రాష్ట్రంలో పేదలకు 5 రుపాయలకే అన్నం పెట్టే, అన్న క్యాంటీన్ ను తాజగా వచ్చిన జగన్ ప్రభుత్వం మూసేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఎక్కడ మైలేజ్ వస్తుందో అని, ముందుగా అన్న క్యాంటీన్ రంగులు మార్చేసారు. దీనికి ఎంత ఖర్చు అయ్యిందో తెలియదు కాని, సోషల్ మీడియాలో మాత్రం, 11 కోట్లు ఖర్చు అయ్యిందనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే రంగులు మార్చితే మార్చారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు కదా, రంగులు మార్చి, పేర్లు మార్చితే ఏమైందిలే అని అందరూ అనుకుంటున్న వేళ, మొన్న ఫస్ట్ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసారు. ఎందుకు మూసారో, ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం మాత్రం, చంద్రబాబు ఆదరాబాదరాగా, ఒక లక్ష్యం లేకుండా పెట్టారని, వీటిని సమీక్షించి, అప్పుడు చెప్తాం అంటుంది.

anna 03082019 2

మరో పక్క 150 కోట్లు అవినీతి అన్న క్యాంటీన్లలో జరిగింది అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అవినీతి జరిగితే ఎంక్వయిరీ చేసి, బాధ్యులను లోపల వెయ్యాలి కానీ, ఇలా కడుపు కాడ కూడు లాగేయ్యటం ఏంటి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మంత్రి బొత్సా సత్యన్నారాయణ చేసిన ప్రకటన చూస్తే మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అన్న క్యాంటీన్లకి బిల్డింగ్ లు అవసరం లేదని బొత్సా చెప్పారు. మేము వాటి స్థానంలో మొబైల్ క్యాంటీన్లు అంటే సంచార క్యాంటీన్లు తీసుకు వస్తామని బొత్సా అంటున్నారు. ఎక్కడ ప్రజలు ఉంటే, అక్కడకు ఈ సంచార వాహనాలు వెళ్తాయని, ఇలా ప్లాన్ చేస్తున్నామని బొత్సా చెప్పారు. ముందుగా రద్దీ ఎక్కడ ఉందొ చూస్తాం, ప్రజల వద్దకే ఈ సంచార క్యాంటీన్లని తరలిస్తామని బొత్సా చెప్పారు.

anna 03082019 3

అయితే, ఇది అంతా సాధ్యం అయ్యే పనేనా ? రద్దీ ఉన్న ప్రతి చోటా, ప్రజలు వచ్చి భోజనం చేస్తారా ? ఒక చోట ఉంటే, ఆకలి ఉన్న వాడు వచ్చి తింటాడు. మరి ప్రభుత్వం ఈ ఆలోచన ఎందుకు చేస్తుందో మరి ? ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఒక కొత్త భయం మొదలైంది. శుభ్రమైన వాతావరణంలో పెదులు అన్నం తినాలని, చంద్రబాబు మంచి భవనాలు కట్టారు. ఇప్పుడు బొత్సా గారు, సంచార క్యాంటీన్లు అంటున్నారు. అలాగే అసలు భవనాలు అవసరం లేదు అంటున్నారు. మరి, ఇప్పటికే ఉన్న మంచి మంచి భవనాలు ఏమి చేస్తారు అనే వాదన కూడా మొదలైంది ? ఈ భవనాల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కాని అది రాజకీయ ఆరోపణ గానే తీసి పారెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్న చోట, మద్యం దుకాణాలు పెట్టటానికి, రూల్స్ ఒప్పుకోవు. అయినా ప్రభుత్వం ఆ సాహసం చెయ్యలేదు. మరి ఈ భవనాలను ఏమి చేస్తారు ? ఇప్పటికే 150 కోట్ల అవినీతి అంటున్నారు కాబట్టి, ప్రజా వేదిక లాగా, కూల్చేస్తారా ? బొత్సా గారు, అన్న క్యాంటీన్లకు భవనాలు అవసరం లేదు అని ఎందుకు అన్నారు ? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఉదయం అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలకు వెళ్ళటం చంద్రబాబుకి ఆనవాయతీ. ఈ సారి కూడా నాలుగు రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని, ఈ రోజు ఉదయమే చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయం అమరావతి వస్తారాని సమాచారం. అయితే అమెరికా నుంచి రాగానే జెట్ ల్యాగ్ కూడా లేకుండా, చంద్రబాబు పార్టీ సమీక్షలు చేసారు. కొద్ది సేపటి క్రితం, చంద్రబాబు, మాజీ కేంద్రం మంత్రి జైపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళే రోజే, జైపాల్ రెడ్డి మరణించారు. అయితే అప్పటికే షడ్యుల్ ఉండటంతో, చంద్రబాబు పరామర్శకు వెళ్ళలేక పోయారు.

revanth 03082019 2

ఈ నేపధ్యంలో అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన రోజే, ఆయాన జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించటానికి, ఆయన ఇంటికీ వచ్చారు. జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు. కుటుంబ సభ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నట్టు ఉండి ఇలా ఎందుకు జరిగింది అనే విషయాలు తెలుసుకున్నారు. జైపాల్ రెడ్డితో తనకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారు. ఈ సందర్భంలో, అక్కడ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కి బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోసం, అప్పటికే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు రాగానే, ఆయనను దగ్గర ఉండి జైపాల్ రెడ్డి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యలను, చంద్రబాబుకు పరిచయం చేసారు రేవంత్ రెడ్డి.

revanth 03082019 3

రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న టైంలో, ఓటుకు నోటు కేసు రావటం, అందరూ చేసే పనే అయినా, రేవంత్ ను టార్గెట్ చేసి, ఉచ్చులోకి దింపి, జైలుకు పంపటం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు రేవంత్ కూతురు నిశ్చితార్దానికి కూడా రేవంత్ బెయిల్ పై రావాల్సిన పరిస్థితి రావటంతో, చంద్రబాబు దంపతులు ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చేసిన సంగతి తెలిసిందే. తరువాత క్రమంలో, తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండటంతో, రేవంత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రేవంత్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తరువాత, చంద్రబాబుని మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారు. ఇది సందర్భం కాకపోయినా, చంద్రబాబు, రేవంత్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి, టిడిపి శ్రేణులు హర్షిస్తున్నారు.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో, ఎన్నికలు అయిన దగ్గర నుంచి, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ, అంతర్గత గొడవలు బయట పెట్టి, పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం తెలిసిందే. మొదటిగా దేవినేని ఉమాని టార్గెట్ చేసుకుని ఒక వర్గం పావులు కదిపింది. కొన్ని రోజులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. తరువాత విజయవాడ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న మధ్య జరిగిన ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిందే. పర్సనల్ గా ఒకరి పై ఒకరు ట్వీట్లు పెట్టుకుని మరీ, దాదపుగా వారం రోజులు టార్గెట్ చేసుకున్నారు. చివరకు ఈ విషయం పై చంద్రబాబును కూడా లాగటంతో, తెలుగుదేశం శ్రేణులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఒకరి పై ఒకరు ఆధిపత్యం చూపిస్తూ, చంద్రబాబుని లాగటం పై, కార్యకర్తలు కూడా వారి పై ఆగ్రహం చెందారు.

buddha 03082019 2

తరువాత, కేశినేని నానిని చంద్రబాబు కలవటం, అలాగే బుద్దా వెంకన్నను కూడా పిలిచి మాట్లాడటంతో, వివాదం అయిపోయినట్టే కనిపించింది. అప్పటి నుంచి, రెండు వైపులా ట్వీట్స్ వెయ్యటం ఆపేశారు. కేవలం రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేస్తూ, ఇద్దరూ ట్వీట్స్ కొనసాగిస్తున్నారు. ఈ వివాదాల మూలం ఏంటో, ఇప్పటికీ స్పష్టంగా బయటకు తెలియదు. అయితే ఈ వివాదం తరువాత, బుద్దా వెంకన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కాలేదు. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో, కేశినేని నాని, ఈ సమావేశానికి రాలేదు.

buddha 03082019 3

అయితే ఈ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న మాతరం కీలక నిర్ణయాన్ని ఆ సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బుద్దా వెంకన్న కొనసాగుతున్నారు. అయితే, వచ్చే టర్మ్ నుంచి ఈ పదవిలో తాను ఉండటం లేదని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు. అలాగే చంద్రబాబు భవిష్యత్‌లో ఎవరికి ఈ పదవి ఇచ్చినా, తాను అన్ని విధాలా సహకరిస్తానని బుద్దా వెంకన్న సమావేశంలో చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అయితే అసందర్భంగా ఈ ప్రకటన ఎందుకు చేసారు అనే విషయం పై చర్చ జరుగుతుంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బాధ్యత తీసుకోకుండా, బుద్దా తప్పించుకున్నారా అనే వాదన కూడా నడుస్తుంది. బుద్దా ఈ ప్రకటన చెయ్యటం వెనుక వ్యూహం ఏంటి ? రాజకీయ కోణం ఏంటి అనే దాని పై, తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది.

ఒక పక్క జగన్ మొహన్ రెడ్డి, మా ప్రభుత్వం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తుంది అని బిల్ తీసుకువచ్చి, ప్రచారం చేస్తుంటే, వారి పార్టీ నాయకులు మాత్రం, స్థానికులకు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. అనంతపురం జిల్లా, మండలంలోని తలారిచెరువు వద్ద ఒక పెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు అవుతుంది. దాదపుగా 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, ఇప్పటికే ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్లాంట్ వద్ద, శుక్రవారం ఉన్నట్టు ఉండి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఆ ఉద్యోగాలు తీయంచి, తమకు ఇష్టమైన వారికి వాలంటూ, వైసీపీ నేతలు బెదిరించటంతో, గత్యంతరం లేక, స్థానికులను తొలగించి, వైసీపీ నేతలు చెప్పిన వారికి ఇచ్చారు.

jc 03082019 2

అయితే, ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తీసేసిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లో చేర్చుకోవాలి అంటూ, వినతి పత్రం ఇవ్వటానికి, సోలార్ ప్లాంట్ వద్దకు వెళ్లారు. అయితే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తున్నారని, ముందే తెలుసుకున్న వైసీపీ నేతలు, అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నాయకుడు రామేశ్వరరెడ్డితో పాటు దాదాపు 200 మంది వరకు జనాలు కంపెనీ దగ్గరకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకున్నారు. ఆయన గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, జేసిని అడ్డుకున్నారు. లోపలకి వెళ్ళటానికి వీలు లేదని ఆయన్ని చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అవతల 200 మంది ఉన్నా, జేసీ మాత్రం, నేను లోపలకి వెళ్లి తీరుతా అంటూ అక్కడే కూర్చున్నారు.

jc 03082019 3

దాదపుగా అరగంటకు పైగా ప్లాంట్ బయటే కూర్చుని నిరసన తెలిపారు. పరిస్థితి చేయి దాటి పోతూ ఉండటంతో, ఆయన ఇక్కడ పరిస్థితి ఇది అంటూ, ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి, అన్నీ వివరించారు. రూరల్‌ సీఐ సురేష్ కుమార్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో పాటు వచ్చి, అక్కడ ఉన్న వారిని చెదరగొట్టి, జేసిని ప్లాంట్ లోపలకి పంపించారు. ప్లాంట్‌లో ట్రాక్స్‌కో షిప్టు ఏడీ శ్రీదేవికి వినతిపత్రం ఇచ్చి, ట్రాన్స్‌కో సీఈ శ్రీరాంకుమార్‌ కు ఫోన్ చేసి, ఉద్యోగులని ఇష్టం వచ్చినట్టు తొలగించారని, అది చట్ట ప్రకారం కూడా నేరం అని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, ఉద్యోగుల తరపున ఎంతవరకైనా పోరాడటానికి వెనుకాడనని తెలియజేశారు.

Advertisements

Latest Articles

Most Read