పోలవరం కేసు కీలక మలుపు తిరిగింది. ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్థతో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని స్పష్టంచేసింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అఫిడవిట్‌లో పేర్కొనాలని కేంద్రానికి సూచించింది. ప్రజాభిప్రాయానికి సంబంధించిన విధివిధానాలేంటో పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. పోలవరం నిర్మాణం పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

polavaram 29112018

మరో పక్క, మొన్న సోమవారం నాటికి, ప్రాజెక్టు పనులు 61.93 శాతం మేర పూర్తయ్యాయి. తవ్వకం పనులు 81 శాతం, కాంక్రీటు పనులు 48.55 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం, ఎడమ కాలువ పనులు 65.54 శాతం, రేడియల్‌ గేట్ ల పనులు 61.94 శాతం పూర్తయ్యాయి. గతవారం స్పిల్‌వే పైలట్‌ చానల్‌ అప్రోచ్‌ ఛానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌కు సంబంధించి 5.11 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు జరిగాయి. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్‌కు సంబంధించి 60 వేల క్యూబిక్‌ మీటర్ల వరకూ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. కాఫర్‌ డ్యాం పనులు 50,000 క్యూబిక్‌ మీటర్ల మేర జరిగాయి. పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తంలో కేంద్రం ఇంకా రూ.3,162.32 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా ప్రాజెక్టుపై రూ.15,025.45 కోట్లు ఖర్చు చెయ్యగా,.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,889.59 కోట్లు ఖర్చు అయ్యింది. ఇందులో ఇంకా 3162.32 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

polavaram 29112018

ఇది ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరులశాఖ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. 2017 ఆగస్ట్టులో సమర్పించిన సవరించిన అంచనాలను 14 నెలలుగా నాన్చుతూనే ఉంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఏడాది జులైలో స్వయానా పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఇక అంతా తాను చూసుకుంటానని ఇచ్చిన అభయం కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ అధికారులు దిల్లీకొస్తే పది రోజుల్లో అంతా తేల్చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. 2014నాటి ధరల ప్రకారం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తేనే ప్రాజెక్టు ముందుకు కదులుతుందన్న వాస్తవం తెలిసీ దిల్లీ పెద్దలు తాత్సారం చేస్తున్నారు. విడతల వారీగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు వచ్చి వెళ్లారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను కళ్లారా చూశారు. వచ్చినవాళ్లంతా ఏదో కొత్త సమాచారం అడగడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ప్రహసనంగా మారిపోయింది. తాజాగా 63వేల పేజీల సమాచారం అందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదో మెలిక పెడుతూనే ఉంది.

ప్రపంచంలో అతి పెద్ద సోలార్ పార్కగా కర్నూలు అవతరించబోతోంది. పార్క సామర్ధ్యం మేర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సౌరఫలకాల ఏర్పాటు పూర్తి కాబోతుంది. ఇప్పటికే 90% వరకు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్ల పూర్తయ్యాయి. తమిళనాడులోని రామనాధపురంలో అదానీ సంస్థ నిర్మించిన సోలార్ పార్కే(648 మెగావాట్లు) ఇప్పటి వరకూ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. కర్నూలు పార్క సామర్ధ్యం వెయ్యి మెగావాట్లు కావడంతో దాని కంటే పెద్దది కాబోతోంది. కర్నూల్ సోలార్ పార్కులో సన్ ఎడిసన్ అనే సంస్థ 2015 నవంబరులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండరును దక్కించుకుంది.

solar 29112018

యూనిట్ విధ్యత్ కు రూ.4.64 ధరను ఆ సంస్థ కోట్ చేసింది. దేశంలోనే ఇప్పటి వరకు అదే తక్కువ ధర. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సన్ ఎడిసన్ సౌర విద్యుత్ యూనిట్ల నిర్మాణం చేపట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సన్ ఎడిసన్ నుంచి ఈ బాధ్యతను గ్రీన్ కో అనే సంస్థ తీసుకుంది. సౌర విద్యుత్ యూనిట్ల పనులను ముమ్మరం చేసిన గ్రీన్ కో ఏప్రిల్ నాటికి 500 మెగావాట్ల స్థాపక సామర్థ్యాన్ని నెలకొల్పబోతోంది. 2015 డిసెంబరులో అదే ధర(యూనిట్ రూ. 4.64 పైసలు)కు సాఫ్ట్ బ్యాంకు కర్నూలు సౌర పార్కులోనే 350 మెగావాట్ల సౌర విద్యుత్ టెండరును చేజిక్కించుకుంది. టెండరు దక్ష్కించుకున్న దగ్గర నుంచీ దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలన్న తపనతోనే సాఫ్ట్ బ్యాంకు పని చేస్తూ వస్తోంది.

solar 29112018

అయితే కర్నూల్ ప్లాంట్ లో జరుగుతున్నా పనుల పై సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ, MarceloClaure, తన ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు. "This morning I had a chance to visit our solar park at #Karnool in #AndhraPradesh in #India I am so impressed by the magnitude of our project and by our amazing team" అంటూ ట్వీట్ చేసారు. కర్నూలులో 1000, అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జల, బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సులభం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాక బీడు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలకు అవకాశం కల్పించింది. ఏపీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ పనులను పర్యవేక్షిస్తోంది.

దళితుడ్ని సీఎం చేస్తానన్న హామీపైనా, లేదా యువకులకు ఉద్యోగాల కల్పనపైనా, లేదా డబుల్ బెడ్ రూమ్‌లను కట్టే దానిపైనా? ఏ విషయంలో తాను సీఎం కేసీఆర్‌కి అడ్డు పడ్డానో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కి సవాల్ విసిరారు. సనత్ నగర్‌లో ప్రజాకూటమి ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. టీఆర్‌ఎస్ గురించి చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని తిడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ రావాలి, అందరూ ఆనందంగా ఉండాలనేదే తన కోరిక అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని కాంక్షించారు. జీవితంలో ఎప్పుడూ చూడనంత స్పందన సనత్‌నగర్‌లో చూస్తున్నామన్నారు. కార్యకర్తల ఉత్సాహంతో తనకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయని, ఆకస్మిక తనిఖీల పేరిట వందల సార్లు హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగానని ఆయన గుర్తుచేశారు.

trs 29112018

తెలంగాణలో తాను అన్నింటికీ అడ్డంపడుతున్నానని కేసీఆర్‌ అంటున్నారని.. దళితుడిని సీఎం చేస్తానంటే తాను అడ్డుపడ్డానా? అని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. డీఎస్సీ వేస్తానంటే అడ్డుపడ్డానా?, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన చేస్తానంటే వద్దన్నానా? అని కేసీఆర్‌ను నిలదీశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఆశ చూపి ఒక్క ఇల్లు కట్టలేదని చంద్రబాబు విమర్శించారు. మహిళలకు మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుపడ్డానా? హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటే అడ్డపడ్డానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ అందరూ ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకరినొకరు విమర్శించుకుంటున్నట్టు నాటకాలాడుతున్నారని ఆయన చెప్పారు. ఒక పక్క బీజేపీతో, మరోపక్క ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ అంటకాగుతోందని, దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దేశం కోసమే టీడీపీ-కాంగ్రెస్‌ కలిసిందని ఆయన స్పష్టం చేశారు.

trs 29112018

పెత్తనం చేయడానికి వచ్చానని కేసీఆర్ విమర్శిస్తున్నారని, టీడీపీ పోటీ చేసేది కేవలం 13 సీట్లలోనే అయినప్పుడు పెత్తనం చేయడానికి తాను ఎందుకు ప్రయత్నిస్తానన్నారు. 37 సంవత్సరాలు టీడీపీ, కాంగ్రెస్ విపక్షంగా ఉన్నాయని, దేశ ప్రయోజనాల కోసం నేడు కలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతిచ్చారని, అలాగే ఐటీ రంగంలో గుర్తింపు వచ్చింది చంద్రబాబు వల్లేనని చెప్పారని, కానీ ఇప్పడు మాత్రం అధికారం కోసం తనను తిడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే కేసీఆర్ మోదీతో దోస్తీ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్ఎస్ గురించి తాను ఎన్నడైనా చెడుగా మాట్లాడానా? తానేం తప్పు చేశానని కేసీఆర్ సంస్కారం లేకుండా తిడుతున్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. హైదరాబాద్‌లో సంపద పెరిగిందంటే, అలాగే ఐటీ రంగంలో నగరానికి గుర్తింపు వచ్చిందంటే అది చంద్రబాబే అని కవిత, కేటీఆర్ అన్న మాట వాస్తవం కాదా? అని చంద్రబాబు గుర్తుచేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కాకను మరింత పెంచుతూ ప్రజాకూటమి పోరుకేక పెట్టింది. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక్క వేదికనెక్కారు. జాతీయ కూటమికి తెలంగాణలో నాంది పలికారు. హైదరాబాద్ మహానగరం అందరిదీ అని.. ఈ నగరానికి ఓ విశిష్టమైన చరిత్ర ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. హైదరాబాద్‌ ప్రజలు కలిసిమెలిసి ప్రేమతో ఉంటారని.. ఐక్యతకు ఇదో చిహ్నంగా నిలుస్తుందని కితాబిచ్చారు. కలిసి మెలిసి ఉన్న ప్రజల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ విభేదాలు సృష్టిస్తారని మండిపడ్డారు. బుధవారం అమీర్‌పేటలో నిర్వహించిన మహాకూటమి ఎన్నికల ప్రచార రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 2004 ఎన్నికల సమయంలో చంద్రబాబు బాగా పనిచేశారని తాను చెప్పానని, మా వాళ్ళు విమర్శలు చేస్తుంటే, ఆయన చేసిన సేవకు గుర్తింపు ఇవ్వని అని చెప్పినట్టు, ఈ సందర్భంగా రాహుల్‌ గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారని చెప్పారు.

rahul 29112018 2

"జాతీయ ప్రయోజనాల కోసమే తెదేపాతో జత కట్టాం. 2004 సమయంలో అప్పుడున్న సీఎం చంద్రబాబు బాగా పనిచేశారంటూ అభినందించి సరైన గౌరవమిచ్చాం. కాంగ్రెస్‌, తెదేపా హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది. ప్రపంచంలో హైదరాబాద్‌ ఓ వెలుగు వెలిగిపోతుందంటే దానికి కారణం ఇక్కడి ప్రజల ఐకమత్యమే. ప్రజలు కలిసి, మెలిసి ఉంటే మోదీ చూసీ సహించలేరు. న్యాయమూర్తి కేసులో భాజపా జాతీయాధ్యక్షుడి పేరు వచ్చిందని.. సాక్షాత్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మీడియా ముందుకు వచ్చి మేం పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారంటే ఆర్బీఐ, సీబీఐ తదితర సంస్థల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువతకు ఉద్యోగాలివ్వకుండా అనిల్‌ అంబానీ జేబులో రూ.30 వేల కోట్లు వేశారు. రఫేల్‌ కుంభకోణంపై విచారణ జరిపిస్తారనే భయంతోనే ప్రణాళికా ప్రకారం సీబీఐని నిర్వీర్యం చేశారు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

rahul 29112018 3

హైదరాబాద్‌ అభివృద్ధి గురించి కేసీఆర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర నిధులన్నీ ఒక కుటుంబం చేతికే వెళ్లాయని ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలన్నీ భాజపా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. న్యాయమూర్తి హత్య కేసులో భాజపా అధ్యక్షుడి పేరు వచ్చిందని, భాజపా వల్లే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారని విమర్శించారు. ప్రజలకు వస్తాయనుకున్న అచ్చేదిన్‌.. ప్రైవేటు కంపెనీలకు మాత్రమే వచ్చాయన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. రఫేల్‌ డీల్‌పై ఫ్రాన్స్‌ అధ్యక్షుడే చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisements

Latest Articles

Most Read