తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని కలవడానికి మంగళవారం అమరావతి వెళ్లిన రమ్యారావు ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కానుండటం, ఆ కూటమిలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యారావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమ్యారావు డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీనంగర్ జిల్లా నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

kcr 08112018 2

అయితే ఇటీవల కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరితో ఆమో మనస్తాపం చెంది.. కరీంగనర్ లో జరిగిన ఓ సమావేశం నుంచి అర్ధంరంగా నిష్ర్కమించారు. ఈ పరిస్ధితుల్లో ఆమె అమరావతి వెళ్లి చంద్రబాబును కలవడం... తనకు టిక్కెట్ వచ్చేలా సహకరించమని కోరండం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీలో రమ్య విషయం ప్రస్తావించారు. ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే .. రెచ్చగొట్టినట్టు ఉంటుందని అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తెలంగాణ టీడీపీ నేతలు ఏకీభవించారు.

kcr 08112018 3

మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో ఈ రోజు బాబును కలుసుకున్న నేతలు తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అమరావతిలో ఈ రోజు బాబుతో సమావేశమైన అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రతిపక్షాలను ఏకం చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ రెండు అంకెల సీట్లను గెలుచుకుంటుందని రమణ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి, బాల్య స్నేహితుడు, వైఎస్ ఫ్యామిలీ అత్యంత సన్నిహితుడు, అనేక కేసుల్లో క్రిమినల్ గా ఉన్న మంగలి కృష్ణ కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లో ఈ కిడ్నాప్ జరిగింది. ఇటీవల కృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో భూ వివాదంలో ఓ కేసు నమోదైంది. కృష్ణ నాంపల్లి కోర్టుకు గురువారం హాజరయ్యాడు. అయితే ఈ కేసులో అతడికి కోర్టు బయిల్ మంజూరు చేసింది. బెయిల్ తీసుకున్న కృష్ణ అనుచరులతో కలిసి ద్విచక్రవాహనంపై (టీఎస్12 సీపీ 1598) బయలుదేరారు. కృష్ణ వాహనాన్ని వెంబడించిన దుంగడులు అనుచరులను కొట్టి కృష్ణను అపహరించారని అనుచరులు చెబుతున్నారు.

krishna 08112018 2

ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణను టాస్క్ ఫోర్సు పోలీసులు తీసుకెళ్లారా? లేక ఇతర క్రిమినల్ ముఠాలు తీసుకెళ్లారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మద్దెలచెరువు సూరి హత్యకేసులో కూడా మంగలి కృష్ణ ఉన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఉన్న సూరి, అతనికి సహకరించిన అనేక మంది, సీరియల్ మర్డర్ లు జరిగిన దరిమిలా, ఈ కిడ్నాప్ కూడా, ఏమన్నా ఆ దిశగా జరిగిందా అనేది కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. మొన్న జగన్ మోహన్ రెడ్డిని కోడి కత్తితో గుచ్చినప్పుడు, జగన్ హైదరాబాద్ లోని హాస్పిటల్ లో జాయిన్ అయిన సందర్భంలో కూడా, కృష్ణ హాస్పిటల్ లో, రోజా, అనిల్ తో పాటు, మిగతా నాయకులతో చలాకీగా గడిపిన వీడియో కూడా అందరూ చూసారు. మొత్తానికి, ఈ సస్పన్స్ వీడే దాకా, పోలీసులు తీసుకువెళ్ళారా లేక, ఎవరన్నా పాత కక్షలతో చేసారా అనే విషయం ఏమిటో తెలియదు.

మోడీ-షా పరిపాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ వంతు వచ్చింది. ఈ రోజు నోట్లు రద్దు అయ్యి, రెండు ఏళ్ళు అయిన సందర్భంలో, ఇది మోడీ ఖాతాలో మరో విజయం అనుకోవాలేమో. ఆర్బీఐ, ఆర్థిక శాఖకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈనెల 19న జరుగనున్న ఆర్బీఐ కేంద్ర బోర్డు సమావేశమే సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చివరి సమవేశం కానుందా? ఆ రోజే ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం తెలెత్తిన విభేదాలు మరింత ముదిరిన పక్షంలో నవంబర్ 19నే ఉర్జిత్ రాజీనామా చేయవచ్చని ఆ సంస్థ వర్గాలను ఉటింకిస్తూ ఆన్‌లైన్ ఫైనాన్స్ పబ్లికేషన్ 'మనీలైఫ్' బుధవారం ఓ కథనం ప్రచురించింది. ప్రభుత్వంతో వాదన చేసిచేసి.. చాలా అలసిపోయానని, అది తన ఆరోగ్యంపై చాలా తీవ్ర ప్రభావం చూపుతోందని ఉర్జిత్ తన సన్నిహితులతో పేర్కొన్నారని ఆ కథనం తెలిపింది.

rbi 08112018 2

రుణ నిబంధనలను సడలించడం ద్వారా ఆర్బీఐ మిగులు నిధులను వాడుకోవాలనుకుంటున్న కేంద్రం ఆలోచను ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ విభేదిస్తున్నారు. దీంతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గత నెలలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. సెంట్రల్ బ్యాంక్‌ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగారిస్తే మహావిపత్తు తప్పకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వెంటనే రంగంలోకి దిగి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీబీకి తగిన సూచనలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, తమ సమావేశాల్లో చర్చలను ఏనాడూ బహిర్గతం చేయమని, తుది నిర్ణయం తర్వాతే ఏ విషయమైనా ప్రకటిస్తామని చెప్పారు. ఇకముందు కూడా ఇలాగే కొనసాగుతుందన్నారు.

rbi 08112018 3

కాగా, పదేపదే ఆర్బీఐపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ఉర్జిత్ రాజీనామా చేసే రిస్క్ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని కేంద్రం పట్టుదలగా ఉన్నట్టు పేరువెల్లడించడానికి ఇష్టపడని కొందరు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ డిమాండ్లకు, నిర్మాణాత్మక చర్చలకు పదేపదే ఆర్బీఐ తిరస్కరించడం వల్ల ప్రభుత్వానికి అసహనం పెరుగుతోందని అధికారులను ఉటంకిస్తూ 'రాయిటర్స్' ఓ వార్తా కథనం ప్రచురించింది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ రిజర్వ్ నుంచి నిధులిచ్చి సహకరించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పదేపదే ఆర్బీఐ తోసిపుచ్చుతోందని ఆ కథనం తెలిపింది. కాగా, 'ఇది సడలించండి...అది సడలించండి' అంటూ తన హయాంలోనూ ప్రభుత్వం నుంచి తనకు లెక్కలేనన్ని ఉత్తరాలు వచ్చేవంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సైతం మంగళవారంనాడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 

 

మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భాజపా యేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యాహ్నం చంద్రబాబు బెంగళూరు బయల్దేరి వెళ్లారు. తొలుత జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బృందానికి దేవెగౌడ, కుమారస్వామి ఘన స్వాగతం పలికారు. జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఇప్పటికే సీఎం రెండుసార్లు దిల్లీ వెళ్లిన నేపథ్యంలో నేటి తెదేపా, జేడీఎస్ నేతల భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.

kumarsawmy 08112018 2

దేవెగౌడ మాట్లాడుతూ నాలుగేళ్ళ ఎన్డీయే పాలన పెద్ద నోట్ల రద్దు వంటి చాలా సమస్యలను సృష్టించిందన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవస్థలపై గురిపెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సహా లౌకికవాద పార్టీల నేతలను కలిశారన్నారు. ఈ నేపథ్యంలో తమపై ఓ బాధ్యత ఉందన్నారు. లౌకికవాద పార్టీలన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవె గౌడ ఆశీర్వాదాలు, మద్దతు కోసం తాను ఇక్కడికి వచ్చానన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బెంగళూరు వచ్చానన్నారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నమ్మక ద్రోహం చేసిందన్నారు.

kumarsawmy 08112018 3

కుమార స్వామి మాట్లాడుతూ లౌకికవాద శక్తులను ఏకం చేయడం కోసం తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. చంద్రబాబు, దేవె గౌడ రాజకీయ లెక్కలు చాలా బాగున్నాయన్నారు. చంద్రబాబు ఎంట్రీతో సీన్ మారిపోయిందని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 1996నాటి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాయావతి, శ‌ర‌ద్‌ప‌వార్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌, ములాయం సింగ్‌యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, ఫ‌రూఖ్ అబ్దుల్లా, సీతారాం ఏచూరితో వరుస భేటీలు నిర్వహించి వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read