5 ఏళ్ళు పాలించమంటే, 4 ఏళ్ళకే చాప చుట్టేసి, ఎందుకు చుట్టేసారో ప్రజలకు సరైన వివరణ ఇవ్వకుండా, ముందస్తు ఎన్నికలు అన్నాడు కేసీఆర్. సరే, ఈ 4 ఏళ్ళలో తాను ఏమి చేసాడో చెప్తున్నాడా అంటే, అదేమీ లేకుండా, కేవలం చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నాడు. అదేంటి చంద్రబాబు 0.01% ఓట్లు ఉన్నాడు అని కేసీఆర్ అన్నాడు కదా, మరి చంద్రబాబు మీద పడి ఏడవటం ఎందుకు అంటే, ఒక్కడి దగ్గర సమాధానం లేదు. కేసీఆర్ పరిపాలనలో చెప్పుకోవటానికి ఏమి లేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ని అంటే పెద్దగా ఉపయోగం ఉండదు. అదే చంద్రబాబుని బూచిగా చూపిస్తే, ఓట్లు రాలతాయని కేసీఆర్ దిక్కుమాలని ఆలోచన. అందుకే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును ప్రధానంగా టార్గెట్‌ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

kcr 09112018

చంద్రబాబుపై తాము చేస్తున్న రాజకీయ విమర్శలు తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లను ప్రభావితం చేసే అంశాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస నేతలు చెప్తున్నారు. ఇటీవల కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు కాంగ్రెస్‌, టీడీపీపైనే కాకుండా, చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రతి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో.. చంద్రబాబును విమర్శిస్తే.. తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లు టీఆర్‌ఎ్‌సకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. దీని పై పార్టీ కేసిఆర్ క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించడంతో పాటు, జగన్, పవన్ నుంచి కూడా హామీ పొందినట్టు తెలుస్తుంది.

kcr 09112018

రాష్ట్రంలో సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల నుంచి కేసీఆర్‌ స్వయంగా ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. స్థానికంగా పార్టీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. అంతే కాదు, జగన్, పవన్ కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పారని, ఇవన్నీ చుసిన తరువాత , చంద్రబాబును విమర్శిస్తే సీమాంధ్ర ఓటర్లు గంపగుత్తగా టీఆర్‌ఎ్‌సకి దూరం కాబోరనే అభిప్రాయానికి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే, గత రెండు, మూడు రోజులుగా చంద్ర బాబుపై విరుచుకుపడటాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు తిరిగి కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చూద్దాం, కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నాడో, లేక తెలంగాణా ప్రజలు సరైన నిర్ణయం తీసుకొంటారో.

సోషల్‌ మీడియా సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌ అమరావతి 2018 కార్యక్రమం సందడి శుక్రవారం నుంచి విజయవాడలో ఆరంభం కాబోతోంది. కరీనాకపూర్‌, సమంత, దేవిశ్రీప్రసాద్‌, వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌, కుష్బు, స్వరాభాస్కర్‌, ప్రణీత సహా అనేక మంది ప్రముఖులు విజయవాడకు తరలిరానున్నారు. యూట్యూబ్‌లో వివిధ రంగాలకు సంబంధించి ఈ ఏడాది ఉత్తమ ప్రతిభచూపిన వారికి అవార్డులను అందజేయనున్నారు. సెలబ్రిటీ విభాగంలోనూ అవార్డులను అందజేస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోషల్‌ మీడియా సమ్మిట్‌ ఉంటుంది.

summit 09112018 2

దీనిలో భాగంగా.. ఆయా రంగాల్లోని ప్రముఖులు మాట్లాడతారు. మాజీ క్రికెటర్‌ వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ క్రీడల్లో సోషల్‌ మీడియా పాత్రపై వివరిస్తారు. సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ప్రముఖ బాలీవుడ్‌ నటి.. స్వరాభాస్కర్‌ ప్రసంగిస్తారు. పర్యాటక రంగంపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉందనేది ఏపీ టూరిజం అథారిటీ సీఈవో హిమాన్షుశుక్లా వివరిస్తారు. ఎన్నికలు, రాజకీయాలపై సోషల్‌ మీడియా పాత్రపై ప్రముఖ నటి కుష్భు మాట్లాడతారు. భవిష్యత్తులో సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి మార్పు భారతదేశంలో రాబోతోందనే విషయంపైనా పలువురు వక్తలు మాట్లాడతారు. తొలి రోజు 15మంది ప్రముఖులు పాల్గొని సోషల్‌ మీడియా ప్రభావంపై ప్రసంగిస్తారు.

summit 09112018 3

సోషల్‌ మీడియా సమ్మిట్‌లో రెండో రోజు సాయంత్రం 6గంటల నుంచి కార్యక్రమం ఆరంభమవుతుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవ్వనున్నారు. సోషల్‌ మీడియాలో రాణిస్తున్న 40 మందికి అవార్డులను ముఖ్యమంత్రి చేతులమీదుగా అందజేయనున్నారు. బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కరీనాకపూర్‌తో పాటూ సమంత అక్కినేని, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లకు సెలబ్రిటీ విభాగంలో అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేయనున్నారు. గతేడాది జరిగిన సోషల్‌ మీడియా సమ్మిట్‌లో దీపిక పదుకొణె, దగ్గుబాటి రానా, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు అవార్డులను అందజేశారు.

జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో గుచ్చిన సంగతి తెలిసిందే. 0.5 cm లోతులో గుచ్చితే, జగన్ 20 రోజులుగా రెస్ట్ లో ఉన్నారు. ఇది ఇలా ఉంచితే, ఈ కేసు పై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో పక్క, జగన్ కూడా కోర్ట్ లో కేసు వేసారు. నాకు సిబిఐ దర్యాప్తు కావాలని కేసు వేసారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ దాడిపై విచారణ జరిపించాలని జగన్‌, ఆయన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి వేర్వేరు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అలాగే విమానాశ్రయాల్లో భద్రతపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అనిల్‌కుమార్‌ మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవి గురువారం చీఫ్‌ జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.

jagan 09112018 2

దీని పై నిన్న విచారణ సందర్భంలో, విమానాశ్రయంలో దాడికి సంబంధించిన దర్యాప్తునకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రక్తం మరకలున్న చొక్కా ఇంత వరకూ దర్యాప్తు అధికారులకు అందజేయలేదని.. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద వాంగ్మూలం ఇవ్వడానికీ నిరాకరించారని తెలిపారు. పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుని వచ్చే మంగళవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఇప్పటికే ఆలస్యం జరిగినందున వెంటనే విచారణ జరిపించాలని హైకోర్టును జగన్‌ తరఫు న్యాయవాది కోరారు.

jagan 09112018 2

జగన్‌పై దాడిని చిన్నదిగా డీజీపీ మీడియాకు చెప్పారని, వైసీపీ కార్యకర్తే సానుభూతి కోసం దాడి చేశారని సీఎం ప్రకటించారని, ఎటువంటి విచారణ జరగక మునుపే ఇలాంటి ప్రకటనల వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోయిందని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అయితే బాధితుడే కోర్టును ఆశ్రయించాక ఇక ప్రజాహిత వ్యాజ్యం ఎందుకని సీజే ప్రశ్నించారు. దర్యాప్తు తీరుపై శుక్రవారం నివేదిక అందజేయాలని ఏజీని ఆదేశించారు. అయితే దర్యాప్తు నివేదికను విశాఖ నుంచి తేవలసి ఉందని.. సోమవారం లేదా మంగళవారం కోర్టుకు అందజేయగలమని ఆయన బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదావేసింది.

ఇనుప ఖనిజం అక్రమ రవాణా, మనీ లాండరింగ్‌ కేసులు, రాష్ట్రాల సరిహద్దుల చెరిపేశాడనే ఆరోపణలు తదితర కేసుల్లో కూరుకుపోయిన పీకల్లోతు కష్టాల్లో ఉండే గాలి జనార్దన్‌రెడ్డి తాజాగా మరో కేసు మెడకు తగిలించుకున్నారు. ఒక ప్రైవేటు కంపెనీ మనీ లాండరింగ్‌లో దాదాపు వేల కోట్ల మేరకు ప్రజలను మోసం చేస్తే దాన్ని సీసీబీ గుర్తించి ఆ కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు పూనుకున్న సమయంలో గాలి జనార్దర్‌రెడ్డి తన జాదూతనం ప్రదర్శించారు. తాజాగా ఈ కేసులో ఇరుక్కున్న గాలి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని సీసీబీ పోలీసులు తెలిపారు.

gali 08112018 2

గాలి జనార్దనరెడ్డి ఆచూకీ కోసం సీసీబీ పోలీస్ అధికారి మంజునాథ్ నేతృత్వంలో 8 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గురువారం ఉదయం బళ్లారికి చేరుకున్నారు. మొదట ఇన్నా రెడ్డి కాలనీలో ఉన్న గాలి ఇంటికి వెళ్లి చూశారు. అక్కడి నుంచి బెళగల్లు గ్రాస్ లోని ఓ అపార్టుమెంట్లో అలీ ఖాన్ ఇంటినీ పరిశీలించారు. ఉదయం 8 గంటలకు హవంబావిలో ఉన్న గాలి ప్రధాన నివాసానికి వచ్చారు. వాచ్మన్ సాయంతో తాళం తీయించి లోనికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న గాలి జనార్ధన రెడ్డి మామ పరమేశ్వర రెడ్డి, అత్త నాగ లక్ష్మమ్మ అక్కడికి చేరుకున్నారు.

gali 08112018 3

మరో 10 నిమి షాల్లో గాలి మిత్రుడు- మొళకాల్మూరు శాసనస భ్యుడు బి. శ్రీరాములు (భాజపా), రాయదుర్గం మాజీ శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి (వైకాపా) అక్కడికి వచ్చారు. మరో వాహనంలో కొందరు మహిళలు ప్రవేశించారు. 6 గంటలపాటు పోలీసులు ఏకబికిన ఇల్లంతా గాలించారు. ఇంటి పైభాగంలో ఉన్న ట్యాంక్, పడక గదులు, స్నానపు గదులు, స్టోర్లను పరిశీలించారు. అక్కడి నుంచి ఓబుళాపురం గనుల సంస్థ (మైనింగ్ కంపెనీ) కార్యాలయం, దాని ఎదురుగా ఉన్న ఏఎంసీ గనుల కార్యాలయాలనూ అధికారులు తనిఖీ చేశారు. ఏయే దస్త్రాలు స్వాధీనం చేసుకున్నదీ వెల్లడి కాలేదు. ఇది ఇలాఉండగా, కమలదళం మాత్రం గాలి జనార్దన్‌రెడ్డి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, బీజేపీ నాయకులుకూడా ఆయన దూరంగా ఉండాలని స్వయానా పార్టీ ఆధినాయకుడు అమిత్‌షా పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read