ఆంధ్రప్రదేశ్ లో చీమ చిటుక్కు మన్నా, అదేదో బ్రహ్మాండం బద్దలు అయిపోయినట్టు మీడియా హడావడి చేస్తూ ఉండేది. తెలంగాణాలో, ఘోర ప్రమాదాలు జరిగినా, 62 మంది చనిపోయినా, రోడ్ల పై వరుస పెట్టి పరువు హత్యలు జరిగినా, కనీసం ప్రభుత్వాన్ని ఎదురించేలేని పిరికి వాళ్ళులా మీడియా తయారయ్యారు. కేసీఆర్ మీద ఒక్కటంటే ఒక్క నెగటివ్ వార్తా రాసే దమ్ము లేదు. అయితే, తెలంగాణా ప్రజల్లో మాత్రం, కేసీఆర్ పై పూర్తి వ్యతిరేకత ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలు, తెరాస నాయకులకి ఎలా చుక్కలు చూపిస్తున్నారో చూసాం. దాదపుగా కేసీఆర్ ఓడిపోతున్నాడు అనే వాతావరణం వచ్చేసింది. ఇది రోజు రొజుకి బలపడుతూ ఉండటంతో, ఇక మీడియా కూడా ఓపెన్ అయినట్టు ఉంది. అందుకే మొదటి సారి కేసీఆర్ పై వచ్చిన నెగటివ్ వార్తాని పెద్ద ఎత్తున ఈ రోజు ప్రచారం చేసాయి.

aadhar 26092018 3

తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించే అవకాశం ఉందని.. ఏబీపీ న్యూస్‌, రిపబ్లిక్‌ టీవీ కోసం సీ-వోటర్‌ (సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్స్‌ అండ్‌ ట్రెండ్స్‌) చేసిన సర్వేలో తేలింది. ఇదే విషయం ఈ రోజు అన్ని పత్రికలు, చానల్స్ ప్రధానంగా వెయ్యటంతో, మన మీడియాకి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్‌-టీడీపీ కూటమికి 64 సీట్లతో సాధారణ మెజారిటీ వస్తుందని.. టీఆర్‌ఎస్‌కు 42 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక తేల్చింది. అలాగే, బీజేపీకి 4 సీట్లు.. ఇతరులకు 9 సీట్లు వచ్చే చాన్స్‌ ఉంది. ఓట్ల శాతం చూస్తే, మహాకూటమికి 33.9 శాతం ఓట్లు.. టీఆర్‌ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక తేల్చింది.

\

aadhar 26092018 3

ఇప్పటివరకూ తెలంగాణపై వచ్చిన అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్సే గెలుస్తుందని చెబుతుండగా.. మహాకూటమి గెలుస్తుందని తేల్చిన మొదటి సర్వే ఇదే! ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 27 శాతం మంది వేరెవరైనా అయితే బాగుంటుంది/ఇంకా తేల్చుకోలేదు అని చెప్పారు. 22.6 శాతం మంది జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా బలపరచగా.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. తెలంగాణలో పరిస్థితిని ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తేల్చిచెప్పింది.

దాడిలో గాయపడ్డ జగన్‌ను విమానంలో ప్రయాణించేందుకు ఎలా అనుమతించారు? అలా అనుమతించే ముందు మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారా? దానిని ఎవరు జారీ చేశారు? రక్తపు మరకలు అంటిన జగన్‌ చొక్కాను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అసలు... సీఐఎ్‌సఎఫ్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వీవీఐపీ లాంజ్‌లో దాడి జరిగితే సీఐఎ్‌సఎఫ్‌ ఏం చేస్తోంది?... అంటూ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కె.లక్ష్మణ్‌పై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని... సీఐఎ్‌సఎఫ్‌ నివేదిక, ఎయిర్‌పోర్టు అథార్టీ నిబంధనలు వివరించాలని ఆదేశించింది. అలాగే... సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద ఏపీ పోలీసులకు జగన్‌ వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవరులో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

aadi 07092018

దీంతో జగన్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ఏకంగా కోర్ట్ జోక్యం చేసుకుని, వాంగ్మూలం ఇవ్వమని కోరటంతో, ఏం చెయ్యాలని అనే దాని పై లోటస్ పాండ్ లో తన లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు. నాకు ఇష్టం లేకపోతే, కోర్ట్ కు ఏమి సంబంధం, మనం ఈ విషయంలో పై కోర్ట్ కి వెళ్దాం అని జగన్ చెప్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ విమానాశ్రయంలో గతనెల 25న తనపై జరిగిన దాడిపై ఏపీ ప్రభుత్వ అధీనంలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించాలని జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, బి.అనిల్‌ కుమార్‌ కూడా ఇదే తరహా వ్యాజ్యాలు వేశారు. ఇవి శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు.

aadi 07092018

అత్యంత రక్షణ ప్రాంతమైన వీఐపీ లాంజ్‌లో దాడి జరిగాక గాయపడ్డ వ్యక్తిని విమానంలో ప్రయాణించడానికి అధికారులు ఎలా అనుమతిచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యుల అనుమతి పొందాక ప్రయాణానికి ఎయిర్‌పోర్టు అథార్టీ అధికారులు అనుమతిచ్చారా, ఇలాంటి సందర్భాల్లో నిబంధనలు ఏమి చెబుతున్నాయో చెప్పాలని ఏఎస్‌జీకి స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ దాడి ఘటనను సానుభూతి పొందడం కోసం జరిగిందని జగన్‌ తరఫు న్యాయవాది చేసిన వాదనలపై స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రికి వాక్కు స్వాతంత్య్రం హక్కు ఉంది కదా.. ఆయన అభిప్రాయాన్ని తెలిపి ఉంటారు...’ అని వ్యాఖ్యానించింది. దర్యాప్తు విషయంలో పోలీసులు తమ పని తాము చేసుకుపోతుంటే తప్పేమి ఉందని పేర్కొంది. పోలీసులకు వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.

చంద్రబాబుతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. కేంద్రంలోని నియంతృత్వ భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించే ఏకైక లక్ష్యంతో లౌకిక శక్తులన్నీ కలసి ఏర్పాటు చేస్తున్న మహా కూటమికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య సమగ్రతను భాజపా పూర్తిగా ధ్వంసం చేసిందని వ్యాఖ్యానించారు. ఇది స్టాలిన్ ట్వీట్ "Had a great meeting with @ncbn today. I extend my full support to a grand alliance of secular forces with the single goal of overthrowing a fascist BJP that has completely destroyed the inclusive nature of our democracy."

cbn stalin 09112018 2

బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. గురువారం బెంగళూరులో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయిన చంద్రబాబు శుక్రవారం రాత్రి చెన్నైలో స్టాలిన్‌తో సమావేశమయ్యారు. రాత్రి 7.20కి స్థానిక ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసానికి చేరుకుని.. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు, స్టాలిన్‌ కలిసి విలేకరులతో మాట్లాడారు. ముందుగా స్టాలిన్‌ మాట్లాడారు. ‘రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు సమైక్య కూటమిని ఏర్పాటు చేయడానికి బాబు పూనుకోవడం హర్షణీయం. ఇదివరకే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో భావసారూప్యం ఉన్న ప్రతిపక్షాలతో కలిసి బీజేపీని కూలదోయాలని నేను కూడా కోరుకుంటున్నాను.

cbn stalin 09112018 3

మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను, సీబీఐ, ఆర్బీఐలను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు. వాటిని బెదిరించి నిర్వీర్యం చేస్తోంది’ అని ఆరోపించారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం చంద్రబాబు డీఎంకే మద్దతు కోరారని, తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పామన్నారు. త్వరలో ఓ ఐక్య వేదిక సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారని, ఆ సభకు తాము కూడా వెళ్తామని, ఆయనతో కలిసి నడుస్తామని పేర్కొన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంతో కూటమి ఏర్పాటు కావడం తథ్యమన్నారు. కరుణానిధి కూడా మతవాద వ్యతిరేక కూటమి ఉండాలని గట్టిగా కోరుకునేవారని స్టాలిన్‌ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత‌లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ హరీష్ కు ఈసీ నోటీసులు అంద‌జేసింది. గత నెల రోజులుగా నోటికి ఇష్టం వచ్చినట్టు తెరాస నేతలు, చంద్రబాబు పై మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏకంగా పబ్లిక్ మీటింగ్స్ లో చంద్రబాబు పై బూతులు తిడుతూ ప్రసంగాలు చేసారు. ఇది చుసిన తెరాస నేతలు మరింత రెచ్చిపోయి, చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పై రాజకీయ విమర్శలు కాకుండా, పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉండటంతో, టిడిపి నాయకులు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు.

kcr 10112018

తెదేపా అధినేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు రాజకీయ దురుద్దేశంతో పలు వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు హరీశ్‌ లేఖ రాసి విడుదల చేసిన సమయంలో చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రావడం ఆయనకు ఇష్టం లేదని హరీశ్‌రావు పేర్కొనడానికి తెదేపా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంత్రి మండవ వెంకటేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి కాశీనాథ్‌, అజ్మీరా రాజునాయక్‌లతో కలసి శుక్రవారం రేవూరి ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలను బాబు అడ్డుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

kcr 10112018

ఎన్నికల కోసం ఈ సమయంలో సెంటిమెంటును రాజేసి చంద్రబాబును తెలంగాణ శత్రువుగా చూపాలని హరీశ్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాను చెప్పే మాటలను కేసీఆర్‌ నమ్మాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇలా బాబు పై మంత్రి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆయన పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రేవూరి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Latest Articles

Most Read