ఈ రోజు అనంతపురం జిల్లాలో, దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియ పరిశ్రమ నుంచి మేడిన్‌ ఆంధ్రాగా తయారు చేసిన తొలి కారు మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ రోజు కియా కార్లు రోడ్ల పై సందడి చేయ్యనున్నాయి. అయితే ఈ రోజు కియా మొదటి కారు లాంచ్ చెయ్యటం పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కియా కంపెనీ ఏపిలో రావటం కోసం మొదటి నుంచి చివరి దాకా పని చేసిన చంద్రబాబు, ఈ రోజు కియా మొదటి కారుని వైసీపీ నేతలు ఓపెన్ చెయ్యటం పై ఎలా స్పందిస్తారా అనే అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం, ఎంతో హుందాగా ఒక స్టేట్స్-మెన్ లాగా స్పందించారు. కియా మొదటి కార్ ఇవాళ రోడ్డు పైకి వస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా కియా కంపెనీని అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

kia 08082019 2

దేశ ఆటో మొబైల్ రంగంలో కియా ఒక కొత్త ఒరవడి సృష్టించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కియా కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటానికి ఎంతో కష్టపడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కియా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, దానికి సంతోష పడుతున్నాని ఆయనా న్నారు. కియా సంస్థ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాకు ఎదో ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకు వచ్చి, అక్కడ కరువుని జయించి, వలసలు తగ్గించాలని అనుకున్నారు. ఇందు కోసం అనేక ప్రయత్నాలు చేసి, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలని తట్టుకుని మరీ, కియా కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారు.

kia 08082019 3

13 వేల కోట్ల పెట్టుబడితో, కియా దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి అయ్యింది. కియా ఒక్కదాంతో చంద్రబాబు ఆపలేదు. దాదపుగా 40 వరకు అనుబంధ సంస్థలు కూడా కియాతో పాటు వచ్చాయి. మొత్తంగా 15 వేల మంది దాకా ఉపాధి లభించనుంది. కియా తరువాత, హీరో హోండా, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్ లాంటి ఆటోమొబైల్ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. ఇలా అనేక కంపెనీలను చంద్రబాబు తీసుకువచ్చారు. అయితే, మొన్న అసెంబ్లీలో కియా కంపెనీని తీసుకువచ్చింది వైఎస్ఆర్ అని, 2007లో అప్పట్లో వైఎస్ఆర్, కియా కంపెనీతో మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడికి ఒప్పించారని, దీంట్లో చంద్రబాబు గొప్పతనం ఏమి లేదని, అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం చెప్పటం గమనార్హం.

పోలవరం ప్రాజెక్ట్ విషయం పై రోజు రోజుకీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2014 వరకు, పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో, కనీసం 5 శాతం పనులు కూడా జరగలేదు. కాలువలు మాత్రం తవ్వుకుని, మట్టి అమ్ముకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కాలువలు కూడా ఎక్కడ వీలు ఉంటే అక్కడ తవ్వారు. రైతులు భూములు ఇవ్వని చోట వదిలేసారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ కాలువల తవ్వకంలో ఉన్న లిటిగేషన్లు అన్నీ సరి చేసారు. రైతులను ఒప్పించి భూములు తీసుకున్నారు. దీని ఫలితమే, ఈ రోజు పట్టిసీమ. చంద్రబాబు వచ్చిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ సైట్ పనులు కూడా పరుగులు పెట్టాయి. చంద్రబాబు దిగిపోయే టైంకి, 5 శాతం ఉన్న పనులు, 73 శాతం అయ్యాయి. ప్రాజెక్ట్ విషయంలో అన్ని పనులు పరుగులు పెట్టించారు చంద్రబాబు.

polavaram 08082019 2

అయితే కొత్త ప్రభుత్వం రావటంతోనే, పోలవరం పనులు ఆపేసింది. దీంతో ఇప్పటికి పనులు ఆపి, మూడు నెలలు అవుతుంది. అంతే కాదు, పోలవరం పనులను పరుగులు పెట్టించిన నవయుగ కంపెనీకి నోటీసులు ఇచ్చి, వారిని వెళ్ళిపోమని, కొత్త టెండర్ పిలవటానికి రెడీ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త టెండర్ పిలిస్తే, ఇప్పుడు ఉన్న రేట్ కంటే ఎక్కువే కోట్ చేస్తుంది. ఎక్కువ రేట్ అయితే కేంద్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మరి రాష్ట్రం ఎందుకు టెండర్ క్యాన్సిల్ చేసినట్టు ? ఈ వివాదం గురించి జగన్ ఢిల్లీ వెళ్లి, అందరికీ వివరించి రాగానే, కేంద్రం మరో షాక్ ఇస్తూ, 2005 లో జరిగిన విషయం పై నోటీసులు పంపించింది. 2005 అంటే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి.

polavaram 08082019 3

2005లో పొలవరంతో పాటు, దాని అనుబంధ ప్రాజెక్టుల పై, అప్పట్లో కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన చెన్నై అధికారులు పోలవరం ప్రాజెక్ట్ తో పాటు దాని అనుబంధ ప్రాజెక్ట్ ల పై సమీక్ష జరిపారు. అయితే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, పోలవరం విషయంలో, పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కేంద్రానికి రిపోర్ట్ చేసారు. పర్యావరణ శాఖ ఇచ్చినే నివేదిక ఆధారంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. ఇది కనుక రద్దు చేస్తే, ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కుదరదు. అయితే ఆ కమిటీ పరిశీలన జరిపిన 14 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఎందుకు కేంద్రం షోకాజ్ నోటీసులు ఇచ్చింది అనేది మాత్రం అర్ధం కావటం లేదు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసింది, అని ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై దాని ప్రభావం పడేలా చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చూద్దాం ఏమి అవుతుంది.

జగన్ మోహన్ రెడ్డి ఒక పావు కదిపితే, కేంద్రం ఒకేసారి రెండు పావులు కదుపుతుంది. అక్కడ ఉన్నది మోడీ, అమిత్ షా మరి. ఊరికే వదులుతారా ? పిండేస్తారు. మనం ఎంత నటించినా, మన లోపల ఉన్నది ఏమిటో, ఇట్టే పసిగట్టే గుణం ఉన్న మోడీ, అమిత్ షా లు, చూస్తూ కూర్చుంటారా ? ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న చంద్రబాబు లాంటి వాడినే, వాళ్ళతో పెట్టుకున్నందుకు, అధికారాన్ని వాడుకుని డమ్మీ చేసి పడేసారు. అలాంటిది 31 కేసులు ఉన్న జగన్ ఒక లెక్కా ? మనం ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప, ఏమి చెయ్యలేని పరిస్థితులు వస్తున్నాయి. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అందరినీ కలుస్తూ, రాష్ట్రానికి అన్ని విధాల సాయం చెయ్యమని కేంద్రాన్ని అడుగుతున్నారు. నిన్న ప్రధాని మోడీని కలిసి కష్టాలు అన్నీ చెప్పారు.

polavaram 07082019 1

అలాగే జగన్ చేస్తున్న స్వీయ తప్పులు గురించి కూడా ప్రధాని మోడీకి వివరించారు. విద్యుత్ ఒప్పందాల పై సమీక్షకు వెళ్ళద్దు అంటూ కేంద్రం హెచ్చరిస్తున్నా, జగన్ వెళ్తున్నారు. అందుకు సంబధించి సంజాయషీ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేసారు అంటూ ఏవో లెక్కలు చెప్పారు. మరో పక్క కేంద్రం ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కూడా, వేలు పెట్టి, నవయుగను వెళ్ళగొట్టి, కొత్త టెండర్లుకు వెళ్ళాలని నిర్ణయించటం పై కూడా కేంద్రం గుర్రుగా ఉంది. దీని పై కూడా జగన్, ప్రధానికి సంజాయిషీ ఇచ్చారు. అయితే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి డబల్ గేమ్ ఆడుతున్నారని కేంద్రానికి అర్ధమైందో ఏమో కాని, వాళ్ళు కూడా రాష్ట్రం పై ఎదురు దాడి మొదలు పెట్టారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే షాక్ ఇచ్చారు.

polavaram 07082019 1

నిన్న పోలవరం పై ఆదుకోండి అని జగన్ మోహన్ రెడ్డి అడగ్గా, కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా, మీ పోలారం ప్రాజెక్ట్ ఎందుకు ఆపకూడదు అంటూ షోకాజ్ నోటీసు పంపించి, జగన్ ప్రభుత్వానికే కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. పోలవారానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చెయ్యకూడదో చెప్పండి అంటూ రాష్ట్రానికి నోటీసు పంపించింది. పోలవరం దాని అనుబంధ ప్రాజెక్ట్ ల పై, కేంద్రం పర్యావరణ శాఖ చేత తనిఖీలు చేపించింది. ఆ తనిఖీల్లో, 2005లో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని తేలినట్టు నివేదిక రావటంతో, కేంద్రం ఈ నోటీసులు ఇచ్చింది. అంటే రాజశేఖర్ రెడ్డి హయంలో. అయితే గతంలో చంద్రబాబు హయంలో కూడా ఈ ఇబ్బందులు ఉన్న, స్టాప్ ఆర్డర్ పై కేంద్ర ప్రభుత్వం స్టే ఇస్తూ వచ్చేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఇలాగే రెండేళ్లకు స్టే ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు ఇవ్వటంతో, ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కేంద్రం దయ లేకపోతె, ఇప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే అవకాసం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక సరైన సంజయషీ ఇవ్వకపోతే, పోలవరం గురించి, ఇక మర్చిపోవటమేనేమో...

రెండు రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, వివిధ కేంద్ర మంత్రులను కలిసారు. వారిని కలిసి వెంకన్న ప్రసాదం, శాలువా కప్పి సత్కరించారు. అయితే, ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన సందర్భంలో, జగన్ కు కొంత చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు పై, మీ వంతు సహకారం అందించాలని జగన్ మోహన్ రెడ్డి, వెంకయ్య నాయుడుని కోరారు. అయితే, ఈ నేపధ్యంలో, వెంకయ్య, జగన్ కు చురకలు అంటించనట్టు తెలుస్తుంది. మీరు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తున్నారు, సరి చేసుకోండి అని సూచనలు ఇచ్చారు. మీ తప్పులతో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చే విధంగా మీ విధనాలు ఉంటున్నాయని వెంకయ్య అన్నారు.

venkaiah 08082019 2

నేను మీరు చెప్పినా, చెప్పకపోయినా ఎప్పుడూ రాష్ట్రానికి సహాయం చేస్తాను అని వెంకయ్య చెప్తూ, మీరు నిర్మాణాత్మక రీతిలో కాకుండా విధ్వంసక రీతిలో పనిచేస్తే సాయం చేయడం కష్టమని, నేను కూడా ఏమి చేసేది ఉండదని వెంకయ్య తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ఈ మాటలు వెంకయ్య చెప్పటం వెనుక కారణం ఏంటి అని అరా తీస్తే, ఇప్పటికే జగన్ వ్యవహర శైలి పై కేంద్రం గుర్రుగా ఉందని సమాచారం. ఢిల్లీ పెద్దల దగ్గర వినయం నటిస్తూ, రాష్ట్రానికి వచ్చి మాత్రం, వాళ్ళు చెప్పినట్టు కాకుండా, కేంద్రం సూచనలు కనీసం పరిగణలోకి తీసుకోకుండా, జగన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా తెలుస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు కూడా కంట్రోల్ తప్పుతూ ఉండటం కూడా కారణం అని తెలుస్తుంది.

venkaiah 08082019 3

గత ప్రభుత్వం చేసిన పనులు అన్నీ సవ్యంగా నడిపించాల్సిన టైంలో, అన్నీ ఆపేస్తూ, పరిస్థితిని జగన్ జటిలం చేస్తున్నారని, ఇసుక ఎందుకు ఆపారో అర్ధం కావటం లేదని, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడటం కుడా వింటున్నాయి. అయితే రెండు రోజుల జగన్ ఢిల్లీ పర్యటనలో, కేంద్రం నుంచి పెద్దగా అభయం వచ్చినట్టు కనిపించటం లేదు. ముఖ్యంగా జగన్ వెళ్ళింది, పోలవరం టెండర్ రద్దు గురించి చెప్పటానికి, అలాగే విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై వివరణ ఇవ్వటానికి. అయితే ఈ రెండిటి పై కేంద్రం గుర్రుగా ఉంది. మా అనుమతి లేకుండా చెయ్యద్దు అని చెప్పినా, జగన ముందుకు వెళ్తున్నారు అనే కోపం ఉంది. అందుకే జగన దూకుడుకు బ్రేకులు వెయ్యటానికి, జగన్ ఢిల్లీలో ఉండగానే, పోలవరం ప్రాజెక్ట్ పై షోకాజ్ నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఒక పక్క వెంకయ్య మాటలు, మరో పక్క జగన్ హావభావాలు చూస్తుంటే, ఈ సారి ఢిల్లీ టూర్ లో జగన్, అనుకున్నది దక్కలేదు అనే వాతావరణమే కనిపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read