జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారు మోగుతుంది. మొన్నటి దాక ఆ రికార్డు, ఈ రికార్డు, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది అంటూ జాతీయ ఛానెల్స్ లో మన రాష్ట్రం గురించి వార్తలు వచ్చేవి. అయితే, ఇప్పుడు మాత్రం, నెగటివ్ న్యూస్, నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నటి దాక, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయిన విద్యుత్ ఒప్పందాల రద్దు, 75 శాతం పరిశ్రమల్లో రిజర్వేషన్ వంటి అంశాలు ప్రధానంగా వస్తే, ఈ రోజు మాత్రం, రెండు పూర్తీ నెగటివ్ వార్తలు, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జెరుసలేం టూర్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ముందుగా ఇది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న మొదటి విదేశీ పర్యటన.

indiatoday 01082019 2

అయితే ఇది ఏ పెట్టుబడులు కోసమో కాదు, ఆయన వ్యక్తిగత పర్యటన, కుటుంబంతో కలిసి వెళ్తున్నారు. అయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన జీఓలో, ఈ పర్యటన ఖర్చు అంతా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. అయితే నిన్న వచ్చిన ఒక జీఓలో మాత్రం, సెక్యూరిటీ కోసమని 22.50 లక్షలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అయితే అంత పెద్ద మొత్తం, సెక్యూరిటీ కోసం ఎందుకో అర్ధం కాలేదు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 22.50 లక్షలు, Triple “S“-RT&T టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ట్రావెలింగ్ కంపెనీకి ఇవ్వమని ఆ జీఓ లో ఉంది. నిజానికి ఇది సెక్యూరిటీ కంపెనీ కాదు. Triple “S“-RT&T అనేది టూర్స్ ప్లాన్ చేసే ఒక ఏజెన్సీ. మరి ఈ కంపెనీకి, 22 లక్షలు సెక్యూరిటీ కింద ఇవ్వమనటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

indiatoday 01082019 3

ప్రభుత్వం దీని పై వివరణ ఇస్తే కాని ఒక క్లారిటీ వచ్చే పని లేదు. నిజానికి జెరుసలేం వెళ్ళటానికి, మన దేశం నుంచి అయ్యే ఎయిర్ టికెట్ ఖర్చు, 50 వేలు మాత్రమే ఉంది. ఇవన్నీ చూసుకుంటే, 22 లక్షలు ఎక్కవ అనే చెప్పాలి. ఇదే విషయం ఇండియా టుడే జాతీయ ఛానెల్ నిలదీసింది. సొంత టూర్స్ కి, ప్రజా ధనం వాడతారా అంటూ నిలదీసింది. మరో పక్క, నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను బ్యార్య, తెలంగాణాలో ఒక ట్రాఫిక్ పోలీస్ ని బెదిరిస్తూ, నిన్న కేసిఆర్ తో చెప్పి, సస్పెండ్ చేపిస్తా అనే వీడియో కూడా ప్రముఖంగా ఇండియా టుడేలో వచ్చింది. ఒక ఎమ్మెల్యే కొడుకు పోలీసులని కొడితే, ఎమ్మెల్యే భార్య వచ్చి పోలీసులనే సస్పెండ్ చేపిస్తా అని బెదిరిస్తున్నారని, ఇండియా టుడే ఏకి పారేసింది. ఎందుకో కాని, మన తెలుగు మీడియా, ఈ వార్తలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ వీడియోలు ఇక్కడ చూడచ్చు. https://www.facebook.com/IndiaToday/videos/908853212811675/ , https://www.facebook.com/IndiaToday/videos/453858868532056/

ఆకలికి రాజకీయం ఉంటుందా ? తెలుగుదేశం వాడికి అదే ఆకలి, వైసీపీ వాడికి అదే ఆకలి ఉంటుంది. కాని చంద్రబాబు మొదలు పెట్టిన అన్న క్యాంటీన్ లకు మాత్రం, రాజకీయం అనే జబ్బు డామినేట్ చెయ్యటంతో, పేదల నోటి కాడ కూడా , లాగేసినంత పని అయ్యింది. పెడ వాడు పస్తులు ఉండకూడదు అని, కడుపు నిండా మూడు పూటల అన్నం తినాలని, చంద్రబాబు హయంలో, అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యానం భోజనం, రాత్రికి భోజనం పెట్టే వారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 73 పట్టణాలు, నగరాల్లో ఒకేసారి 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. రోజుకి దాదాపు 3లక్షల మందికి ఈ క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసేవారు.

botsa 01082019 2

ప్రభుత్వం మారి జగన్ వచ్చారు. తాత్కాలిక కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లు మూసేసారు. తరువాత రంగులు మార్చారు, పేర్లు మార్చారు. సరే ఏది చేస్తే ఏమిలే, ఎవరి పేరు పెడితే ఏమిలే, ప్రజలకు కడుపు నిండా అన్నం ముద్ద పెడితే చాలు అనుకున్నారు. కాని, అందరూ అనుకున్నట్టే, ఈ రోజు నుంచి అన్ని అన్న క్యాంటీన్లు మూసేసారు. అసెంబ్లీ వేదికగా, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు. కాని, ఆయన ప్రకటనకు భిన్నంగా, ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లు మూత పడ్డాయి. అది తెలియని పేదలు, ఎప్పటి లాగే, ఈ రోజు 5 రూపాయలు పట్టుకుని అన్న క్యాంటీన్లకు, కడుపు నింపుకోటానికి వచ్చారు. అయితే, ఈ రోజు నుంచి క్యాంటీన్ మూసేసారు అని తెలియటంతో, కడుపు మాడ్చుకుని వెనుతిరిగారు.

botsa 01082019 3

మరో పక్క అన్న క్యాంటీన్లలోని సామానుని కూడా తరలించి వేసారు. అక్కడ ఉండే సామాను, వాటర్ క్యాన్లు, అన్నీ తరలించారు. అయితే, మళ్ళీ ఇవి తెరుస్తారా లేదా అనేది మాత్రం, అర్ధం కావటం లేదు. అయితే మీడియాలో వస్తున్న వార్తలు, బయట ప్రజలు ఆందోళన చూసిన బొత్సా మళ్ళీ ఈ రోజు మాట్లాడారు. అన్న క్యాంటీన్లు మూసేసే ఆలోచన లేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం వీటిని సరిగ్గా చెయ్యలేదని, అందుకే వీటి విషయంలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే అన్న క్యాంటీన్ల విషయంలో మార్పు చేర్పులు చేసి, రాయితీ పై క్యాంటీన్లను ప్రారంభిస్తామని బొత్సా తెలిపారు. అయితే, అప్పటి వరకు పేదలు ఆకలితో ఉండాల్సిందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ? అప్పటి వరకు, ఏదైనా తాత్కాలిక ఏర్పాట్లు చేసైనా, కొనసాగుతున్న వాటిలో అన్నం పెట్టచ్చు కదా ? చంద్రబాబుని సాధించటానికి, పేదలకు అన్నం పెట్టటం ఆపేస్తారా ?

జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ లో, ప్రజలు మన వద్దకు వస్తే, చిరు నవ్వుతో పలకరించాలి, వాళ్ళ సమస్యలను నవ్వుతూనే పరిష్కరించాలి అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, వాస్తవంలో మాత్రం, అందుకు భిన్నంగా పరిస్థితులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల, ఆందోళన చేస్తున్న వారి పై, ఈ మధ్య కాలంలో, తీవ్రంగా స్పందిస్తున్నారు. మొన్నటి మొన్న తమ ఉద్యోగ భద్రత ఇవ్వాలి అని ఆందోళన చేసిన కాంట్రాక్టు ఉద్యోగులుని, ఆడవాళ్ళు అని కూడా చూడకుండా, లాగి అవతల పడేసి అరెస్ట్ చెయ్యటం చూసాం. ప్రతి రోజు ఎదో ఒక ఆందోళన జరుగుతూ ఉండటం, వారి పై పోలీసుల దురుసు ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పే దానికి, గ్రౌండ్ లో జరుగుతున్న వాటికి ఇంత తేడా ఉంది.

nandigama 01082019 2

అయితే ఈ రోజు రైతుల పై పోలీసులు ప్రవర్తించిన తీరు, విమర్శలకు దారి తీస్తుంది. వారి ఆందోళన అర్ధం చేసుకోవాలి, లేకపోతే చర్చల ద్వారా పరిష్కారం చెయ్యాలి, ఇలా బట్టలు ఊదిపోయేలా ఈడ్చుకురావటం పై విమర్శలు వస్తున్నాయి. రైతన్నల ప్రభుత్వం అని చెప్పుకునే వైసిపీ పార్టీ, దీని పై సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన తీరుతో అందరూ షాక్ అయ్యారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను, పోలీసులు ఈడ్చుకు వెళ్ళి, జీప్ లో పడేసారు. తరువాత వారిని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

nandigama 01082019 3

పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం, అక్కడ రైతులతో ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు, రైతులకు ఇస్తాను అన్న పరిహారం మాత్రం ఇవ్వలేదు. ఈ నేపధ్యంలోనే రైతుల పొలాల్లో, ఈ రోజు విద్యుత్ అధికారులు వచ్చి, పనులు చేపట్టారు. మాకు రావాల్సిన పరిహారం ఇంకా రాలేదని, అది ఇవ్వకుండా ఎలా పనులు చేస్తారు అంటూ, రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. రైతుల మాటలు పట్టించుకోకుండా, గత వారం రోజులుగా విద్యుత అధికారులు వచ్చి పనులు చేస్తున్నారు. దీంతో గురువారం రైతులు తీవ్ర ఆందోళన చేసారు. పరిహారం ఇస్తేనే పనులు చెయ్యనిస్తాం అని ఆందోళన బాట పట్టారు. దీంతో అక్కడ అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, పోలీసులు వచ్చి, రైతులను ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి జీప్ ఎక్కించారు. ఈ తరుణంలో రైతుల ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఈ చర్య పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎంపీ కేశినేని కూడా ఈ చర్యను ఖండించారు. చర్చల ద్వారా అయ్యే సమస్యను, రైతన్నల అరెస్ట్ దాకా తీసుకువెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో, ఒక కేసు అయిన వాన్పిక్ కేసులో, A3 నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన సెర్బియా దేశానికి విహార యాత్రకు వెళ్ళిన సందర్భంలో, ఆయాన ఎయిర్ పోర్ట్ లో దిగగానే, ఇంటర్ పోల్ సాయంతో, అక్కడి పోలీసులు, నిమ్మగడ్డను అరెస్ట్ చేసారు. అయితే నిమ్మగడ్డ అరెస్ట్ వార్తా తెలిసిన వెంటనే, వైసీపీ అలెర్ట్ అయ్యింది. నిమ్మగడ్డ వేరే దేశంలో అరెస్ట్ కావటం, తమ అధినేత ఆ వాన్పిక్ కేసులో A1 నిందితుడుగా ఉండటంతో, ఎక్కడ ఏమి జరుగుతుందో అని భావించి, ముందుగా నిమ్మగడ్డను భారత దేశం రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు ముందుగా మన దేశం సపోర్ట్ చాలా అవసరం. అందుకే, ఈ విషయాన్ని వెంటనే కేంద్రానికి చెప్పి, తమకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చేత, నిమ్మగడ్డను మన దేశానికి రప్పించ వచ్చు అని అనుకున్నారు.

nimmagadda 01082019 2

అనుకున్నదే ఆలస్యం, బాగా పవర్ ఉంటుందని, వైసీపీకి ఉన్న 22 ఎంపీల చేత కేంద్రానికి లేఖ రాయించారు. కేంద్రమంత్రి జైశంకర్‌ కు 22 మంది ఎంపీలు లేఖ రాసి, ఆయన్ను వెళ్లి కలిసి మరీ పరిస్థితి వివరించారు. నిమ్మగడ్డను ఎలా అయినా మన దేశం తీసుకు రావాలని, దానికి సంబందించిన చొరవ కేంద్రం తరపున చెయ్యాలని, ఈ 22 మంది వైసిపీ ఎంపీలు, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన్ను అరెస్ట్ చేసిన కేసులో అసలు ఆధారాలు లేవని, సెర్బియా పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేసారని, సెర్బియాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా చర్యలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీని పై మాత్రం, కేంద్రమంత్రి జైశంకర్‌ వేరే విధంగా స్పందించినట్టు సమాచారం. ఇలాంటి విషయాల్లో కేంద్రం జోక్యం ఉండదని తేల్చి చెప్పారు.

nimmagadda 01082019 3

అది సివిల్‌ వివాదమని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని కేంద్ర మంత్రి, వైసీపీ ఎంపీలకు తేల్చి చెప్పారు. అయితే మీరు ఆ వ్యక్తిని జైల్లో కలవాలి అంటే, కేంద్రం దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తుంది కాని, మా వ్యక్తిని అరెస్ట్ చేసారు, విడిచి పెట్టండి అని మేము అడగం అని, కేంద్రం తరుపున తేల్చి చెప్పారు. దీంతో చేసేది ఏమి లేక, ఎంపీలు తిరిగి వచ్చి, విషయం విజయసాయి రెడ్డికి వివరించారు. విజయసాయి రెడ్డికి, పిఎంఓలో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి, ఆయన అటు నుంచి ఏమైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయినా విదేశాల్లో ఒకసారి అరెస్ట్ చేసారు అంటే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చెయ్యరు. అరెస్ట్ చేసిన తరువాత, ఇష్టం వచ్చినట్టు విడిచి పెట్టరు. అందులోను ఇది రస్‌ అల్‌ ఖైమా దేశం ఇచ్చిన ఫిర్యాదు. మరి నిమ్మగడ్డను, వైసీపీ నేతలు, ఎలా మన దేశానికి తీసుకు వస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read