బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రక్రియలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు, మరింత ఊతంగా, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్‌కు రెండు సార్లు సీఎంగా పనిచేసిన అశోక్ గెహ్లాట్ అమరావతి రానున్నారు. రేపు(శనివారం) మధ్యాహ్నం అశోక్ గెహ్లాట్ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్తారు. అక్కడ గేట్ వే హోటల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత అమరావతిలోని చంద్రబాబు నివాసంలో వారిద్దరూ సమావేశం కానున్నారు.

ashol 09112018 2

ఇటీవలే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణ మీద చర్చించారు. రాహుల్ దూతగా చంద్రబాబుతో మాట్లాడేందుకు అశోక్ గెహ్లాట్ శనివారం అమరావతి వస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత దేశంలోని ప్రాంతీయ పార్టీలతోపాటు మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు తాజాగా బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. ఆ తర్వాత చెన్నై వెళ్లి స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

ashol 09112018 3

ఢిల్లీ పర్యటనలో శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, కేజ్రీవాల్‌, ఫరూక్‌ అబ్దుల్లా తదితర పార్టీల నాయకుల్ని కలిసి.. మోదీ వ్యతిరేక కూటమిలోకి తెచ్చేందుకు అంగీకరింపజేసిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. దక్షిణాదిలో ఉన్న రెండు కీలక ప్రాంతీయ పార్టీలతో చంద్రబాబు చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో చర్చించడానికి రావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. బెంగళూరు, చెన్నై సమావేశాల్లో ఏమేం చర్చించారు? బీజేపీయేతర కూటమిని మరింత బలోపేతం చేయడానికి ఏమేం చేయాలనే అంశం అశోక్ గెహ్లాట్, చంద్రబాబు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్ రాక విషయం ఏపీ కాంగ్రెస్ కంటే ముందే టీడీపీకి సమాచారం అందడం ఇక్కడ విశేషం.

ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు, ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు సమాచారం. ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. నిబంధనల ప్రకారం సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పిస్తామని చెప్పిన సీఎం.. ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ap cabinet 9112018 2

ప్రస్తుతానికి ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. దీంతో రెండు ఈ రెండు స్థానాలను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనారిటీల్లో రాయలసీమకు చెందిన నేతకే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఫరూక్‌ మండలి ఛైర్మన్‌గా ఉన్నందున ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. తెదేపాలో ముస్లిం మైనార్టీ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ap cabinet 9112018 3

ఒకరు ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫరూక్‌కే మెరుగైన అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీల విషయానికి వస్తే.. పోలవరం ఎమ్మెల్యే, అలాగే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన వేళ ఆయన తనయుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.

జగన్ పై కోడి కత్తి దాడి కేసులో ప్రజలందరూ లేవనెత్తిన ప్రశ్నలే, ఈ రోజు కోర్ట్ కూడా అడిగి, మరో ట్విస్ట్ ఇచ్చింది. జగన్ పై కోడి కత్తి దాడి జరిగింది విశాఖ ఎయిర్ పోర్ట్ లో అని అందరికీ తెలిసిందే. అది కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇదే విషయం కోర్ట్ కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఇలాంటి చోట జగన్ పై దాడి కేసులో హత్యా యత్నం జరిగిందన్నప్పుడు గాయపడిన వ్యక్తిని విమానం ఎందుకు ఎక్కనిచ్చారు? వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళనిచ్చారు ? గాయమైన వ్యక్తిని ఎవరి ఆదేశాల ప్రకారం ఫ్లిట్ ఎక్కించారు అని కోర్ట్ ప్రశ్నించింది.

jaganattack 09112018 2

ఈ విషయంలో నిబంధనలు ఏమి చెప్తున్నాయో చెప్పాలని, దీని పై పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్ట్ కోరింది. ఈ ప్రశ్నలకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం కాని, CISF కాని, ఎయిర్ పోర్ట్ అథారటీ కాని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి అనుమానాలే ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనేట్టితే, చంద్రబాబు హేళన చేస్తున్నారని జగన్, పవన్, బీజేపీ విమర్శలు చేసాయి. ఇప్పుడు కోర్ట్ కూడా అదే విషయం అడిగింది. మరో పక్క, వాదనలు విన్న కోర్టు 161 సీఆర్పీసీ కింద, జగన్ మోహన్ రెడ్డి, పోలీసుల విచారణకు ఎందుకు సహకరించలేదని ప్రశ్నించింది.

jaganattack 09112018 3

ఏపీ పోలీసుల దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదని, థర్డ్ పార్టీ ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించాలని జగన్ తరపు న్యాయవాది తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన సిట్ నివేదికను వచ్చే మంగళవారానికి సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. శుక్రవారం పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా జగన్ తరపు న్యాయవాది సివి.మోహన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన జె.శ్రీనివాస్‌కు విశాఖ మూడో మెట్రో పాలిటన్‌ న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. ఈ నెల 23 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, రాజకీయాలు మాట్లాడితే, ఎక్కువగా చంద్రబాబుని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారు. చాలా సార్లు యుట్యూబ్ వీడియోల్లో కూడా చంద్రబాబుని తిడుతూ ఉండటం చూసాం. అయితే నిన్న ఒక టీవీ ఛానల్ కు బ్రేక్ చేసిన సెన్సేషనల్ స్టొరీలో, తమ్మారెడ్డి భరద్వాజ టిడిపి నేతలు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ ఆపరేషన్ గరుడ మర్చిపోక ముందే, ఇప్పుడు తమ్మారెడ్డి 'ఆపరేషన్ బీ' అనేది కేంద్ర ప్రభుత్వం మొదలు పెడుతుందని చెప్పి, అందరినీ ఆశ్చర్య పరిచారు.

tammareddy 09112018 2

కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత... ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తన వరకు వచ్చాయని ఆయన తెలిపారు. రానున్న 15 రోజుల్లో టీడీపీ సానుభూతిపరులైన ప్రముఖులు, తెలంగాణ, ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఈ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దాడులు రేపట్నుంచి 15 రోజుల్లోగా జరగవచ్చని చెప్పారు.

tammareddy 09112018 3

ఏపీలోని దాదాపు 30 మంది ప్రముఖులపై ఐటీ దాడులకు స్కెచ్‌ వేశారని వారి పేర్లు కూడా చెప్పారు. ఐటీ టార్గెట్ లో ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఎంపీలు సీఎం రమేష్‌, మురళీ మోహన్‌ ను కూడా టార్గెట్ చేసారని చెప్పారు. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్‌ కూడా ఈ లిస్టు లో ఉన్నారని చెప్పారు. కేఎల్‌ యూనివర్సిటీ అధినేతపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని, ఐటీ టార్గెట్‌లో విజయవాడలోని, డీవీ మేనర్‌, గేట్‌వే హోటళ్ల అధినేతలు కూడా ఉన్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. దీని పై ఎటువంటి విచారణకైనా సిద్ధమని, తనను విచారిస్తే, ఈ విషయం ఎలా తెలిసిందో, దర్యాప్తు సంస్థలకి చెప్తానని చెప్పారు. చంద్రబాబుని విమర్శిస్తూనే ఉంటానని, కాని, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పై, ఢిల్లీ వాళ్ళు కుట్రలు చేస్తా ఉంటే, ఆ కుట్రలు నాకు తెలిస్తే, ప్రజలకు చెప్పకుండా ఉండలేనని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read