రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు, అసలు అమరావతి ఉంటుందా ఉండదా అనే సందేహాల నేపధ్యంలో, ఇప్పుడు అమరావతిలో నిర్మించ తలపెట్టిన, తిరుమల తిరుపతి దేవస్థానం పై కొత్తగా ఎన్నికైన పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ బాబాయ్ వైవి సుబ్బా రెడ్డి, టిటిడి చైర్మెన్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయంలో, అమరావతిలో నిర్మించ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం ఆలయాన్ని పెద్ద ఆలయంగా కాకుండా, చిన్నదిగా నిర్మించే అంశాన్ని ఈ కొత్త పాలకమండలి పరిశీలిస్తుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు, తిరుమల తిరుపతు దేవస్థానం నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యత మొత్తాన్ని టిటిడినే తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగానే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూకర్షణ క్రతువు పూర్తిచేసారు.

ttd 30082019 2

చంద్రబాబు హయంలోనే పనులు కూడా ప్రారంభం అయ్యాయి. రూ.150 కోట్ల ఖర్చుతో శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించటానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆలయాలతో పాటుగా, నైవేద్యం తయారీకి వంటశాల, ఉత్సవ మండపం, రథ మండపం, ప్రసాద మండపాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా, స్వామివారి పుష్కరిణి, వసతి సముదాయాలు, అన్నప్రసాదం కాంప్లెక్స్‌, ఆధ్యాత్మిక గ్రంథాలయం, కార్యాలయ భవనాలు, సిబ్బందికి అవసరమైన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించి రూ.10 కోట్ల విలువైన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. తిరుమలలో గుడి ఎలా ఉంటుందో, అలాగే నిర్మించాలని, అనుకున్నారు.

ttd 30082019 3

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, వారి ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ఈ నిర్మాణానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. పూర్తిగా టిటిడి ఖర్చుతో నిర్మాణం జరుగుతుంది. అయినా సరే, ప్రభుత్వం, ఈ ఆలయం విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు, తిరుమలలో శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వరకు తొలుత అంతర్గత ప్రాకారం మాత్రమే నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తేసుకున్నారు. మిగిలిన నిర్మాణాలపై తదుపరి పాలక మండలి సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీవారి ఆలయం ముందు అనుకున్నట్టే కట్టాలని, దేవుడి విషయంలో కూడా ఇలా నిర్ణయాలు మార్చుకోవటం సరి కాదని, శ్రీవారి భక్తులు అంటున్నారు. అనవసరమైన వాటికి వేల వేల కోట్లు ఖర్చు పెడుతూ, రాష్ట్రాన్ని చల్లగా చూసే శ్రీవారికి కంచెం పెద్దదిగా గుడి కడితే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఇసుక కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. కొంత మంది నేతలను అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. కేవలం ప్రజల తరుపున ధర్నా చేయ్యనివ్వటానికి కూడా ప్రభుత్వం ఓర్చుకోలేక పోతుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చిన్న ధర్నాలకే అరెస్ట్ చేస్తే, రేపు పెద్ద పెద్ద ఆందోళనలు చేస్తే, కాల్పులకు కూడా ఈ ప్రభుత్వం వెనుకాడేలా లేదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. టిడిపి చేస్తున్న ఆందోళనలో భవన నిర్మాణ కూలీలు, ఇతర పనులు చేసే వాళ్ళు కలిసి పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఇసుక లేకపోవటం వల్ల ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా, జగన్ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేతలు విమర్శించారు.

sand 30082019 2

మరో పక్క, మాజీ మంత్రి దేవినేని ఉమా, గొల్లపూడిలోని ఆయన నివాసం నుంచి, ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు దేవినేని ఉమాని పోలీసులు అడ్డుకుని హౌస్‌ అరెస్టు చేశారు. ఈ ప్రదేశంలో ధర్నాలకు అనుమతి లేదని అందుకే హౌస్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఉమాకి నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసి, పేద ప్రజల తరుపున పోరాడి వస్తాం అన్నా కూడా, హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని, పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్‌ ఇలాంటి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఉమా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది టీడీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారని, మేము ఏమి మీ పై దాడికి రావటం లేదని, కూలీల తరుపున పోరాడటానికి వస్తుంటే, మీకు అంత అసహనం అయితే ఎలా అని ప్రశ్నించారు.

sand 30082019 3

ఇక పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే ఆయనను హౌస్ అరెస్ట్ అని చెప్పి, అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చించినాడ మీదుగా తూర్పుగోదావరి తరలించారు. దీంతో కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యే నిమ్మల స్వచ్ఛందంగా తాను వస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని గృహ నిర్బంధం చేశారు. అలాగే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్టు చేశారు. ఇలా అన్ని చోట్లా, తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై రగడ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు జగన్ మొహన్ రెడ్డి సమీక్ష జరిపినా, క్లారిటీ వస్తుంది అనుకున్న వారికి నిరాశే మిగిలింది. జగన్ సమీక్ష తరువాత, బొత్సా మీడియాతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. అలాగే సుజనా చౌదరి వందల ఎకరాలు భూమిని కొట్టేసారని, బ్యాంకులను మోసం చేసి ఎదిగారని, రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా లాభం పొందారని బొత్స అన్నారు. మరో పక్క విజయసాయిరెడ్డి కూడా, సుజనాని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. బొత్సా, విజయసాయి రెడ్డి హద్దు మీరి ఆరోపణలు చేస్తున్నారని, సుజనా ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో, మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. బొత్సా, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. బొత్సా చెప్పినట్టు, తమకు 2013 తరువాత, ఒక్క సెంట్ భూమి కూడా రాజధాని ఏరియాలో లేదని అన్నారు.

sujana 29082019 2

2013 తరువాత, కృష్ణా, గుంటూరు జిల్లాలో, తాను కాని, తమ కుటుంబం కానీ, సెంట్ భూమి కూడా ఇక్కడ కొనలేదని అన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసి, ఉన్న సమస్యల నుంచి, ప్రజలను డైవర్ట్ చెయ్యకుండా, మంచి పరిపాలన అందించాలని సుజనా అన్నారు. ఒక వేళ నేను కనుక ఇన్సైడర్ ట్రేడింగ్ చేసాననే ఆధారాలు మీ దగ్గర ఉంటే, కేసులు పెట్టుకుని, తనని అరెస్ట్ చెయ్యండి అంటూ సుజనా, బొత్సాకి ఛాలెంజ్ చేసారు. అలాగే విజయసాయి రెడ్డి నాసిరకం ట్వీట్ల పై సుజనా ఘాటుగా స్పందిన్కాహారు. విజయసాయిరెడ్డికి ఓ స్థాయి ఉందని ఇన్నాళ్లూ అనుకున్నానని, కాని ఆయన ఇంతగా దిగజారిపోయి ట్వీట్లు వేస్తాడని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లో ఉన్న ఇన్ని ఏళ్ళలో ఎన్నో ఆరోపణలు చూశానని, అయితే, ఇంత నాసిరకం ఆరోపణలు విజయసాయి రెడ్డి దగ్గరే చూస్తున్నానని అన్నారు.

sujana 29082019 3

వాళ్లలా నేనేమీ జైలుకు వెళ్లలేదని విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి నా పై వేసే, నాసిరకం ట్వీట్లకు ఇక పై స్పందించనని, తన లాగా నేను ఇక దిగజారలేనని, వాటికి ముగింపు పలుకుదామని అనుకుంటున్నానని, ఆ స్థాయికి దిగజారడం అనవసరమని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. విజయసాయిరెడ్డి సన్నాసి సలహాలు వినబట్టే, జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు పరిపాలనలో ఇన్ని కష్టాలు ఎదుర్కుంటున్నారని సుజనా అన్నారు. ఈయన సలహాలు వింటే జగన్ మునగటం కాదు, రాష్ట్రం మునుగుతుందని సుజనా అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులు, సంస్థలపైనా పరువు నష్టం దావా వేస్తానని సుజనా అన్నారు. తాను తప్పు చేశాను అనుకుంటే, కేసులు పెట్టుకుని, అరెస్ట్ చేసుకోండి అంటూ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు సుజనా..

సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరైనా బలవంతులు, బలహీనుల మీద స్కెచ్ వేస్తే, ఆ బలహీనులు కొన్నాళ్ళు తప్పించుకుని తిరిగే పరిస్థితి. ఇక్కడ బలవంతుడు అంటే, అధికారం ఉన్న వాళ్ళు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు, ఈ బలహీనులు, ప్రాణాలను కాపడుకోవాల్సిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజకీయ దాడులు పెరిగిపోయాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో కారాడుతున్నారు. ఇప్పటి వరకు 300 పైగా రాజకీయ దాడులు జరిగాయి. 7 గురు కార్యకర్తలు చనిపోయారు. గ్రామాల్లో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టె పరిస్థితి. ఈ దాడులకు భయపడి, వైసిపీ నేతల అరాచకం తట్టుకోలేక గ్రామాల్లో నుంచి తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళిపోయి, ఎక్కడో తలదాచుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా, పట్టించుకునే వారే లేరు.

cbn 30082019 2

అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఏ పార్టీ చెయ్యని కార్యక్రమం, కార్యకర్తల కోసం చేస్తుంది. వైసీపీ దాడులతో గ్రామాల్లో ఉండలేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు పార్టీ తరుపున పునరావాసం కల్పించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం గుంటూరులో ఈ పునరావాస శిబిరం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన నిన్న గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పల్నాడులో కొన్ని గ్రామాల్లో, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభితి పార్టులు, వైసీపీ నేతల దాడులు భరించలేక ఊళ్ళు కాళీ చేసి, వేరే చోట తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది.

cbn 30082019 3

అయినా వారి భద్రతకు గ్యారంటీ లేదు. అందుకే పార్టీ తరుపునే ఈ బాధ్యత తీసుకున్నారు. ఇలనాటి వారిని దృష్టిలో ఉంచుకుని, గుంటూరులో పునరావాస శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే వారందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ బాధితులు ఇక్కడే ఉండే అవకాశం కల్పిస్తామని, తర్వాత తనే దగ్గర ఉండి బాధితులను ఆయా గ్రామాలకు తీసుకెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు చక్కదిద్దుకోకపొతే, ఆయనే స్వయంగా ఆ గ్రామల్లో నివసిస్తానని, ఇప్పటికే చెప్పారు. మరి ఈ శిబిరానికి ప్రభుత్వం తరుపున ఏమైనా అడ్డు చెప్తారో, లేదో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read