బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరు వెయ్యటానికి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, మొన్నటి ఎన్నికల్లో ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబుని దించి, జగన్ ను ఎక్కించటంలో సక్సెస్ అయ్యారు. డైరెక్ట్ గా కాకుండా, రహస్య మిత్రులుగా బీజేపీ, వైసిపీ వ్యవహరించాయి. చంద్రబాబు నుంచి అధికారం లాక్కోవటం కష్టం కాబట్టి, జగన్ నుంచి అధికారం లాక్కోవటం చాలా తేలికగా బీజేపీ భావిస్తుంది. అందుకే పోయిన ఎన్నికల్లో ఆ వ్యూహాన్ని అమలు చేసారు. అయితే ఇప్పుడు జగన అధికారంలోకి వచ్చిన వెంటనే, బీజేపీ హిందుత్వ గేమ్ ఆడటం మొదలు పెట్టింది. తిరుమల విషయంలో, శ్రీశైలం విషయంలో, అలాగే జగన్ ను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, చాప కింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తూ వస్తుంది. జగన్ ను ఇలా దెబ్బ తీస్తూనే, అటు టిడిపిని కూడా టార్గెట్ చేసింది.

bjp 31082019 2

టిడిపి ఇంత ఘోరంగా ఓటమి చెందినా, జగన్ చేసే తప్పులతో, మళ్ళీ ప్రజలు చంద్రబాబు వైపు చూస్తారు కాబట్టి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా, టిడిపి నేతలను తమ వైపు తిప్పుకునే ప్లాన్ వేసింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులను తమ వైపు తిప్పుకుంది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వస్తున్నారు అంటూ ప్రచారం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, తెలంగాణాలో సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో బీజేపీ నేతల రహస్య సమావేశం జరుగుతోంది. అయితే ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, తెలంగాణాలో ఏర్పాటు చెయ్యటం పై, సర్వత్రా చర్చ జరుగుతుంది. తెలంగాణాలో అయితే, ఏపి ఇంటలిజెన్స్ బాధ ఉండదు అని ఏమో కాని, అక్కడ సమావేశం అయ్యారు.

bjp 31082019 3

ఈ సమావేశానికి ఏపీ బీజేపీ నేతలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సత్యమూర్తి హాజరయ్యారు. కాసేపట్లో సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని మరింత బల పరిచేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణాకు చెందిన టీడీపీ అగ్రశేణి నాయకులు బీజేపీలో చేరారు. నేతల చేరికతో ఏపీలో ఆ పార్టీ ఉత్సహంగా ఉంది. అయితే ఏపీ నేతలు తెలంగాణలో రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే వీరి సమావేశానికి కేంద్ర మంత్రిగా ఉంటున్న కిషన్‌రెడ్డి హాజరుకావడం గమనార్హం. ఈ సమావేశం జగన్ ను టార్గెట్ చేసుకుని అయి ఉంటుందని, అందుకే సేఫ్ గా తెలంగాణాలో పెట్టుకున్నారని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పై కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని రిపోర్ట్ ఇవ్వమని కోరింది. పోలవరం కాంట్రాక్టులను రద్దు చేయడం, రీటెండర్లను ఆహ్వానించడం పై, పోలవరం ప్రాజెక్ట్ కు తలీత్తే ఇబ్బందుల పై, పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18 పేజీల రిపోర్ట్ ని, కేంద్రానికి ఇచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ లో లేవనెత్తిన అంశాల పై, మీ వివరణ ఇవ్వండి అంటూ కేంద్రం, జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌ కుమార్‌ శ్రీవాస్తవ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన 18 పేజీల నివేదికతో పాటుగా, రాష్ట్రం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను కూడా దీంతో కలిపి పంపించారు.

ppa 31082019 2

అయితే పోలవరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వ విధానాన్ని, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ వివరణ ఇచ్చారు. గత సోమవారం ఢిల్లీలో స్వయంగా జగన్ వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసి వివరించినా సరే, ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరడం గమనార్హం. పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు పెరగకుండా చూస్తామని, అలాగే ఆలస్యం అవ్వకుండా చూస్తామని, కొత్త టెండర్లకు అనుమతి ఇవ్వాలని జగన్‌ ఇచ్చిన వివరణ పై కేంద్రం సంతృప్తి చెందలేదని ఈ లేఖలు చూస్తే తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ పై రాష్ట్రప్రభుత్వం రిటెన్ గా జవాబు ఇవ్వాలని అధికార వర్గాలు చెప్తున్నాయి. వచ్చే రెండు రోజులు, వినాయక చవితి సెలవులు ఉన్నాయి కాబట్టి, సెప్టెంబరు 3, 4 తేదీల్లో జవాబు పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ చెబుతోంది.

ppa 31082019 3

మరో వైపు, ఈ నెల 23న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్ట్ 18 పేజీల రిపోర్ట్ పంపినా, మరింత సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జల శక్తి శాఖ తాజాగా ఆదేశించింది. ఇక మరో పక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అటు కోర్ట్ ని కాని, ఇటు కేంద్రం మాట కాని లెక్క చెయ్యకుండా,రీటెండరింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే హైకోర్ట్ రీటెండరింగ్ కు వెళ్ళద్దు అని చెప్పింది. దీని పై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళింది. ఈ నేపధ్యంలో అప్పీల్ కు వెళ్ళాం కాబట్టి, రీటెండరింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేసామని, కోర్ట్ ఆదేశాలను బట్టి చూస్తాం అని ప్రభుత్వం అంటుంది. మరో పక్క, కోర్ట్ వద్దు అని చెప్తున్నా, ఇలా ముందుకు వెళ్ళటం తప్పు అని కొంత మంది న్యాయవాదాలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేసారు. మొన్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, విజయవాడలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూల మాల కూడా వెయ్యకుండా, ఉన్న ఫోటో ప్రధాన పత్రికల్లో వచ్చింది. ఆ వార్తా కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో, తెలుగు భాషా దినోత్సవం కోసం, ప్రభుత్వం విడుదల చేసిన 18 లక్షల జీవో కాపీని కూడా జోడించారు. 18 లక్షలు తెలుగు భాషా దినోత్సవం కోసం అని విడుదల చేసి, రాజధానిలో ముఖ్య ప్రాంతం అయిన విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూల మాల కూడా వెయ్యకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఈ డబ్బులు ఏమి అయ్యాయి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

cbn 31082019 2

అంతే కాదు, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అనే పాట ఏ అధికారిక కార్యక్రమంలో కూడా వినిపించటం లేదని చంద్రబాబు అన్నారు.. ఇది చంద్రబాబు ట్వీట్.. "తెలుగు భాషా దినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 లక్షలతో ఏం చేసినట్టు? "మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు.." అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్ర గీతం... ఈ మూడు నెలల్లో ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా? ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యం?" అంటూ ట్వీట్ చేసారు.

cbn 31082019 3

ఇక నిన్న జరిగిన ఇసుక ధర్నాల పై కూడా చంద్రబాబు ట్వీట్ చేసారు. "తెదేపా హయాంలో ఉచిత ఇసుక యూనిట్ ధర రూ.1200లుగా ఉంటే, వైకాపా రివర్స్ టెండరింగ్ మాయాజాలంతో యూనిట్ ధరను రూ.10,000లు చేసి, వైకాపా నాయకులు ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని నిరూపించుకున్నారు. వాళ్ళ ధన దాహంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసారు. సిమెంట్ బస్తాకు 10 రూపాయిలు J-ట్యాక్స్ కట్టే వరకూ ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలి. తుగ్లక్ పాలనతో రోడ్డున పడిన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ. 60 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉద్యమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను అభినందిస్తున్నాను. కార్మికులకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ వారి తరపున పోరాడుతుంది." అని ట్వీట్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు నెలల నుంచి, అటు జీతాలు కానీ, ఇటు పెన్షన్లు కానీ లేట్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి వైఎస్ఆర్ పుట్టిన రోజు అని చెప్పి, 8వ తేదీ దాకా పెన్షన్లు ఇవ్వలేదు. అయితే కేవలం పెన్షన్లు మీద బ్రతికే ముసలి వారు మాత్రం, ఫస్ట్ తారీఖు పెన్షన్లు వస్తాయని ఆశతో, ఎన్నో ఖర్చులు ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ఇక మొన్నటి నెల కూడా దాదపుగా 10 వ తేదీ దాటిన తరువాత కూడా పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఇక పోయిన నెలలో, ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖున పడలేదు. రెండు రోజులు ఆలస్యంగా పడ్డాయి. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, అందుకే పడలేదని ప్రచారం జరగగా, వెంటనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సాఫ్ట్ వేర్ లో సమస్య ఉందని, అందుకే ఇలా అయ్యిందని, అంతే తప్ప ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదని క్లారిటీ ఇచ్చింది.

jagan 31082019 2

పోయిన నెల జీతాలు రెండు రోజులు ఆలస్యంగా పడ్డాయి. అయితే ఈ నెల జీతాలు కూడా మూడో తారిఖు తరువాతే పడననున్నాయి. జీతాలు మాత్రమే కాదు, పెన్షన్లు కూడా మూడో తారీఖు తరువాతే పడనున్నాయి. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఓక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ఒకటో తేదీనే రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. అయితే, ఈ సారి ఒకటో తేదీ ఆదివారం కావటంతో , రెండో తేదీ అయిన సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో, మూడో తారీఖున జీతాలు, పెన్షన్లు వెయ్యనున్నారు. దీంతో మూడో తేదీన జీతాలు బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గతంలో చంద్రబాబు ఉండగా, ఇలా సెలవులు ఉంటే, ముందే జీతం వేసేవారు.

jagan 31082019 3

ముఖ్యంగా పండుగ ఉన్న టైంలో, ఉదోగ్యులు దగ్గర, పెన్షన్ తీసుకునే వారి దగ్గర డబ్బులు ఉంటే, పండుగ బాగా జరుపుకుంటారని, ముందుగానే జీతాలు వేసే వారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వినాయక చవితి పండుగకు, డబ్బులు లేకుండా ఉద్యోగులు, అటు పెన్షన్ లు తీసుకునే వారు ఉన్నారు. ఉసూరు మంటూ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందా అని చూస్తున్నారు. చంద్రబాబు ఉన్న సమయంలో 2017 నాటి సంఘటనను ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. 2017లో నెలాఖరులో దసరా పండగ రావడం, 28 నుంచి అక్టోబర్ 2 తేది వరకూ బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో అప్పటి ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read