధాకర్‌రావు వాదనలు విపించారు. ట్రాయ్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు, తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది.

highcourt 20092019 2

గత పది రోజులుగా రాష్ట్రంలో, ఏబీఎన్ తో పాటు టీవీ5 ప్రసారాలు ఆపేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కధనాలు ఇస్తున్నారని, అందుకే ఆపేయాలని, కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు బెదిరించారు అంటూ, కధనాలు కూడా వచ్చాయి. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు, ఇది చట్టానికి వ్యతిరేకం అని, ఫ్రీ ఛానెల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా పై ఉందని, ఇలా చెయ్యటం కుదరదు అని చెప్పిన సమయంలో, మంత్రులు మరింతగా బెదిరించి, మీరు మేము చెప్పినట్టు చెయ్యకపోతే, మీ ఏరియాలో ఇక నుంచి మీ కేబుల్ ప్రసారాల బదులు, ప్రభుత్వానికి చెందిన ఏపి ఫైబర్ నెట్ అందరి ఇళ్ళకు వస్తుందని, మేము చెప్పినట్టు వినాల్సిందే అని బెదిరించినట్టు కధనాలు వచ్చాయి.

highcourt 20092019 3

అయితే మరో పక్క ఏపి ఫైబర్ నెట్ లో కూడా, ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు ఆపేశారు. ముఖ్యంగా ప్రభుత్వంలోని లోటు పాట్లను ఈ ఛానెల్స్ ప్రసారం చేస్తూ ఉండటం, అవి ప్రజల్లోకి వెళ్తే, తమ బలహీనతలు అన్నీ బయట పడతాయి అని చెప్పి, ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ పెద్దలు ఆధ్వర్యంలో నడుస్తున్న సొంత టీవీ ఛానెల్ మాత్రం, ఎప్పటిలాగే తప్పుడు కధనాలతో ప్రతిపక్షాల పై విరుచుకు పడుతుంది. అలంటి తప్పుడు వార్తలు, సమాజంలో విషం చిమ్మే ఛానెల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు ఇలా ప్రభుత్వ పని తీరును ప్రశ్నించినందుకు, ఛానెల్స్ ను బ్యాన్ చెయ్యటం పై, ప్రజలు కూడా మండి పడుతున్నారు. వైఎస్ఆర్ లా ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి, ఇలా పిరికి తనంతో బ్యాన్ చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

ప్రతి శుక్రవారం తాను కోర్ట్ కు రావటం కుదరదు అని, నేను ఇప్పుడు సియంని అని, చాలా బాధ్యతలు ఉంటాయని, అందుకే తనకు ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రిందట సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. జగన్ వేసిన పిటీషన్ పై ఈ రోజు సిబిఐ కోర్ట్ విచారణ జరిపింది. అసలు ముందు ఈ పిటీషన్ పై విచారణ అర్హత ఉందొ లేదో చూడాలి అంటూ, సిబిఐ కోర్ట్ విచారణ ప్రారంభించింది. ఈ నేపధ్యంలో సిబిఐ కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఇది వరకే, ప్రతి శుక్రవారం కోర్ట్ కి రాకుండా మినహాయింపు ఇవ్వమని కోరారు, కాని మీకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం కుదరదు అని గతంలో హైకోర్టు చెప్పింది కదా. మీరు వ్యక్తిగత మినహాయింపు కోసం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది కదా అని ఈ రోజు సిబిఐ కోర్ట్ ప్రశ్నించింది.

cbi 20092019 2

ఒకసారి హైకోర్ట్ కొట్టేసిన విషయంతో, మళ్ళీ మీరు సిబిఐ కోర్ట్ ను ఆశ్రయించారు, ఇదే పిటిషన్ ను గతంలో హైకోర్టు కొట్టివేసినందున మళ్లీ ఎలా విచారణ చేపడతాం అంటూ సీబీఐ న్యాయస్థానం, జగన్ తరుపు లాయర్లను ప్రశ్నించింది. దీని పై స్పందించిన జగన్ తరుపు లాయర్లు, ఇప్పుడు తమ పరిస్థితులు మారిందని, అందుకే ఇప్పుడు తమ పిటిషన్ ను విచారణకు స్వీకరించి, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. జగన్ తరుపు న్యాయవాడులు విజ్ఞప్తి మేరకు ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్టు సిబిఐ న్యాయస్థానం పెర్కుంది. దీంతో జగన్ తరుపు న్యాయవాదులు ఊపిరి పీల్చుకున్నారు. దీని పై త్వరలోనే వాదనలు జరగనున్నాయి.

cbi 20092019 3

అయితే ఈ పిటీషన్ పై సిబిఐ కోర్ట్ ఎలా తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది. జగన్ మొహన్ రెడ్డి చెప్పిన కారణం, తాను ముఖ్యమంత్రి అని, తనకు ఎన్నో పనులు ఉంటాయని, అలాగే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు అని, తాను హైదరాబాద్ వస్తే, తనతో పాటు, పోలీసులు అంతా రావాల్సి ఉంటుందని, భద్రత చూసుకోవాలని, ఇవన్నీ రాష్ట్ర ఆదాయం పై ఎంతో ప్రభావం చూపుతాయని పిటీషన్ లో పెర్కున్నారు. అయితే కొంత మంది న్యాయ నిపుణులు చెప్తుంది మాత్రం, ఇందుకు భిన్నంగా ఉంది. సహజంగా చట్టం ముందు ఎవరైనా సమానమే అని, సియంకు ప్రత్యెక హోదాలు న్యాయస్థానం ముందు ఉండవని అంటున్నారు. అలాగే, సొంత ఖర్చులు పెట్టుకుని రావచ్చు కదా అని కోర్ట్ అంటే, అప్పుడు జగన్ ఏమి సమాధానం చెప్తారని న్యాయ నిపుణులు అడుగుతున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.

Advertisements

Latest Articles

Most Read