‘‘దేశంలోని స్వతంత్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)ని ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది’’ అని ఆ సంస్థ విశ్రాంత ముఖ్య విచారణ అధికారి(సీఐఓ) రఘోత్తమన్‌ ఆరోపించారు. ‘సీబీఐ - ఇటీవలి పరిణామాలు’ అనే అంశంపై చెన్నైలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ‘‘సీబీఐలో నేను 36 ఏళ్లు పని చేసి, పదవీ విరమణ చేశాను. సంస్థ పరువు ప్రతిష్ఠలు దిగజారిపోవడం ఆవేదన కలిగిస్తోంది. నేటి పరిస్థితులో నేను సీబీఐలో పనిచేశానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, అవమానంగా భావిస్తున్నాను.

cbi 05112018 2

సీబీఐ పాలనావ్యవహారాల్లో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ అధ్యక్షుడిని మార్చడం ప్రశ్నార్థకంగా ఉంది. సీబీఐని కాంగ్రెస్‌ తన జేబు సంస్థగా చేసుకుందని విమర్శించిన బీజేపీ... అధికారంలోకి వచ్చాక సంస్థ పరువు ప్రతిష్ఠలనే మంటగలిపింది. సీబీఐలో నిస్వార్థంగా సేవలు చేసిన అధికారులందరిపై బీజేపీ బురదజల్లేలా ప్రవర్తిస్తూ, ఆ దర్యాప్తు సంస్థలో చీలికలు సృష్టించింది. సీబీఐలో ఉన్నతాధికారిని మార్చటం ఇప్పటి దాకా కష్టసాధ్యంగా ఉండేది. అలాంటిది బీజేపీ పాలకులు సునాయాసంగా సీబీఐ ఉన్నతాధికారిని మార్చివేశారు’’ అని అన్నారు. సీబీఐకి ఉన్న అధికారాలను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ పేరును ‘కంట్రోల్డ్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’గా మార్చటం మంచిదని ఎద్దేవా చేశారు.

cbi 05112018 3

‘నేను దేశ సంపదను ఎవరూ దోపిడీ చేయకుండా చౌకీదారు (కాపలాదారు)గా వ్యవహరిస్తాను. నేను లంచం తీసుకోను, ఎవరూ లంచం తీసుకునేందుకు అనుమతించను. ఎవరికీ అన్యాయం జరగని విధంగా వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తాను.’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. కాని ఇవాళ మోదీ హయాంలో సిబిఐలో జరుగుతున్న వ్యవహారాల్ని చూస్తుంటే గత నాలుగున్నరేళ్లలో వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు రాకపోగా, ఆ వ్యవస్థలు మరింత భ్రష్టుపట్టిపోతున్నాయని, సిబిఐ అనే సంస్థ బ్రోకర్లకు అడ్డాగా మారిపోతోందని తెలుస్తోంది. సిబిఐ వంటి ఉన్నత సంస్థలో ఇద్దరు డైరెక్టర్లు ఒకర్ని మరొకరు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం వారిని ఎంపిక చేసిన వారి విజ్ఞతనే ప్రశ్నార్థకం చేస్తున్నది.

ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ని కాంగ్రెస్ పార్టీలో కలిపేయటాన్ని సమర్థించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ మోదీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కాగ్రెస్‌తో తమ పార్టీ కలసి పోరాడటం తప్పెలా అవుతుందో వివరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల పొట్టకొట్టే నరేంద్ర మోదీని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఇది కేంద్రంలోని బీజేపీతో ఆయన లాలూచీకి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్భ్రావృద్ధి, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్ట పెరగటాన్ని చూసి ఓర్వలేకే నిందలు మోపుతున్నారని ఖండించారు.

pr 05112018 2

పంచాయతీ ఎన్నికల్లో గెలవకుండానే ఎలా మంత్రి అయ్యావని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు ఉందా? అని నిలదీశారు. లోక్‌సభకు పోటీ చేయకపోయినా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు. అవినీతికి పాల్పడిన సొంత పార్టీ వారిని సైతం జైల్లో పెట్టించారన్నారు. అదే లోక్‌సభకు ఎన్నికైన ప్రధాని మోదీ బ్యాంకులను లూటీ చేసిన నీరవ్ మోదీని దేశం దాటించారని ఆరోపించారు. మోదీతో గొడవ పెట్టుకునే నైతిక బలం చంద్రబాబుకు లేదని విమర్శించటం మోదీ మెప్పు కోసమేనని అన్నారు. రాఫెల్ వ్యవహారంలో మోదీలో ఏ నైతికత కనిపించిందో తేల్చాలన్నారు. అవినీతి ఆస్థానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించి సంస్థ ప్రతిష్టను మంట గలిపింది గుర్తుకు రాదా అని నిలదీశారు.

pr 05112018 3

రాజకీయ భిక్ష పెట్టిన అద్వానీ కంటతడి పెట్టించిన నిరంకుశ మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రాష్ట్రానికి 75వేల కోట్లు రావాలని తీర్మానించిన పవన్ ఆ మొత్తం ఇవ్వాలని మోదీని ఎందుకు నిలదీయరన్నారు. అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే నైతిక స్థైర్యం లేనందునే చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి నైతిక బలం ఉన్నందునే కేంద్రంపై అవిశ్వాసం పెట్టిందని మంత్రి జవహర్ గుర్తుచేశారు.

స్టార్ట్అప్ పరిశ్రమలను అమరావతికి ఆకర్షించే క్రమంలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకూ ఈ ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వపరంగా జరుగుతుండగా ‘సెడిబస్’ పేరిట మాలక్ష్మి గ్రూపు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అంకుర పరిశ్రమలకు మార్గదర్శిగా ఉండేలా రూపొందించిన సెడిబస్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. ప్రభుత్వ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు సహకరిస్తుండగా, కొన్ని సంస్థలు సామాజిక బాధ్యతగా సహకరిస్తున్నాయి.

sedbus 05112018 2

సెడిబస్ ప్రాజెక్టును మాలక్ష్మి గ్రూపు సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేనుంది. లాటిన్ పదమైన సెడిబస్‌కు తెలుగులో ఉత్ప్రేరకం అనే అర్థం వస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ ప్రాజెక్టు ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడనుంది. వారికి ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలగాలి. పెట్టుబడిదారులు, నిపుణులకు రాష్ట్రంలో కొరత లేదు. తిరుగులేని యువశక్తి కూడా ఉంది. అయితే వీటన్నింటి మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఆశించిన మేర ప్రయోజనాలు చేకూరటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడకు సమీపంలోని నిడమానూరులో ఏర్పాటు చేసిన సెడిబస్ వేదిక ద్వారా అంకుర సంస్థలకు మార్గదర్శనం చేయనున్నారు.

sedbus 05112018 3

హైదరాబాద్‌లోని టీహబ్ తరహాలో అన్ని రకాల కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. ఇప్పటికే వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని మాలక్ష్మి గ్రూపు అధినేత హరిశ్చంద్రప్రసాద్ తెలిపారు. ఏకగవాక్ష విధానంలో ఇది పనిచేస్తుంది. అంకుర సంస్థల ఏర్పాటు నుంచి లాభనష్ట రహిత స్థితి చేరేవరకూ సెడిబస్ సహకరిస్తుంది. సెడిబస్ ప్రణాళిక తొలిదశలో డీప్‌టెక్ ఆటోమేషన్ రంగంలో రోబోటెక్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తదితర రంగాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 100 వరకూ విచారణలు వచ్చాయి. ఏపీలో అంకుర రాయబారుల పేరిట సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపడుతుందని హరిశ్చంద్రప్రసాద్ వివరించారు.

తుపాన్ల సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సమర్థ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఇంధన శాఖ అధికారులు, విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయాల్లో వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (ఎన్‌ఓపీ)ను ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. విపత్తు నిరోధక వ్యవస్థను సృష్టించేందుకుగాను విద్యుత్‌ సంస్థలకు అవసరమైతే 10 నుండి 15 శాతం బడ్జెట్‌ను కేటాయించేందుకు వెనుకాడబోమన్నారు. ఇలాంటి వ్యవస్థ తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా, ఇతర జిల్లాల్లో బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

titlei 04112018 2

తిత్లి తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో చిన్నాభిన్నమైన విద్యుత్‌ వ్యవస్థను కేవలం 15 రోజుల్లోనే పునరుద్ధరించిన విద్యుత్‌ ఉద్యోగులు, సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. 10 వేల మంది ఉద్యోగులు రేయింబవళ్లూ కష్టపడి యుద్ధప్రాతిపదికన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారని ప్రశంసిం చారు. విద్యుత్‌ రంగం సత్తా చాటారన్నారు. తిత్లి, హుదూద్‌ తుపాన్ల్ల సమయంలో విద్యుత్‌ రంగానికి భారీ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. తిత్లి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రికార్డు సమయం లో విద్యుత్‌ సంస్థలు సరఫరాను పునరుద్ధరిం చిన ఉద్యోగులు, సిబ్బంది సేవల్ని మరువలే నన్నారు. ఇలాంటి సమయంలోనే విద్యుత్‌ సంస్థలు కొన్ని పాఠాలు నేర్వాలని, విపత్తు నిరోధక విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

titlei 04112018 3

డిస్కంల స్థాయిలో విపత్తు నిర్వహణకు ప్రత్యేకంగా డైరెక్టర్‌ నేతృత్వంలో ఒక విభా గాన్ని ఏర్పాటు చేయాలని విద్యుత్‌ సంస్థలకు సూచించారు. విప త్తులు సంభవిం చినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకండా తక్షణమే ఎన్‌ఓపీని (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) అమలు చేసే బాధ్యత వారికి అప్పగించాలని చెప్పారు. తిత్లి నేపథ్యంలో సమగ్ర గ్రామీణ తుపాను మాన్యువల్‌ రూపొందించాలని చంద్రబాబు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హుదూద్‌ తుపాను మాన్యువల్‌ను రివైజ్‌ చేయాలని సూచించారు. అధికారుల జీఐ సబ్‌ స్టేషన్లు, మొబైల్‌ సబ్‌ స్టేషన్లు, ఎమర్జెన్సీ రీస్టోరేషన్‌ టవర్లు వంటి వాటిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తమ ప్రభుత్వం ఖర్చుకు వెనకాడబోదని, భూగర్భ కేబుల్‌ వ్యవస్థపైనా దృష్టి పెట్టాలని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read