ఉత్తర కొరియా కార్ల కంపెనీ దిగ్గజం కియా కంపెనీ, ఎంత పెద్ద కంపనీ అనేది అందరికీ తెలిసిందే. అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. అంతర్జాతీయ స్థాయిలో, గుర్తింపు ఉన్న కంపెనీ. అలాంటి కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టటానికి సిద్ధమైంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి దిగ్గజ రాష్ట్రాలు తమ రాష్ట్రానికి తీసుకు రావటానికి పోటీ పడ్డాయి. చంద్రబాబు ఏమి మాయ చేసారో కాని, అంత పోటీని తట్టుకుని మరీ, ఆ కంపెనీని మన రాష్ట్రానికి తీసుకు రావటంలో సక్సెస్ అయ్యారు. ఈ కంపెనీ ఏకంగా 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. నిన్న కియా ఉత్పత్తి చేసిన మొదటి కారు మార్కెట్ లోకి వదిలారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డిని పిలిచినా ఆయన వెళ్ళలేదు.

madhav 09082019 2

పార్టీ ప్రతినిధులుని పంపించారు. అయితే ఈ సందర్భంలో, వైసిపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తనకు, అక్కడ ఉన్న కియా ప్రతినిధులు అవాక్కయ్యారు. ఒక విధంగా చెప్పాలి అంటే బెదిరిపోయారు. ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీనే వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారు అంటే, ఇక లోకల్ పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. నిన్న గోరంట్ల మాధవ్ స్టేజ్ పైనే కియా ప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చెయ్యటం కనిపించింది. అలాగే కియా మొదటి కార్ పై సంతకం చెయ్యండి అని ప్రతినిధులు కోరగా, ‘కియ కార్‌ రోల్‌ అవుట్‌.. బట్‌ అవర్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ఈజ్‌ రూల్డ్‌ అవుట్‌’ అని రాసారు. అంతే కాదు, మీరు ఇంకా చంద్రబాబు మత్తులోనే ఉన్నారు అంటూ, కియా ప్రతినిధుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

madhav 09082019 3

కియా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి గారి పేరు లేదని, ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 75 శాతం ఉద్యోగాలు ఇక్కడ వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం రూల్ పెట్టిన విషయం తెలియదా అని కియా పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కియా మీద జగన్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అయితే ఇక్కడ కియా అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. వారు ఒప్పందం కుదుర్చుకునే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు జగన్ వచ్చి నేను కొత్త రూల్ పెట్టాను అంటే, 13 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు వీళ్ళ మాట వింటాడా ? ఈయన జగన్ కి కంప్లైంట్ చేస్తాను అంటున్నారు, కియా వాళ్ళకు వీళ్ళ చెష్టలకు మండి, మోడీకి కంప్లైంట్ ఇస్తే, జగన్ పరిస్థితి ఏంటి ? వీళ్ళ పులివెందుల పంచాయతీకి, కియా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే, పరిస్థితి ఏంటి ? వీళ్ళ ఇగో కోసం, రాష్ట్రం బలి అవ్వాలా ?

సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉండగా ఎంత సెన్సేషనల్ అయ్యారో, రాజకీయాల్లోకి వచ్చి అంత పేరు సంపాదించలేదు అనే చెప్పాలి. జగన్ కేసుల్లో కాని, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో కాని, ఆయన చూపించిన తెగువకి, దేశ వ్యాప్తంగా మంచి ఆఫీసర్ అని పేరు వచ్చింది. అప్పట్లో మంత్రులుగా ఉన్న మహా మహా నాయకులను కూడా వదిలిపెట్టని లక్ష్మీనారయణ, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత క్రమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, గ్రామ స్వర్జ్యం పేరిట, ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాలు తిరిగారు. రైతులకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో, ఆయన ప్రయాణం మొదలయ్యింది. తన పర్యటన తరువాత, రాజకీయాల్లోకి వస్తేనే, రైతులకు తాను చెయ్యల్సింది ఇంకా తొందరగా చెయ్యగలను అని నిర్ణయం తీసుకున్నారు.

jdl 08082019 1

మొదట్లో లోక్ సత్తా పార్టీలోకి వెళ్తారని, బీజేపీ అని, తెలుగుదేశం పార్టీ అని, ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే జేడీ మాత్రం, చివరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరారు. పోయిన ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నుంచి జనసేన తరుపున ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, ఆయన జనసేనలో ఉన్నట్టే అనిపించినా, తరువాత తరువాత దూరం అవుతూ వచ్చారు. మొన్న ప్రకటించిన జనసేన కమిటీల్లో, లక్ష్మీనారాయణకు కనీసం ఎక్కడా చోటు లేకపోవటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ కు, జేడీకి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయిందని, ఈ సంఘటనతో అర్ధమైపోయింది. దీంతో, అసలు ఎందుకు వీరి మధ్య గ్యాప్ వచ్చింది అనే డిస్కషన్ మొదలైంది.

jdl 08082019 1

ఆయన పార్టీ కార్యక్రమాల్లో కంటే, తన సొంత కార్యక్రమాల్లో, ఇమేజ్ పెంచుకునే కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారని, అందుకు తెలివిగా జనసేన కార్యకర్తలని వాడుకుంటున్నారని, అది పవన్ కళ్యాణ్ కు నచ్చటం లేదని, అందుకే వీరి మధ్య అలా గ్యాప్ వచ్చిందని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల తరువాత నుంచి, లక్ష్మీనారాయణ, ఆయన ఫౌండేషన్ కు సంబందించిన కార్యక్రమాలు చేసుకుంటూ, దానికి జనసేన కార్యకర్తలను వాడుకుంటున్నారు, ఇదే పవన్ కు కోపం తెప్పించింది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే పవన్ ఆయనకు ఏ కమిటీలోనూ చోటు ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఆ చర్య తరువాత, లక్ష్మీనారయణ కూడా పవన్ ను కలవటానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నా, లక్ష్మీనారాయణ కాని, అటు జనసేన వర్గాలు కాని, ఎవరు అధికారికంగా స్పందించలేదు.

రాష్ట్రంలో గత రెండు నెలలుగా పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాని. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ఇసుక లేక నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోవటంతో, 20 లక్షల మంది కూలి పని చేసుకునే వారికి పనులు లేవు. ఇక మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా నేమ్మదించాయి. పోయిన నెల తమ నాయన పుట్టిన రోజు అని చెప్పి, 8 వ తారీఖున పెన్షన్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రతి సారి ఫస్ట్ తారీఖున ఉద్యోగులకు జీతాలు పడేవి. ఈ సారి రెండు రోజులు ఆలస్యం అయ్యింది. ఎందుకు అని ఆరా తీస్తే, ఎదో సాంకేతిక సమస్య అని చెప్పింది ప్రభుత్వం. అలాగే ప్రతి నెలా పెన్షన్ లు తీసుకునే ముసలి వారికి, వికాలంగులుకు కూడా ఈ సారి పెన్షన్ లేట్ అయ్యింది.

pensions 08082019 2

8వ తారీఖు వచ్చినా ఇంకా పెన్షన్ రాని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. ఇదే విషయం పై ఒక ప్రముఖ ఛానెల్ లో వచ్చిన వార్తాను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియో చూస్తూ ముసలి వారి పడే కష్టాలకు కన్నీళ్లు వస్తున్నాయి. మాకు ఇంకా పెన్షన్ ఇవ్వలేదు అయ్యా, తిండి కూడా తినట్లేదు అంటూ ఒక తాత ఏడుస్తూ చెప్తే, మరొక అవ్వ, కనీసం 10 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఆకలి వేస్తుంది అని వేడుకునే పరిస్థితి వచ్చింది. మరి కొంత మంది, మమ్మల్ని రోజు తిప్పించుకుంటున్నారు. చార్జీలకు డబ్బులు అయిపోతున్నాయి అంటూ బాధ పడుతున్నారు. ఇలా తాము పడుతున్న కష్టాలు చెప్తూ, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, టైంకి పెన్షన్ ఇచ్చే వారని, రెండు నెలల నుంచి లేట్ అవుతుందని, బాధ పడుతున్నారు..

pensions 08082019 3

చంద్రబాబు ఈ వీడియో పోస్ట్ చేస్తూ, ఇలా స్పందించారు... "పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణం. ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏమిటి? ఆకలికి అలమటిస్తున్న పేదల బాధ ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? అనవసర విషయాలపై కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికా బద్దంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? గతంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడే వస్తున్నాయంటే నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా మేలుకుని పెండింగ్ పింఛన్లను వెంటనే ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి." https://www.facebook.com/tdp.ncbn.official/videos/484863779010975/

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటం ఒక వింతగా చెప్పాలి. మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, సోలార్, విండ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రేట్ తగ్గించాలని, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జరీ చేసిన సంగాతి తెలిసిందే. అయితే ఇప్పటికే 42 విద్యత్ ఉత్పత్తి కంపెనీలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్ట్ కు వెళ్లారు. దీంతో కోర్ట్ ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కేంద్ర సంస్థలు అయిన, ఎన్‌టీపీసీ, ఎస్‌ఈసీఐలు ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వానికి మేము విద్యుత్ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదు, ఒప్పందం రద్దు చేసుకుంటే, ఫైన్ కట్టాలి అని ఏపి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాయి.

apgovt 08082019 2

అయితే ప్రైవేటు సంస్థలు, కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి అంటే అర్ధం ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కూడా, ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన, జెన్కో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. సోలార్ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోలార్ విద్యుత్, ఒక యూనిట్ ధరను రూ.2.50 కు తగ్గించాలని, ప్రభుత్వం, అన్ని విద్యుత్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు ఒప్పుకోమని అన్ని విద్యుత్ సంస్థలతో పాటు, ఇప్పుడు రాష్ట్రం ఆధీనంలో ఉండే జెన్కో కూడా, మేము ఆ ధరకు విద్యుత్ ఇవ్వలేము అంటూ తేల్చి చెప్పాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో బోర్డు సమావేశంలో తీర్మానం చేసారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి. సొంత సంస్థలు కూడా ప్రభుత్వాన్ని తప్పు బడుతున్నాయి.

apgovt 08082019 3

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో అనంతపురం జిల్లాలోని సోలార్‌ పార్క్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసింది. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాలు ప్రకారం, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ ను, రూ.3.50 కు అమ్మే విధంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తక్కువకు ఇవ్వమనటంతో, జెన్కో అధికారులు మాత్రం కుదరదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్లాంట్ పెట్టటానికి, అయిన ఖర్చుకు, ఒక్కో యూనిట్ ను, రూ.4 కు అమ్మాలని, అయినా మాకు విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ రూ.3.50 రేట్ మాత్రమే నిర్ణయించిందని, ఇప్పటికే నష్టాల్లో ఉన్న మాకు, మరింత తగ్గించాలి అంటే, మా వల్ల కాదని, ఏపి జెన్కో, ఏపి ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరి జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్నయం తీసుకుంటారో.

Advertisements

Latest Articles

Most Read