ఒక తప్పు చేసి, ఆ తప్పుని కరెక్ట్ అని చెప్పటానికి, తప్పు మీద తప్పు చేసి, ప్రతి తప్పుకి దొరికిపోతున్నారు జగన్ తప్పుడు బ్యాచ్. కోడి కత్తి డ్రామా అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ కోడి కత్తితో జగన్ ని గుచ్చినోడు వైసీపీ అని , వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అన్న చెప్పాడు, వాళ్ళ ఊరు మొత్తం చెప్పింది, వాడికి ఫ్లెక్సీ డిజైన్ చేసినోడు చెప్పాడు, వాడే పది పేజీలు లెటర్ రాసి చెప్పాడు, రాష్ట్రం మొత్తం టీవీ లలో చూసింది. అయితే జగన్ తప్పుడు బ్యాచ్ మాత్రం, మార్ఫింగ్ల మీద మార్ఫింగ్లు చేస్తూ, కోడికత్తి దాడి నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా పేర్కొంటూ ఒక నకిలీ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేసారు.

ఈ నకిలీ కార్డు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయటమే కాకుండా, సాక్షాత్తు ఆ పార్టీ అధికారప్రతినిధి జోగి రమేష్ కూడా ఆ నకిలీ కార్డు ను చూపించి మాట్లాడటం జరిగింది. అయితే అబద్ధాలను మార్ఫింగ్ ద్వారా చూపించాలి అన్న తొందరలో వైసీపి జఫ్ఫా బ్యాచ్ చేసిన మార్ఫింగ్ కార్డ్ లో పెద్ద కామెడీ ఏమిటంటే వాళ్ళు కార్డ్ లో చూపించినట్లు " ముమ్మిడివరం మండలం " అమలాపురం నియోజకవర్గంలో లేదు.. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉంది.. కనీస అవగాహన లేకుండా కేవలం ఫోటోషాప్ మాత్రమే తెలిసిన బ్యాచ్ ను నమ్ముకుని ఇలా " వెర్రి పప్పలు " అయిపోయారు. అతి పెద్ద కామెడీ ఏమిటంటే ఆ ఫోటో షాప్ బ్యాచ్ ని నమ్మి, జోగి రమేష్ విపి అవ్వటం.

ఇదే విషయం లోకేష్ కూడా అన్ని ఆధారాలతో తన ట్విట్టర్ లో పోస్తే చేసారు. "వైకాపా ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి.తన అభిమానిని టిడిపి కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ జిమ్మికులు." "కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గం లోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేసారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు. "The party of fraudsters commits another fraud to cover up their fake assassination act. Shame on them. #Jagannatakam" అంటూ ట్వీట్ చేసారు.


ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ‘నా వెనుక ఎవరూ లేరు. ఎవరూ ప్రేరేపించలేదు. బుద్ధిపూర్వకంగానే దాడి చేశా’ అని అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అంత కరుడుగట్టిన వ్యక్తిత్వం శ్రీనివాస్ కు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ శనివారం కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుడు శ్రీనివాసరావును విచారించేందుకు కోర్టు 6 రోజులు అనుమతి ఇచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని ఆయన కుటుంబసభ్యులను మరోసారి విచారించారు.
శ్రీనివాసరావు ఇంట్లో లభించిన మూడు బ్యాంకు ఖాతా పుస్తకాలలోని లావాదేవీలపై ఆరా తీశారు. ఆ ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు జమ అయినట్టు సిట్ అధికారులకు సమాచారం అందింది. అయితే, శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో.. ఆ ఖాతాలను పరిశీలించే పనిని సోమవారానికి వాయిదా వేసుకొన్నారు. ఇప్పటికే అతని కుటుంబసభ్యులు, బంధువులతో సిట్ అధికారులు మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం వారితో మరొకసారి మాట్లాడనున్నారు. లేక రాసిన రేవతి పతి, మరో యువతితోపాటు తాజాగా ఇంకో యువతిని కూడా సిట్ పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని కూడా శ్రీనివాసరావు చెప్పే వివరాలతో పోల్చనున్నారు. గత ఏడాది కాలంలో శ్రీనివాసరావు 9 ఫోన్లు ఎందుకు మార్చాడు? వాటిని కొనడానికి అవసరమైన నగదు ఎలా వచ్చింది? అతని ఆర్థిక వనరులు ఏంటి? అతనికి ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి? నగదు పరిస్థితి, ఇతర లావాదేవీలు ఏంటి? ఈ అంశాలపై సిట్ పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.