‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో , బెస్ట్ సీఎం ర్యాంకింగ్స్ ప్రకటించారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లు 10 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 9 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు. చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 5 శాతంతో ఇద్దరు ఐదో స్థానంలో ఉన్నారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 4 శాతంతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 4శాతంతో ఆరో స్థానంలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ కూడా ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రం ఒడిశాలో ఆయన పాపులారిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి 3 శాతం, అసోం సీఎం శరబానంద సోనోవాల్ 3 శాతం, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 2 శాతం, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ 2 శాతం, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ 2 శాతం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2 శాతం, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ 2 శాతంతో ఉన్నారు.

‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో , లోక్సభలో కమలం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని తేలింది. మిత్రులపై ఆధారపడితే... అది కూడా అరకొర మెజారిటీతో మాత్రమే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెబుతోంది. దీని ప్రకారం... బీజేపీ సొంతంగా 245 స్థానాలు మాత్రం గెలిచే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న ఇతర పార్టీలన్నీ కలిసి 36 స్థానాల్లో గెలవొచ్చు. వెరసి... 281 సీట్లతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 309 స్థానాలు లభిస్తాయని తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 281కి పడిపోవడం గమనార్హం. అదే సమయంలో... యూపీఏ, ఇతరుల బలం పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.




ఇందులో భాగంగా ఆదివారం ఎలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశం నిర్వహించారు. తొలుత నియోజకవర్గం మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. తర్వాత మైకు తీసుకున్న కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్ను జగన్కు ఇచ్చాను. ఇక్కడ ఎవరు ఎటువంటివారో నాకు తెలుసు. ఎవ్వరి మాటా లెక్కచేయను. ఎవరెన్ని చెప్పినా నా స్టైల్ మారదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు.
రెండు రోజుల క్రితం విజయసాయి సమక్షంలో ఇలాంటి గొడవే జరిగింది. విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో సీనియారిటీపై తంగేడు రాజులకు, మండల పార్టీ అధ్యక్షుడికి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే సభలో జరిగిన గొడవను విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయగా...విజయసాయిరెడ్డి వెనుక ఉన్న కొంతమంది సభ్యులు సెల్ను లాక్కొని ఫొటోలను దౌర్జన్యంగా తొలగించారు. దీని పై విలేకరులు భగ్గు మంటున్నారు. విజయసాయిరెడ్డి ఉండగానే, ఇంత జరిగినా, ఆయన ఏమాత్రం వాళ్ళని ఆపలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సమక్షంలో , మీడియా పై దాడి చేసి, ఫూటేజ్ ధ్వంసం చేస్తే, కనీసం విజయసాయి వాళ్ళని ఆపలేదని విలేకరులు బాధపడుతున్నారు. దీని పై చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు.