టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌‌గా తీసుకుంది. శనివారం రాత్రి కొడంగల్‌ నియోజకవర్గంలో పోలీసులతో అర్దారాత్రి దాడులు చేపించిన నేపధ్యంలో రేవంత్ ధర్నా చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చేస్తున్న పనుల పై దుమ్మెత్తి పోస్టు, ఈ నెల 4న కొడంగల్ బంద్ కు పిలుపిచ్చారు. అయితే, మరుసటి రోజు దాన్ని ఉపసమహరించుకున్నారు కూడా. అయితే, శనివారం భయాందోళనలు సృష్టించిన రేవంత్‌రెడ్డి.ని, ఈ నెల 4న సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకోవడంతో పాటు బంద్‌కు పిలుపునిచ్చి ఆందోళనకు గురిచేశారని ఎన్నికల కమిషన్‌‌కు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. రేవంత్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ఆదేశాలు జారీచేశారు.

revanth 03122018

రేవంత్‌రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఈసీ ఆదేశించింది. రేవంత్‌పై ఏం చర్యలు తీసుకున్నారో సోమవారంలోగా వివరణ ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు. అయితే అదే సందర్భంలో, తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేసిన సమయంలో ఎన్నికల ఖర్చుల వివరాలు, డైరీ లభించాయని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. మండలాల వారీగా నేతల కొనుగోళ్లు, పెట్టిన ఖర్చులు, మద్యం కొనుగోలుకు చేయాల్సిన అంచనాలు తదితర వివరాలతోపాటు రూ. 17.51 కోట్ల నగదు దొరికిందన్నారు. ఇప్పటి వరకు ఆయన సుమారు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఐటీ అధికారులే రూ. 5 కోట్లకు ఖర్చు తేల్చారని, దీని ఆధారంగా పట్నం నరేందర్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల అధికారులను కోరారు. కాని ఆ విషయం పై ఎటూ తెల్చిని ఈసీ, తన పై దాడులు జరుగుతున్నాయని, కేసీఆర్ పై విమర్శలు చేసినందుకు మాత్రం, వెంటనే రేవంత్ పై చర్యలు తీసుకోమనటం గమనార్హం..

 

revanth 03122018

అయితే రేపు కేసీఆర్ సభ, అదేరోజున నిరసన ర్యాలీలకు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ప్రకటన.. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సోమ, మంగళవారాల్లో కొడంగల్‌లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘నేనొక్కడినే.. కేసీఆర్‌కి మందీ మార్బలం, అధికారం, కమీషన్లు ఇచ్చే గుత్తేదారులు ఉన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్‌ ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కౌరవ సైన్యానికి మధ్య జరుగుతున్నాయి. ఒక్కరు కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా పాతాళానికి తొక్కుతా’నంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కోపంతో కొడంగల్‌కు తీరని అన్యాయం చేసిన కేసీఆర్‌ ముందుగా ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల మెడలు వంచి తాను తెచ్చుకున్న నారాయణ్‌పేట్‌ ఎత్తిపోతల వంటి అనేక పథకాలు అమలు కాకుండా అడ్డుపడ్డారని.. చివరకు విద్యాసంస్థలను కూడా ఏర్పాటుకానివ్వలేదని ఆరోపించారు. కోయిల్‌సాగర్‌ తాగునీటి పథకానికి రూ. 100 కోట్లు ఖర్చు చేసిన తర్వాత దాన్ని ప్రజలకు దూరం చేసిన దుర్మార్గులని రేవంత్ ఆరోపించారు.

ఒక పక్క పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ అట్టర్ ఫ్లోప్ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనల పై అనేక ఆంక్షలు పెడుతున్నారు. మొన్న చంద్రబాబ రోడ్ షో కు పర్మిషన్ ఇవ్వకపోవటం, చంద్రబాబు సభలకు తెరాస ప్రచార రధాలు పంపించి రెచ్చగొట్టటం లాంటి పనులు చేస్తున్న తెరాస ప్రభుత్వం, ఈ రోజు చంద్రబాబు, ఆజాద్ పాల్గున్న రోడ్ షో పై కూడా ఆంక్షలు పెట్టారు. ఆదివారం రాత్రి ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ సెంటర్‌‌లో చంద్రబాబు, గులాంనబీ ఆజాద్‌‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మొదట గులాంనబీ ఆజాద్ నియోజకవర్గ అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టగానే పోలీసులు వచ్చి వాహనాన్ని కదిలించాలని కోరారు.

azad 02122018 1

ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఇలా చేస్తున్నామని పోలీసులు ఇందుకు వివరణ కూడా ఇచ్చారు. దీంతో ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పోలీసులు అడ్డుకోవడంతో కాసింత ఆగ్రహానికి లోనైన ఆజాద్ ఆగ్రహానికి లోనైన అనుమతిచ్చి మధ్యలో ఇలా చేయడం సబబు కాదని మండిపడ్డారు. పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని, విధి నిర్వహణ సక్రమంగా చేయాలని ఆజాద్ పోలీసులను సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ 40, 50 ఏళ్లుగా తాను హైదరాబాద్‌లో వివిధ సభలకి వచ్చినప్పటికీ ఇంత మంది యువకులు పాల్గొన్న బహిరంగ సభను చూడలేదని ఆజాద్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌, బీజేపీని ఓడించాలన్న చైతన్యం ఇక్కడి ప్రజల్లో వచ్చిందని ఈ సభల ద్వారా రూఢీ అవుతోందని ఆయన అన్నారు.

azad 02122018 1

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అటువైపు మోదీ ఇటువైపు జూనియర్ మోదీ మాటలతోనే కడుపు నింపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 37 సంవత్సరాలుగా బద్ధవిరోధులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడ ప్రజాస్వామ్యం కోసం ఒక్కటయ్యామని తెలిపారు. తెలంగాణకు ఎందుకు వచ్చారు? ఏం పని? అని తండ్రీ కొడుకులు అడుగుతున్నారని, అనవసరంగా తిడుతున్నారని తానే ఏం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు తేవడం తప్పా? ఐటీ కంపెనీలు తేవడం తప్పా? అని నిలదీశారు. కేసీఆర్ తన హయాంలో ఒక్క ఫాంహౌజ్‌ని నిర్మించుకున్నారు గానీ, ఒక్క పనైనా చేపట్టారా? అని బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ వారు పూర్తి చేశారని బాబు తెలిపారు.

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, ట్విట్టర్‌లోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానంటే తాను అడ్డుపడ్డానా? అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానంటే అడ్డుతగిలానా? అంటూ నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి తాను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్కపనైనా చేశారా? అని ఆయన సవాల్ విసిరారు. ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అంటూ బాబు విమర్శించారు.

twitter 02122018

అవేవి చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసిన తనపై విమర్శలు చేయడం ఏమిటో తనకు అర్థం కావడంలేదని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్‌ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదని ఎద్దేవాచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే తప్పకుండా అచ్చేదిన్‌ వస్తుందని వ్యాఖ్యానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాకపోయినా కేసీఆర్‌ అడగరని, గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వకపోయినా నోరు మెదపరని, ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వకపోయినా నిలదీయారని, చివరికి ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోయినా తానకేమీ పట్టనట్టు కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని దీన్నిబట్టి చూస్తుంటే మోడీతో కేసీఆర్‌ ఎంత రహస్య ఒప్పందం చేశారో తెలుస్తుందని చెప్పారు

twitter 02122018

నేనెవరికీ భయపడను… భయపడే సమస్యే లేదు… నన్ను బెదిరించిన వాళ్ళంతా పతనమైపోయారు… ప్రధాని నరేంద్రమోడీ కూడా భయపెట్టేందుకు ప్రయత్నించాడు… ఐటీ, ఈడీని పంపించాడు… నాతో పెట్టుకుంటే కొరివితో పెట్టుకున్నట్టే… తస్మాత్‌ జాగ్రత్త అంటూ తెరాస అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ తనను బెదిరిస్తున్నారని, ఈ ఊ కదంపుడు హెచ్చరికలను తాను ఖాతరు చేయనని నరేంద్రమోడీకన్నా ముందే తాను ముఖ్యమంత్రిని అయ్యానని జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించానని చెప్పారు. గత ఎన్నికల్లో తెరాస అధినేత కేసీఆర్‌ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకే కొత్త హామీలు ఇచ్చేందుకు ఆయన బయలుదేరారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏసీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

ఎన్నికలు పూర్తయిన ఛత్తీస్‌గఢ్‌లో ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్‌ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. కొందరు అనధికార వ్యక్తులు... సీసీటీవీ కెమెరాలకు మరమ్మతుల పేరుతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల్లోకి ప్రవేశించి, అక్కడే ఉంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని స్ట్రాంగ్‌ రూంలోనూ గంటన్నరపాటు విద్యుత్‌ సరఫరాను, సీసీటీవీలను నిలిపివేశారని ఆరోపించింది. ఈ పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నందున ఈవీఎంల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, మనీశ్‌ తివారీ, పీఎల్‌ పునియా, వివేక్‌ ఠంకా, టీఎస్‌ సింగ్‌ దేవ్‌ల బృందం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

strong room 02122018 1

అనంతరం పునియా విలేకరులతో మాట్లాడుతూ... ఛత్తీస్‌గఢ్‌ విషయమై తాము ఫిర్యాదుల కంటే సూచనలే ఎక్కువ చేశామన్నారు. అక్కడ సీసీటీవీ కెమెరాలకు మరమ్మతుల పేరుతో కొందరు వ్యక్తులు స్ట్రాంగ్‌ రూముల్లోకి వచ్చి ఉంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారి విషయంలో నియంత్రణ విధించాలని కోరినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూముల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించేటప్పుడు గందరగోళం జరిగే ప్రమాదముందని, దానిపైనా దృష్టి సారించాలని సూచించినట్లు పునియా వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని రౌండ్లను ఒకేసారి చేపట్టకుండా... ఒకదాని తర్వాత ఒకటిగా లెక్కించి, ప్రతి రౌండ్‌ లెక్కలను అభ్యర్థులకు చెప్పిన తర్వాతే ముందుకెళ్లాలని కోరామన్నారు. ఆయా కేంద్రాల్లోకి జిల్లా కలెక్టర్లు ఫోన్లు తీసుకొని వెళ్లకుండా నిర్దేశించాలని అడిగామన్నారు.

strong room 02122018 1

అయితే భోపాల్‌ కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో శనివారం దాదాపు గంటన్నర పాటు సీసీకెమెరాలు, ఎల్‌ఈడీ తెరలు పనిచేయలేదు. దీంతో ఆందోళన చెందిన కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీ నేతలు.. దీనిపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. కలెక్టరేట్‌ పరిధిలో శనివారం ఉదయం గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్లే సీసీ కెమెరాలు పనిచేయలేదని తేల్చింది. అయితే భోపాల్‌లోని పాత జైలులోని స్ట్రాంగ్‌ రూమ్‌ గదికి తాళం వేయలేదంటూ కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును స్వీకరించిన ఈసీ దీనిపై విచారణ జరిపించింది. ప్రస్తుతం స్ట్రాంగ్‌ రూమ్‌ గది మూసేసి తాళం వేసి ఉందని ఈసీ వెల్లడించింది. అయితే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈవీఎంలకు భద్రత కరవైందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read